పడలేదు పునాది.. పారిశ్రామికం సమాధి
పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్లో మంచి వాతావరణం ఉంది. గోకవరం మండలంలోని గుమ్మళ్లదొడ్డి ఏపీఐఐసీ పార్కులో రూ.270 కోట్లతో అస్సాగో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు భూముల కేటాయింపు, అన్నిఅనుమతులు ఆరు నెలల్లోనే ఇచ్చాం.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిరాశ
మాటలే తప్ప.. మేలు చేయని జగన్ సర్కారు
పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్లో మంచి వాతావరణం ఉంది. గోకవరం మండలంలోని గుమ్మళ్లదొడ్డి ఏపీఐఐసీ పార్కులో రూ.270 కోట్లతో అస్సాగో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు భూముల కేటాయింపు, అన్ని
అనుమతులు ఆరు నెలల్లోనే ఇచ్చాం. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు దక్కేలా ఇప్పటికే చట్టం చేశాం. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మంది ఉపాధి పొందుతారు.
2022 నవంబరు 5న గోకవరం పర్యటనలో సీఎం జగన్
ఈనాడు, రాజమహేంద్రవరం
యువత కోసం ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాం.. 23 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం.. కానిస్టేబుల్ పోస్టులు ఏటా భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మోసపూరిత హామీల పరంపరలోని డొల్లతనం ఇప్పటికే బయటపడగా.. తూర్పుగోదావరి జిల్లాలో పలు పరిశ్రమల స్థాపనకు భూమిపూజ చేసినా ఒక్క అడుగు ముందుకు పడని దుస్థితి. గతంలో ఉన్న పరిశ్రమల విస్తరణకు శంకుస్థాపన చేసిన పనుల్లో కొంత పురోగతి ఉన్నా కొత్త యూనిట్లు లేవు. గోకవరం మండలంలో 2022 నవంబరులో శంకుస్థాపన చేసిన అస్సాగో పరిశ్రమ పనులు మాత్రం జరుగుతున్నాయి. పారిశ్రామిక రంగంపై ఆసక్తితో సొంతంగా ఎదుగుదామని ముందుకొచ్చినవారి ఆశలపైనా నీళ్లు జల్లారు జగన్. వైకాపా ప్రభుత్వ చర్యల వల్ల కొత్తవాళ్లు ముందుకురావడం పక్కన పెడితే.. ఆసక్తి ఉన్నవాళ్లు సైతం నిరాశకు గురవుతున్నారు.
పారిశ్రామికవాడకు రెండుసార్లు శంకుస్థాపన చేసినా...
రాజానగరం నియోజకవర్గం కలవచర్లలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు 104 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఇక్కడ రూ.20.65 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు టెండర్లు పూర్తవ్వకుండానే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఏడాది నవంబరు 29న వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఇక్కడ 369 యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా సుమారు అయిదు వేల మందికి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇవే పనులకు టెండర్లు పూర్తయిన తరువాత ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తోందన్న హడావుడిలో ఈ ఏడాది మార్చి 12న మంత్రి గుడివాడ అమర్నాథ్, స్థానిక ఎమ్మెల్యే రాజాతో కలిసి మరోసారి శంకుస్థాపన చేసి నిరుద్యోగులకు తామేదో ఉద్ధరించేస్తున్నట్లు ప్రగల్భాలు పలికారు. 50 రోజులు దాటుతున్నా తట్టెడు మట్టి వేయకపోగా.. వేసిన శిలాఫలకాన్ని సైతం మాయం చేశారు.
కలవచర్లలో పారిశ్రామికవాడకు కేటాయించిన స్థలం
తెదేపా హయాంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కడియం మండలం జేగురుపాడులో సుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వసతులతో పారిశ్రామికవాడ ఏర్పాటు చేశారు. 20 రకాల పరిశ్రమలకు సంబంధించి 216 యూనిట్లు మంజూరు చేశారు. తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం అభివృద్ధి చేసిన స్థలాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్లపట్టాలుగా ఇచ్చేసింది. ఆ స్థలానికి ప్రత్యామ్నాయంగా రాజానగరం మండలం కలవచర్లలో స్థలాన్ని సేకరించారు.
స్థలం ఎక్కడుందో అధికారులకే తెలియదు..!
గత ఏడాది అక్టోబర్ 4న తాడేపల్లి నుంచి వర్చువల్లో కోరుకొండ మండలం కణుపూరులో హైటెక్ ఫార్మా మిల్లెట్ ప్రాసెస్ యూనిట్కు సీఎం శంకుస్థాపన చేశారు. దీంతోపాటు 3 ఎఫ్ ఆయిల్పామ్తో రూ.250 కోట్లతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఆ పరిశ్రమకు సంబంధించి ఇప్పటి వరకు స్థలం ఎక్కడుందో అక్కడి అధికారులకే తెలియందంటే.. జగన్ జమానాలో నిరుద్యోగులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
[ 02-05-2024]
గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
ఇసుక తోడేళ్లు..
[ 02-05-2024]
కట్టడాలకు వినియోగించే ఇసుక కోసం గుంతలు తీసి పచ్చటి బతుకులు కూల్చేశారు. యంత్రాలతో తవ్వకాలు వద్దన్నా వినరు. ప్రశాంత గోదారమ్మ గుండెల్లో పొక్లెయినర్లతో తవ్వి ఇసుక తోడేస్తారు. ఎన్జీటీ హెచ్చరించినా పట్టదు.. కోర్టులు మొట్టికాయలు వేసినా లెక్కలేనితనం. -
వైకాపా కోటలు బద్దలు కొడదాం
[ 02-05-2024]
మండపేటలో బుధవారం నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ వైకాపా అరాచక పాలనపై ధ్వజమెత్తారు. కూటమి అభ్యర్థుల విజయం ద్వారా దీనికి చరమగీతం పాడవచ్చన్నారు. -
బాబ్బాబు.. పార్టీ మారొద్దు..
[ 02-05-2024]
నిడదవోలు వైకాపా నేతలు వరుసగా రాజీనామాలు చేసి జనసేన, తెదేపాల బాట పడుతుండటంతో ఆ పార్టీ ముఖ్య నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఉన్నవారు చేజారిపోకుండా నియోజకవర్గ నాయకుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
‘రౌడీ రాజ్యాన్ని ఓటుతో తరిమికొట్టండి’
[ 02-05-2024]
ఓటుతో రౌడీ రాజ్యాన్ని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఎన్డీయే కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరి, గ్రామీణ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్చచౌదరి పిలుపునిచ్చారు. -
టీకాలకూ ఠికానా లేదు..!
[ 02-05-2024]
వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యమిస్తున్నామని.. అందరికీ మెరుగైన సేవలందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. -
నువ్వూ వద్దు.. నీ పనులూ వద్దు..
[ 02-05-2024]
ఒక్కసారి అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని జగన్మోహన్రెడ్డి వాగ్ధానాలు చేశారు. ప్రజలు నిజమేనని నమ్మి ఓటేశారు.. తీరా పీఠమెక్కిన తర్వాత బటన్ నొక్కడం తప్ప రోడ్లు బాగుచేయడం వంటి కీలక అంశాలు మరిచారు. -
భిక్షనుకున్నారా?.. కక్షగట్టారా..?
[ 02-05-2024]
నిరుపేద ఎస్సీలకు స్వయం ఉపాధి కల్పించేందుకు గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బ్యాంకు లింకేజీ, పూర్తి రాయితీ రుణాలను అందించేవారు. కిరణా దుకాణాలు, టెంటు హౌస్లు, ఆటోలు, కార్లు, వంటి యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఎస్సీలు స్వయం ఉపాధి బాటపట్టేవారు. -
రాజకీయాల్లో నేర చరితులను అడ్డుకోవాలి
[ 02-05-2024]
నేరచరిత్ర ఉన్నవారిని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు పిలుపునిచ్చారు. బుధవారం రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో జిల్లా అభ్యదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘ఎన్నికల భారతం’ -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉందా..?
[ 02-05-2024]
హోం మంత్రిగా మహిళ ఉన్న రాష్ట్రంలో శాంతి, భద్రతలు లేవని, మహిళలపై హత్యలు, అత్యాచారాలకు ఎక్కువయ్యాయని గోపాలపురం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు విమర్శించారు. -
భాజపాకు 200 సీట్లు కూడా కష్టమే
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 200 స్థానాల్లో కూడా గెలవడం కష్టమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇప్పటివరకు జరిగిన రెండు దశల ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమైందన్నారు. -
ఎంపీ గుట్టు బయటపెడతాం: ఆదిరెడ్డి
[ 02-05-2024]
యువతను జగన్ మోసం చేశారని కూటమి అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
చర్చిలో వైకాపా నేతల ప్రచారం
[ 02-05-2024]
కాకినాడ గ్రామీణం రాయుడుపాలెం సీటీసీ చర్చిలో బుధవారం వైకాపా నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు