ఖరీఫ్ ఎరువుల ప్రణాళిక ఖరారు..!
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్లో 1,69,397 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రానున్న ఖరీఫ్ సీజన్లో సుమారు 1,68,780 ఎకరాల్లో వరి సాగు చేపట్టే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏటా ప్రైవేటుగా కొనే దుస్థితి ఏలని రైతుల ఆవేదన
అల్లవరం రైతు భరోసా కేంద్రంలో ఎరువుల నిల్వలు పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు
అన్నదాతలకు సాగులో పంటల దిగుబడి పెంచడంలో ఎరువులు కీలక భూమిక పోషిస్తాయి. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఎరువులకోసం అన్నదాతలు రైతుభరోసా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా పూర్తి స్థాయిలో అవి అందడం లేదు. గడిచిన రబీలో అన్నదాతలను ఎరువుల కొరత తీవ్రంగా వేధించింది. సకాలంలో ఎరువులు అందక చేలల్లో భూసారం తగ్గి ఆ ప్రభావం నేరుగా పంట దిగుబడిపై పడింది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్కు ఎరువుల సరఫరాలో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా సాగుకు అవసరమైన ఎరువుల ప్రణాళిక ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు.
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్లో 1,69,397 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రానున్న ఖరీఫ్ సీజన్లో సుమారు 1,68,780 ఎకరాల్లో వరి సాగు చేపట్టే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కొరవడిన నియంత్రణ
కొందరు ప్రైవేటు వ్యాపారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముకుంటున్న సంఘటనలు ఉంటున్నాయి. ఎరువుల కొరతను కృత్రిమంగా సృష్టిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్న అధికారుల హెచ్చరికలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయనే ఆరోపణలు అన్నదాతల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎరువుల కొరత ఏర్పడినపుడు వ్యాపారులు చెప్పిన ధరకే వాటిని కొనుగోలు చేయాల్సివస్తోందని, దీని వల్ల తమపై అధిక భారం పడుతోందని కర్షకులు వాపోతున్నారు. అధికారులు ఎరువుల విక్రయ దుకాణాలపై గట్టి నిఘా ఉంచి అధిక ధరలు, కల్తీ ఎరువులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
42,689 మెట్రిక్ టన్నులకు అంచనా..
జిల్లాలో వచ్చే ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు అన్ని రకాల రసాయన ఎరువులు కలిపి 42,689 మెట్రిక్ టన్నులు అవసరమని అధికారులు గుర్తించారు. రైతులకు కావాల్సిన ఎరువులను పూర్తి స్థాయిలో ఆర్బీకేల్లో నిల్వఉంచాలి. జిల్లాకు వచ్చిన ఎరువుల కోటాలో ప్రైవేటు వ్యాపారులకు కేటాయించిన అనంతరం అన్నదాతలకు రైతుభరోసా కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా అమ్మాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లాలో 38,049 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వఉన్నట్లు అధికారులు తెలిపారు.
నిలబడే రకాలకు ప్రా‘ధాన్యం’..
ఖరీఫ్ సీజన్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ముంపును తట్టుకునే వరి ధాన్యం రకాలనే సాగు చేయాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఎంటీయూ విభాగానికి చెందిన 1318, 1064, 1061 రకాలను ఎంచుకోవాలంటున్నారు. వీటి పంట కాలం 150 రోజులు ఉంటుంది. ప్రైవేటు రకానికి చెందిన సంపద ఎన్పీ 9558 పంట కాలం 135 రోజులైనా, ఈ రకాలు ఈదురు గాలులకు తట్టుకుని నిలబడతాయంటున్నారు. స్వర్ణ రకానికి చెందిన 7029 అధిక దిగుబడి ఇచ్చినా ముంపునకు పడిపోతుందని, రైతులు నష్టాల బారినపడే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
పూర్తిగా అందుబాటులో ఉంచుతాం
జిల్లావ్యాప్తంగా మండలం, డివిజన్ల వారీగా ఏ రకం ఎరువులు ఎన్ని మెట్రిక్ టన్నులు అవసరమో వ్యవసాయ సిబ్బంది ద్వారా సమాచారం సేకరించాం. జిల్లాకు కేటాంయించిన ఎరువుల్లో 50 శాతం ప్రైవేటు వ్యాపారులకు ఇచ్చి మిగతాది సహకార సంఘాలు, ఆర్బీకేల ద్వారా అమ్మేలా ప్రణాళిక సిద్ధం చేశాం. ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేటు దుకాణాల్లో అధిక ధరలకు విక్రయించినట్లు ఫిర్యాదులు వస్తే తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తాం.
వి.బోసుబాబు, జిల్లా వ్యవసాయాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
[ 14-06-2024]
రౌతులపూడిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్ర పటానికి తెదేపా నాయకులు, పింఛనుదారులు శుక్రవారం ఉదయం పాలాభిషేకం చేశారు. -
చంద్రన్న సంతకం.. జనమంత సంబరం
[ 14-06-2024]
అన్నార్తుల ఆకలి తీర్చేలా.. అవ్వాతాతల మోములో ఆనందం రెట్టింపు అయ్యేలా.. అవకాశాలు యువత అందిపుచ్చుకునేలా.. ఆందోళన కలిగించిన భూ హక్కు చట్టం నుంచి ఊపిరి పీల్చుకునేలా.. సీఎం చంద్రబాబు చేసిన అయిదు సంతకాలతో ఉమ్మడి జిల్లావాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి. -
ఆశల ద్వీపంలో..అడుగు ఇంకెప్పుడు?
[ 14-06-2024]
గోదావరి వరదలకు సముద్రంలో కొట్టుకొచ్చే ఇసుక మేటలతో సహజ సిద్ధంగా 200 ఏళ్ల క్రితం ఏర్పాటైన ద్వీపం.. హోప్ ఐలాండ్. తాళ్లరేవు మండలం కోరింగ పంచాయతీ పరిధి అభయారణ్యంలో ఇదో భాగం.. -
మీ సహకారం ఇక చాలు!
[ 14-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు రద్దు చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొందరు తమ పదవుల నుంచి తప్పుకోగా మిగిలిన వారు మిన్నకుండిపోయారు. -
కువైట్ అగ్నిప్రమాదం.. జిల్లావాసులు ఇద్దరి మృతి
[ 14-06-2024]
మంచి వేతనం లభిస్తుందని.. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవచ్చని.. కోటి ఆశలతో కువైట్ వెళ్లారు. నా అనే వాళ్లందర్నీ వదిలి ఎడారి దేశానికి వెళ్తే.. అక్కడే అసువులు బాయడంతో వారి కుటుంబాల్లో అంతులేని ఆవేదన మిగిలింది. -
పుస్తకాలు లేకుండానే తరగతులు.. పస్తులతోనే పాఠాలు
[ 14-06-2024]
విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు అందించి వారికి అధ్యాపకులతో బోధన చేయిస్తేనే మంచి ఫలితాలు రాబట్టగలం. అంతర్జాతీయ ప్రమాణాలంటూ గడిచిన అయిదేళ్లుగా ఊదరగొట్టేసిన వైకాపా ప్రభుత్వం -
ఇక చేపల వేట షురూ..!
[ 14-06-2024]
బంగాళాఖాతం తూర్పు తీరంలో వేట సాగించేందుకు మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు. 61 రోజుల నిషేధ సమయం నేటి అర్ధరాత్రితో ముగియనుంది. -
ఇదో రకం గోల్మాల్
[ 14-06-2024]
తమకు తెలియకుండా తమ భూములపై వీఆర్వో ఇచ్చిన కౌలుకార్డులతో నర్సిపూడి చైతన్యగోదావరి గ్రామీణ బ్యాంకులో కొందరు వ్యక్తులు రైతు రుణాలు పొందడంపై గురువారం స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. -
మార్కెట్ కమిటీల కుర్చీలు ఖాళీ
[ 14-06-2024]
గత ప్రభుత్వ హయాంలో మార్కెటింగ్ కమిటీలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. ఎక్కడా రైతులకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. వీటి పదవీకాలం ముగిసిన తర్వాత త్రిమెన్ కమిటీలను నియమించారు. -
అన్నివర్గాలకు మేలు చేసేందుకు పవన్ కల్యాణ్ కృషి
[ 14-06-2024]
రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. -
యథాస్థానంలో మోరంపూడి పైవంతెన శిలాఫలకం
[ 14-06-2024]
రాజమహేంద్రవరం గ్రామీణంలోని మోరంపూడి పైవంతెనకు సంబంధించిన పాత శిలాఫలకాలను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నేతృత్వంలో గురువారం యథాస్థానంలో ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే సీఎం సతీమణి రాజీనామా
-
‘కాళేశ్వరం’పై కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ విచారణ
-
జులై 22న కేంద్ర బడ్జెట్.. జులై 3న ఆర్థిక సర్వే..!
-
చిరు ‘విశ్వంభర’లో బాలీవుడ్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్
-
కువైట్ అగ్నిప్రమాదం.. కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు
-
సూపర్-8కి చేరిన అఫ్గాన్.. కివీస్ ఔట్.. రేసులో ఇంగ్లండ్