ఏటా మాటలు.. ఇవ్వరే మూటలు?
నాగార్జునసాగర్ కుడి కాలువ పరిధిలో గత ఐదేళ్లుగా నిధుల కొరతతో కాలువల మరమ్మతులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి.
ప్రతిపాదనలతో సరిపెడుతున్నారు
మరమ్మతుకు నోచుకోని కాల్వలు
8.48లక్షల ఎకరాల ఆయకట్టుపై నీలినీడలు
ఈనాడు-అమరావతి
పెదనందిపాడు బ్రాంచ్ కాలువలో పెరిగిన పిచ్చిమొక్కలు
నాగార్జునసాగర్ కుడి కాలువ పరిధిలో గత ఐదేళ్లుగా నిధుల కొరతతో కాలువల మరమ్మతులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. నీటితీరువా వసూలు కాకపోవడం, ప్రభుత్వం నుంచి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో నిధుల కొరత వెంటాడుతోంది. ఏటా క్షేత్రస్థాయి నుంచి ప్రతిపాదనలు పంపడం.. నిధుల కొరతతో ఉన్నతాధికారులు మంజూరు చేయకపోవడంతో కాలువలు అధ్వానంగా తయారయ్యాయి.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి కూడా కాలువ మరమ్మతుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలో 8.48 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. నిధుల కొరతతో ఇప్పటికీ కాలువల మరమ్మతుపై స్పష్టత లేకపోవడంతో జలవనరులశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినా పనులు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. గతేడాది కాలువలకు సాగునీరు విడుదల చేయకపోవడంతో కాల్వకట్టలు అధ్వానంగా ఉండడంతోపాటు పిచ్చిమొక్కలు పెరిగి నీటిప్రవాహానికి అడ్డంకిగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కనీస మరమ్మతు చేయకపోతే ఈఏడాది కూడా సాగునీటి కష్టాలు తప్పవని సాగుదారులు ఆందోళన చెందుతున్నారు.
గుంటూరు గ్రామీణ మండలం ఓబుళనాయుడుపాలెం వద్ద
కోతకు గురైన వంకాయలపాడు మేజరు కాలువ కట్ట
ఐదేళ్లుగా అటకెక్కిన నిర్వహణ
నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఆయకట్టు ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువల నిర్వహణ అటకెక్కింది. ఏటా నిధులు మరమ్మతు చేసి నిర్వహణ చేపట్టకపోవడంతో కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. గతేడాది సాగునీరు రాకపోవడంతో కట్టలు జారిపోయి కొన్నిచోట్ల బలహీనమయ్యాయి. గతేడాది కనీస మరమ్మతులు చేయడానికి సుమారు రూ.37కోట్లతో ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు చేయాలని కోరారు. బడ్జెట్లో రూ.2.04కోట్లు కేటాయించగా ఆ నిధులు కూడా గతంలో చేసిన బకాయిలకు రూ.2కోట్ల సొమ్ము జమకావడంతో కొత్తగా పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అదనంగా మరికొన్ని పనులకు అనుమతి ఇవ్వడంతో కొన్ని పనులు చేసినా బిల్లులు రాకపోవడంతో అర్ధంతరంగా ఆగిపోయాయి. దీంతో గతేడాది కూడా కాలువల నిర్వహణ పనులు చేయలేకపోయారు. బ్రాంచ్, మేజరు కాలువల్లో కొన్నిచోట్ల రివెట్మెంట్లు, సిమెంట్ నిర్మాణాలు కూలిపోయాయి. మైనరు కాలువల్లో పిచ్చిమొక్కలు, తూటుకాడ పెరిగి నీటిప్రవాహం ముందుకు వెళ్లలేని పరిస్థితి. కాలువకట్టలు దెబ్బతిని కొన్నిచోట్ల పగుళ్లు వచ్చాయి. పిచ్చిమొక్కలు పెరిగి మైనరు కాలువలు ఆనవాలు కనిపించని పరిస్థితి నెలకొంది. కాలువల నిర్వహణ లేకపోవడంతో అత్యంత అధ్వానంగా తయారై నీటిప్రవాహం ముందుకు వెళ్లకుండా అడ్డంకులు ఉన్నాయి.
కీలక సమయంలో నిర్లక్ష్యం
నాగార్జునసాగర్ కాలువల మరమ్మతులు నీటి విడుదలకు ముందే పూర్తి చేయాలి. ప్రస్తుతం కాలువలకు నీటి విడుదల లేనందున మరమ్మతు చేయడానికి అనువైన సమయం. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే జులై నెల నాటికి పూర్తిచేయవచ్చు. కాల్వల్లో పిచ్చిమొక్కలు తొలగించడం, షట్టర్లు సరిచేయడం, కాలువకట్టలు బలోపేతం చేయడం, తూటుకాడ తీయడం వంటి చిన్న చిన్న పనులు రోజుల వ్యవధిలోనే పూర్తిచేయవచ్చు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురిసి జలాశయాలకు నీరు వచ్చిన తర్వాతే కాలువలకు నీటిని విడుదల చేస్తారు. జూన్, జులై నెలలు కీలకమైనందున వెంటనే ప్రభుత్వం నిధుల విడుదలకు ఆమోదం తెలిపి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.
ప్రతిపాదనలు సిద్ధం చేశాం
నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలో క్షేత్రస్థాయి ఇంజినీర్లు కాలువలు పరిశీలించి ప్రతిపాదనలు తయారుచేసి సిద్ధం చేశారు. కాల్వల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి కోసం వేచి చూస్తున్నాం. అనుమతి ఇస్తే ప్రతిపాదనలు పంపి ఆమోదం పొందిన వెంటనే పనులు చేపడతాం.
వరలక్ష్మి, పర్యవేక్షక ఇంజినీరు, లింగంగుంట్ల సర్కిల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జిల్లాలో సగటు. 3.6 మి.మీ వర్షపాతం
[ 17-06-2024]
జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు సగటున 3.6 మిల్లీ మీటర్లువర్షపాతం నమోదైంది. -
వీరు మారరంతే
[ 17-06-2024]
రాష్ట్రంలో వైకాపా పాలన పోయి కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడినా ఇంకా కొందరు పోలీసులు వైకాపాకు అండగా నిలుస్తున్నారు. ఆ పార్టీ నాయకులపై అందే ఫిర్యాదులను తేలిగ్గా తీసుకుంటున్నారు. -
హక్కు పత్రాలకు ఎదురుచూపులు
[ 17-06-2024]
ఖరీఫ్ వ్యవసాయ పనుల సీజన్ ప్రారంభమైంది. దుక్కులు దున్నడం, పొలాలకు పశువుల ఎరువు తరలించడం, పంట వ్యర్థాలను శుభ్రం చేసుకోవడం తదితర పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. -
చేయి తడిపితేనే అనుమతులు లేకుంటే కొర్రీలు
[ 17-06-2024]
భవన నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పట్టణ ప్రణాళికాధికారులు కొందరు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. -
ప్రజలకు యువనేత భరోసా
[ 17-06-2024]
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ రెండోరోజు నిర్వహించిన ‘ప్రజా దర్బార్’కు ప్రజలు పోటెత్తారు. ఉండవల్లి నివాసంలో ఆదివారం ఉదయం నియోజకవర్గ ప్రజలను కలసి సమస్యలను తెలుసుకున్నారు. -
21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లు
[ 17-06-2024]
రానున్న 21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించేలా చర్యలు చేపడతున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. -
రూ.లక్షలు వ్యయం.. ఏం లాభం
[ 17-06-2024]
జీజీహెచ్లో అత్యవసర పరిస్థితుల్లో రోగులను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన ఇనుప మెట్లు ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారాయి. -
కేటాయింపుల్లో కోత
[ 17-06-2024]
సర్వజనాసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స అందించాలని ప్రభుత్వ ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. -
నగరపాలక సంస్థలో అవినీతిపై విచారణ జరిపించండి
[ 17-06-2024]
గుంటూరు నగరపాలక సంస్థలో గత అయిదేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని నారెడ్కో అధ్యక్షుడు నాగవంశీ కోరారు. -
గుణాత్మక విద్యను దెబ్బతీసే జీవో రద్దు చేయాలి
[ 17-06-2024]
గుణాత్మక విద్యను దెబ్బతీసి ఉపాధ్యాయులపై పనిభారం పెంచుతూ గత ప్రభుత్వం తెచ్చిన జీవోనం.117ను రద్దు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
నారా లోకేశ్ ‘ప్రజా దర్బార్’ నేడు
[ 17-06-2024]
దేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ సోమవారం ఉండవల్లి నివాసంలో జరిగే ‘ప్రజా దర్బార్’లో పాల్గొంటారు. -
మృత్యు మార్గాలు
[ 17-06-2024]
రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. శిథిలావస్థ వంతెనలు, అధ్వాన రహదారులు, ప్రమాదకర మలుపులు, అతి వేగం, రోడ్డు నిర్మాణ లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. -
ఉద్యోగాల పేరుతో మోసాలు.. తస్మాత్ జాగ్రత్త
[ 17-06-2024]
తాత్కాలిక ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. -
చైనాలో పందిళ్లపల్లి కుర్రోడి సత్తా
[ 17-06-2024]
ఆ యువకుడి చిన్నతనంలో విధి వక్రీకరించింది... దీంతో కుడిచేయి మణికట్టు పై వరకు పోగొట్టుకున్నారు.. అయినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు.. -
మాతాశిశువులకు మేలు జరిగేనా?
[ 17-06-2024]
పల్నాడు జిల్లాలో 20 లక్షల మంది జనాభా. ఏటా 15వేల శిశు జననాలు.. అయినా మాతా శిశు సంరక్షణకు ప్రత్యేకంగా ప్రసూతి విభాగం లేని దుస్థితి నెలకొంది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు నామమాత్రపు సేవలకే పరిమితమయ్యాయి. -
చెత్తపన్ను నుంచి విముక్తి
[ 17-06-2024]
చెత్తపన్ను భారం నుంచి పట్టణాల ప్రజలకు విముక్తి లభించింది. వైకాపా పాలనలో గతంలో ఎన్నడూలేని విధంగా చెత్తపన్నును అమల్లోకి తెచ్చి నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
[ 17-06-2024]
అద్దంకిలో మూడు దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సీఐ పి.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆదివారం అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరిచారు. -
సుద్దముక్కకు పైసల్లేవు
[ 17-06-2024]
జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ నిర్వాహకంతో ప్రభుత్వ పాఠశాలల్లో సుద్దముక్కకు పైసలు అందుబాటులోలేని దుస్థితి ఏర్పడింది. రెండు విద్యా సంవత్సరాల్లో పాఠశాల నిర్వహణ గ్రాంట్ను ప్రభుత్వం మంజూరు చేయలేదు. -
బదిలీలపై ఉత్కంఠ
[ 17-06-2024]
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో జిల్లా అధికారులతో పాటు డివిజన్, మండల స్థాయి అధికారుల బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. -
ఇద్దరి అపహరణ.. రక్షించిన పోలీసులు
[ 17-06-2024]
ఆర్థిక వివాదాల నేపథ్యంలో గచ్చిబౌలిలో కిడ్నాప్ గురైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు వికారాబాద్లో రక్షించారు.
తాజా వార్తలు (Latest News)
-
కరెంటు షాక్ ఇచ్చి.. దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు!
-
డిలీట్ చేసిన మెసేజ్లు భార్య కంటికి.. యాపిల్పై రూ.53 కోట్లకు దావా
-
జగన్పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయండి: ఏపీ హోంమంత్రి అనిత
-
‘తక్షణం రాజ్భవన్ నుంచి వెళ్లిపోండి..’.. పోలీసులకు బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
మదనపల్లెలో కిలో టమాటా@ రూ.80
-
హామీ మేరకు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: హరీశ్రావు