హక్కులకు రక్షణ కవచాలు
ఇలా చదువుకు దూరమవడం, బాల్య వివాహాలు, శారీరక, మానసిక వేధింపులు బాలలకు శాపంగా మారుతున్నాయి. వీటిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోన మదనపడుతున్నారు. తమకు హక్కులు ఉన్నాయన్న సంగతి కూడా వారికి తెలియదు.
గ్రామాల్లో బాలల పంచాయతీలే వేదిక
నెహ్రూనగర్ (గుంటూరు), న్యూస్టుడే
సమావేశంలో సమస్యలపై చర్చిస్తున్న బాల, బాలికలు
ఇలా చదువుకు దూరమవడం, బాల్య వివాహాలు, శారీరక, మానసిక వేధింపులు బాలలకు శాపంగా మారుతున్నాయి. వీటిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోన మదనపడుతున్నారు. తమకు హక్కులు ఉన్నాయన్న సంగతి కూడా వారికి తెలియదు. ఇందుకు ఒక వేదిక, ఆసరా అవసరమని చైల్డు రైట్స్ అడ్వకెసీ ఫౌండేషన్ (క్రాఫ్) స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. బాలల సమస్యలపై వారితోనే ఓ కమిటీ ఏర్పాటు చేసి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవచ్చని భావించింది. అలా రూపుదిద్దుకున్నవే బాలల పంచాయతీలు. ఈ క్రమంలో క్రాఫ్ సంస్థకు జిల్లా శిశు సంక్షేమశాఖ, జిల్లా బాలల సంరక్షణ కేంద్రం అన్ని విధాలా సహకరిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
ఒక్కొక్క బాల పంచాయతీలో 30 మంది బాల, బాలికలు ఉంటారు. ఆ గ్రామంలోని 13 నుంచి 18 ఏళ్ల లోపు 7వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ చదివే వాళ్లను తీసుకుంటారు. అన్ని సామాజిక తరగతుల వారు ఉంటారు. 30 మందితో ఒక కోర్ కమిటీని ఎన్నుకుంటారు. సర్పంచి, కార్యదర్శి, ముగ్గురు వార్డు సభ్యులు కూడా కోర్ కమిటీలో ఉంటారు. గ్రామ సర్పంచి ఛైర్మన్గా ప్రతి గ్రామంలో బాలల రక్షణ కమిటీని ఏర్పాటు చేస్తారు.
200కు పైగా సమస్యల పరిష్కారం..
క్రాఫ్ స్వచ్ఛంద సంస్థ గత ఏడేళ్లుగా బాలల హక్కుల పరిరక్షణ, వారిలో నాయకత్వ లక్షణాల పెంపుపై వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. క్రాఫ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ తంబి పర్యవేక్షణలో జిల్లాలో వెంకట్, జయరాజులు ఈ కార్యక్రమాలను సమన్వయపరుస్తున్నారు. ఇలా ఇప్పటివరకు జిల్లాలో బాల పంచాయతీల ద్వారా గుర్తించిన 200కు పైగా సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారానికి కృషి చేశారు.
కమిటీ తీర్మానంతో...
ప్రతి నెల నిర్వహించే బాల పంచాయతీ సమావేశంలో సభ్యులు గుర్తించిన సమస్యలను కోర్ కమిటీ దృష్టికి తీసుకు వచ్చి ఒక తీర్మానం చేస్తారు. దానిని కమిటీ ఛైర్మన్గా ఉన్న సర్పంచి ద్వారా సంబంధిత అధికారులు, ఆయా కుటుంబాల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారు. అందుకు బాలల పంచాయతీకి ప్రజాప్రతినిధులు, గ్రామ మహిళా కార్యదర్శులు, జిల్లా బాలల సంరక్షణ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, క్రాఫ్ ప్రతినిధులు అన్ని రకాలుగా అండగా ఉంటారు.
స్నేహ గ్రామాలుగా 15 ఎంపిక...
బాల, బాలికలకు ఎటువంటి సమస్యలు లేకుండా బాలల స్నేహ గ్రామాలుగా తీర్చిదిద్దాలని భావించారు. జిల్లాలో 15 గ్రామాలు ఎంపిక చేసుకున్నారు. పెదకాకాని మండలంలోని కొప్పురావూరు, తంగెళ్లమూడి, అనమర్లపూడి, ఉప్పలపాడు, తుళ్లూరు మండలంలో అనంతవరం, వడ్లమాను, నెక్కొల్లు, బోరుపాలెం, తాడికొండ మండలంలో నిడుముక్కల, కంతేరు, లచ్చన్నగుడిపూడి, తెనాలి మండలంలో హాఫ్పేట, చేబ్రోలు మండలంలో చేకూరు, గుంటూరులో కృష్ణబాబుకాలనీ, కొండా వెంకటప్పయ్యకాలనీలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో బాలల హక్కులు, వాటి పరిరక్షణపై అవగాహన సదస్సులు, బాలల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
* 16 సంవత్సరాల బాలిక తండ్రి మృతి చెందాడు. మత్తుకు బానిసైన తల్లి పట్టించుకోవడం లేదు. బాలల పంచాయతీ గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యుసీ) ఆ తల్లికి కౌన్సెలింగ్ ఇప్పించడంతోపాటు బాలికను పునరావాస కేంద్రానికి తరలించారు. చేతి వృత్తులు నేర్పిస్తూ 10వ తరగతి ప్రైవేటుగా రాయిస్తున్నారు.
* అనారోగ్య సమస్యతో 6వ తరగతిలో బాలిక చదువు ఆపేసింది. అయిదేళ్ల తర్వాత ఆరోగ్యం కుదుట పడడంతో చదువుకోవాలనుకుంటున్న విషయం తెలుసుకున్న బాలల పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లింది. ఆ బాలికతో ప్రైవేటుగా 10వ తరగతి రాయించారు. ఇప్పడు ఆ యువతి ఇంటర్ చదువుతోంది.
* ఓ గ్రామంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు గుర్తించిన బాలల పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో స్పందించిన అధికారులు దానిని నిలిపి వేయించారు.
పెద్దలు పట్టించుకోవాలి -ఫ్రాన్సిస్ తంబి, క్రాఫ్, రాష్ట్ర ప్రోగ్రామ్ డైరెక్టర్
బాలల్లో చిన్నతనం నుంచి నాయకత్వ లక్షణాలు పెంపొందించాలనే ఉద్దేశంతో పంచాయతీల ఏర్పాటు చేపట్టాం. పిల్లలు సమస్యలు, వారి బాధలు చెప్పిన వెంటనే పెద్దలు పట్టించుకోవాలనేది మా ఉద్దేశం. ప్రతి గ్రామ, పట్టణాల్లో ఇటువంటి పంచాయతీల విధానాన్ని అంది పుచ్చుకొని వారి సమస్యల పరిష్కారానికి అందరూ చొరవ తీసుకుంటే బాగుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు