ఉలిక్కిపడిన అలవాల
ప్రశాంతంగా ఉన్న పల్లె ఒక్కసారిగా తుపాకీ కాల్పులతో ఉలిక్కి పడింది. రొంపిచర్ల మండలం అలవాలలో బుధవారం రాత్రి తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై ఇంటిలోనే దాడి జరగడం జిల్లాలోనే చర్చనీయంశంగా మారింది.
తుపాకీ కాల్పుల మోతతో ఆందోళనలో గ్రామస్థులు
కాల్పుల్లో గాయాలైన బాలకోటిరెడ్డిని వైద్యశాలకు తరలిస్తున్న బంధువులు
రొంపిచర్ల, న్యూస్టుడే: ప్రశాంతంగా ఉన్న పల్లె ఒక్కసారిగా తుపాకీ కాల్పులతో ఉలిక్కి పడింది. రొంపిచర్ల మండలం అలవాలలో బుధవారం రాత్రి తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై ఇంటిలోనే దాడి జరగడం జిల్లాలోనే చర్చనీయంశంగా మారింది. ఆధిపత్య పోరులో భాగంగా ఆరు నెలల వ్యవధిలో ఆయనపై రెండోసారి హత్యాయత్నం జరగడం అది తుపాకీతో కాల్పులు జరపడం గమనార్హం. జిల్లాలో తుపాకీ పేలుళ్ల సంస్కృతి బయటపడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. మండల తెదేపా అధ్యక్షుడిగా, ఎంపీపీగా, గ్రామ సర్పంచిగా పని చేశారు. మాజీ సభాపతి కోడెల శివప్రసాద్కి నమ్మిన బంటుగా పేరుంది. అదే ఒరవడిలో మండలంలో తెదేపా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు. అలవాల పంచాయతీ ఎన్నికల సమయంలో తెదేపా, వైకాపా హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో వైకాపా బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఆ తరువాత గ్రామంలో వైకాపా, తెదేపాలో వర్గపోరు మొదలైంది. ఈ వర్గపోరుకి అలవాల తిరునాళ్ల మరింత అజ్యం పోసింది. తెదేపాలో రెండు వర్గాలు రెండు ప్రభలను, వైకాపాకు చెందిన రెండు వర్గాలు రెండు ప్రభలు కట్టారు. ప్రభల వద్దకు ఇరు పార్టీల నేతలు వచ్చిన క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అది కాస్తా పార్టీ రంగు పులుముకొని వివాదాలకు దారి తీసింది. పార్టీలపరంగా వివాదాలు సద్దుమణిగినా ఆధిపత్య పోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ ఆధిపత్య పోరులో భాగంగానే ఆరు నెలల వ్యవధిలో మండల పార్టీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై రెండుసార్లు దాడులు జరిగాయి.
కాల్పుల ఘటనను వివరిస్తున్న బాలకోటిరెడ్డి భార్య నాగేంద్రమ్మ
కొనసాగుతున్న బందోబస్తు
తుపాకీ కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు అర్ధరాత్రి గ్రామానికి పెద్దఎత్తున తరలివచ్చారు. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు, గ్రామీణ సీఐ భక్తవత్సలరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని కూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దింపారు. సంఘటనా స్థలంలో రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. రక్త నమునాలను సేకరించారు. అనంతరం తుపాకీ కోసం పోలీసులు కోటిరెడ్డి ఇంటి పరిసరాల్లోను, పొలాలను జల్లెడపట్టారు. బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. క్షతగాత్రుని భార్య అందించిన ప్రాథమిక సమాచారంతో అలవాలలో పమ్మి వెంకటేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడంతో కేసు ఒక కొలిక్కి వచ్చింది. అతను ఇచ్చిన సమాచారంతో మిగిలిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న గన్ను స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ కాల్పుల సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని పల్నాడు వాసులు కోరుతున్నారు. అలవాల గ్రామంలో పోలీసు బందోబస్తు కొనసాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు