logo

రోటావేటర్‌లో పడి బాలుడి దుర్మరణం

పొలం చదును చేస్తున్న రోటావేటర్‌లో పడి విద్యార్థి మునగంటి ఆవేష్‌(12) దుర్మరణం పాలైన సంఘటన ఆదివారం సాయంత్రం వెంకటాపురంలో చోటుచేసుకుంది.

Published : 06 Feb 2023 05:32 IST

వెంకటాపురం(అద్దంకి), న్యూస్‌టుడే: పొలం చదును చేస్తున్న రోటావేటర్‌లో పడి విద్యార్థి మునగంటి ఆవేష్‌(12) దుర్మరణం పాలైన సంఘటన ఆదివారం సాయంత్రం వెంకటాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు.. ఆవేష్‌ తండ్రి వీరాచారికి చెందిన పొలాన్ని రోటావేటర్‌తో చదును చేసేందుకు సిద్ధమయ్యారు. గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డికి చెందిన యంత్రంతో చదును చేస్తుండగా ఆవేష్‌ను ఆయన తండ్రే ట్రాక్టర్‌పై చోదకుడి పక్కన కూర్చోబెట్టాడు. పది నిమిషాల వ్యవధి అనంతరం ట్రాక్టర్‌ కుదుపులకు చోదకుడి పక్కనే కూర్చున్న ఆవేష్‌ ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు. నేరుగా రోటావేటర్‌ యంత్రంలో పడటంతో శరీరభాగాలు ముక్కలై సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యాడు. ఆవేష్‌ అద్దంకి పట్టణంలోని ఆంగ్ల మాద్యమం పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. మృతుడికి తల్లి, సోదరి ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంకటాపురం వాసులు ఘొల్లుమన్నారు. సంఘటనా స్థలాన్ని అద్దంకి సీఐ ఎం.రోశయ్య, ఎస్సై సమందర్‌వలి, సిబ్బంది పరిశీలించారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి తరలించనున్నట్లు ఎస్సై ఆర్‌.ఆదిలక్ష్మి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని