అనుమతి ఒకచోట..ప్రచారం మరోచోట
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని యంత్రాంగం చెబుతుంటే.. అధికార పార్టీకి చెందిన వారు ఉల్లంఘిస్తూనే ఉన్నారు.
కలెక్టరేట్ (గుంటూరు), న్యూస్టుడే: ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని యంత్రాంగం చెబుతుంటే.. అధికార పార్టీకి చెందిన వారు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అనుమతుల్లేకుండా డప్పు మేళాలతో ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోబాలకు గురిచేసే కార్యక్రమాలను గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే గురువారం చేసిన ఎన్నికల ప్రచారం మరో ఎత్తుగా నిలిచింది. సాయంత్రం ఇజ్రాయేల్ పేటలో ఇంటింటి ప్రచారాన్ని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా చేపట్టారు. అనుమతి తీసుకోలేదని అధికారులు చెబుతున్నా పట్టించుకోలేదు. మేం అనుమతి తీసుకున్నామంటూ కొంతసేపు ప్రచారం చేశారు. ఎన్నికల సంఘం బృందాల సిబ్బంది అక్కడికి చేరుకొని అనుమతి లేనందున ప్రచారాన్ని నిలిపివేయాలని సూచించినా పట్టించుకోలేదు. చాలా సేపటి తర్వాత ఆ పార్టీ నాయకులు ప్రచారం చేయాల్సిన ప్రాంతం పేరు మారిందన్నారు. అధికారులు ఆ ప్రాంతంలోనే ప్రచారం చేసుకోవాలని సూచించారు. తర్వాత అక్కడి నుంచి సీతానగర్లో ఎన్నికల ప్రచారానికి తరలివెళ్లారు. ప్రచారం ప్రారంభానికి ముందుగానే ఎన్నికల విధుల్లోని సిబ్బంది వచ్చి అనుమతి లేదని చెప్పినా పట్టించుకోకుండా, ప్రాంతం పేరు పొరపాటున సీతానగరం అని నమోదు చేసినట్లు తెలుపుతూ కప్పిపుచ్చుకున్నారు.
ఎమ్మెల్యేకే కాదు... అభ్యర్థికీ పీఏనే
ఎమ్మెల్యే ముస్తఫా వద్ద పీఏగా నియమితులైన మస్తాన్వలి, కోడ్ అమల్లోకి వచ్చినా తిరిగి విధుల్లోకి వెళ్లకుండా ఎమ్మెల్యే కార్యాలయంలోనే కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె నూరిఫాతిమాను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఆమె వెంట కాలనీలకు, పార్టీ కార్యక్రమాలకు, ప్రచారాలకు తిరిగేస్తున్నారు. గురువారం ఇజ్రాయేల్ పేటలో జరిగిన ప్రచారంలోనూ పీఏ పార్టీ నాయకులతో ముచ్చటిస్తూ కనిపించారు. కోడ్ అమల్లోకి వచ్చినా తిరిగి మాతృ ప్రభుత్వ శాఖకు రాకపోవడంతో ఇంటర్ విద్య అధికారులు పీఏ మస్తాన్వలిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలకులు కా‘పాడి’న పాపాన పోలేదు
[ 27-04-2024]
లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తానని, పాడి రైతులను ఆదుకుంటానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి హామీలు అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలు రద్దు చేశారు. -
26 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
బాపట్ల లోక్సభ, జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 150 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
తెదేపా గూటికి మాజీ మంత్రి డొక్కా
[ 27-04-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దళితుల్లో సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
బరిలో మిగిలేదెవరో?
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల సమర్పణ, పరిశీలన కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు గుర్తింపు, నమోదైన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేశారు. -
‘భూ’మంతర్ ఖాళీ
[ 27-04-2024]
రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల రీసర్వే నిర్వహిస్తున్నాం. భూవివాదాలన్నీ శాశ్వతంగా పరిష్కరిస్తాం. -
ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని మా లక్ష్యం
[ 27-04-2024]
-
గంజాయి బ్యాచ్ ఆగడాలపై నిరసన
[ 27-04-2024]
గంజాయి బ్యాచ్ ఆగడాలు భరించలేకున్నామంటూ.. వారిపై చర్యలు తీసుకోవాని శుక్రవారం రాత్రి గుంటూరు రాజీవ్గాంధీనగర్ వాసులు నిరసన తెలిపారు. -
నేత.. మొక్కల్లో మేత!
[ 27-04-2024]
అధికారమే అండగా ఆ ప్రజాప్రతినిధి కుటుంబం గుంటూరు నగరాన్ని చెరపట్టి మరీ దోచుకుంది. అల్లుడికి రోడ్లు, డ్రెయిన్ల కాంట్రాక్టు పనులు ఇప్పించుకోవడానికే పరిమితం కాలేదు. -
నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!
[ 27-04-2024]
ఎ.ఎన్.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. -
నాకు తెలియదు.. నాకు తెలియదు
[ 27-04-2024]
పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు.. నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. -
‘బీసీలను నట్టేట ముంచిన జగన్’
[ 27-04-2024]
‘బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి జగన్ నమ్మక ద్రోహం చేశారు. -
గురువులపై బోధనేతర విధుల భారం
[ 27-04-2024]
గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైకాపా ప్రభుత్వం కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలే నేరుగా విమర్శలు గుప్పించాయి. -
భూ కక్ష
[ 27-04-2024]
మండలంలోని సమగ్ర భూ సర్వేకు గత ఏడాది ఏప్రిల్లో రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నూరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో అక్షాంశ, రేఖాంశాల సహితంగా ప్రతి ఒక్కరి పొలానికి పక్కా సరిహద్దులు నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు