‘దళితులంతా లోకేశ్ విజయానికి కృషి చేయాలి’
మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ విజయానికి దళితులంతా కలసి పనిచేయాలని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు పిలుపునిచ్చారు.
మాట్లాడుతున్న బసవరావు, పక్కన ప్రభుదాసు, సుధీర్ తదితరులు
మంగళగిరి, న్యూస్టుడే: మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ విజయానికి దళితులంతా కలసి పనిచేయాలని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని అమరావతి ప్రెస్క్లబ్లో ఆయన దళిత నాయకులు పులి ప్రభుదాసు, రావూరి సుధీర్, కుటుంబరావుతో కలసి ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనలో దళితులపై దాడులు, హత్యలు పెరిగాయన్నారు. వాటిని అరికట్టేందుకు ఎస్సీ కమిషన్ సభ్యుడిగా ప్రయత్నిస్తున్న సందర్భాల్లో వైకాపా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డుకున్నారని ఆరోపించారు. సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించిన అవమానాలు ఎదురయ్యాయన్నారు. దళితులను కనీసం ఆయన పరిసరాలకు కూడా రానివ్వని జగన్ వారిపై ప్రేమ నటిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఆయన కోసం రెండు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అనంతపురంలో కలిసేందుకు ప్రయత్నిస్తే పట్టించుకోలేదన్నారు. అన్ని ప్రాంతాల్లో తాను పర్యటించి వైకాపా దళితులపై చేస్తున్న దాడులను వివరించి ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేస్తానని తెలిపారు .
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు