బొట్టుబిళ్లలు, వత్తులంటూ కుచ్చుటోపీ
‘‘బొట్టుబిళ్లలు, దీపం వత్తుల తయారీతో ఇంటి దగ్గరే ఉంటూ నెలకు రూ.30 వేల సంపాదన’’ అంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి తెరలేపాడు. ఏకంగా 1,400 మందితో వాటి తయారీ యంత్రాలు కొనుగోలు చేయించాడు.
యంత్రాలు విక్రయించి రూ.కోట్లలో వసూలు
రమేశ్
ఈనాడు- హైదరాబాద్, న్యూస్టుడే, కాప్రా: ‘‘బొట్టుబిళ్లలు, దీపం వత్తుల తయారీతో ఇంటి దగ్గరే ఉంటూ నెలకు రూ.30 వేల సంపాదన’’ అంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి తెరలేపాడు. ఏకంగా 1,400 మందితో వాటి తయారీ యంత్రాలు కొనుగోలు చేయించాడు. సరకు కిలోల లెక్కన తనకు విక్రయిస్తే లాభాలు ఇస్తానంటూ నమ్మించి నిండా ముంచాడు. రూ.కోట్లలో మోసానికి పాల్పడి బోర్డు తిప్పేసిన ఆ ఘరానా మోసం ఏఎస్రావు నగర్లో వెలుగులోకి వచ్చింది. సోమవారం బాధితులు కుషాయిగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆర్మీలో పనిచేసినట్లు చెప్పి.. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన రావులకొల్లు రమేశ్ ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్(గోయింగ్ టుగెదర్) పేరుతో ఏఎస్రావునగర్లో గతేడాది కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. యూట్యూబ్ ఛానెల్ నిర్వహించే ఇతడు ఇంటి దగ్గరే ఉంటూ బొట్టు బిళ్లలు, వత్తుల తయారీ ద్వారా రూ.వేలల్లో సంపాదించవచ్చంటూ వీడియోలు పోస్టు చేసేవాడు. ముడి సరకు ఇస్తామని తయారు చేసిన ఉత్పత్తిని తానే కొంటామని నమ్మించాడు. రూ.30 వేల లోపు ఉండే వత్తుల తయారీ యంత్రాన్ని రూ.1.5 లక్షల నుంచి రూ.1.8 లక్షలకు, బొట్టు బిళ్లల యంత్రాన్ని రూ.2.80 లక్షలకు విక్రయించి.. మూడు సంవత్సరాలకు ఒప్పందం చేసుకునే వాడు. దూది కిలో రూ.250 చొప్పున అమ్మి.. వత్తుల్ని రూ.550కి కొనేవాడు, బొట్టుబిళ్లల సరకును రూ.2 వేలకు ఇచ్చి.. రూ.2,600 కొంటానని ఒప్పందంలో పేర్కొనేవాడు.
మొత్తం 1400 మంది
ఏడాది కాలంలో రమేశ్ 842 మందికి వత్తుల తయారీ, 600 మందికి బొట్టు బిళ్లల యంత్రాలు అమ్మాడు. కొన్నవారిలో నాలుగు రాష్ట్రాలకు చెందినవారున్నారు. కొత్తవారిని చేరిస్తే కమీషన్లు ఇచ్చాడు. తొలి రెండు నెలలు ఒప్పందం ప్రకారం డబ్బు చెల్లించిన రమేశ్.. ఆ తర్వాత వాయిదా వేస్తూ వచ్చాడు. కొన్ని రోజులుగా ఉత్పత్తులను తీసుకోవడం నిలిపేయడం, చెల్లింపులు ఆపడంతో కొందరు నిలదీశారు. డబ్బు తర్వాత ఇస్తామంటూ కార్యాలయంలో పనిచేసే సుధాకర్, రామారావు సర్దిచెప్పేవారు. అనుమానం వచ్చిన బాధితులు ఆదివారం కార్యాలయానికి వెళ్లగా రమేశ్ కనిపించలేదు. దీంతో ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆటో డ్రైవర్ ఒకరు తన ఆటోపై లోన్ తీసుకుని డబ్బు కట్టారు. కొందరు మహిళలు డ్వాక్రా రుణాలను ఇందుకు ఖర్చు చేశారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
[ 03-06-2024]
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు (Telangana Polycet Results) విడుదలయ్యాయి. -
హైదరాబాద్లో గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి
[ 03-06-2024]
హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లి పోలీసు స్టేషన్ పరిధి బాబుల్ రెడ్డి నగర్లో విషాదం చోటు చేసుకుంది. -
కత్తితో దాడి చేసినా.. హైదరాబాద్లో దొంగలను ప్రతిఘటించిన యువకుడు
[ 03-06-2024]
బైక్పై వచ్చి సెల్ఫోన్ తీసుకొని ఉడాయించడానికి యత్నించిన ఇద్దరు ఆగంతకులను ఓ యువకుడు ధైర్య సాహసాలతో పట్టుకున్నాడు. -
2 నిమిషాల దూరానికి గంటపాటు ట్రాఫిక్లోనే..
[ 03-06-2024]
వారాంతం వస్తే చాలు కొత్తగూడ-బొటానికల్ గార్డెన్ రోడ్డులో ప్రయాణించాలంటే ట్రాఫిక్ నరకం చవిచూడాల్సి వస్తోంది. కేవలం 2 నిమిషాల దూరానికి గంటపాటు ట్రాఫిక్ వలయం చేధించాల్సి వస్తోంది. -
మూసారాంబాగ్ చౌరస్తాలో అగ్నిప్రమాదం
[ 03-06-2024]
నగరంలోని మూసారాంబాగ్ చౌరస్తాలో అగ్నిప్రమాదం జరిగింది. రెడ్రోజ్ బేకరీలో భారీగా మంటలు చెలరేగాయి. -
అందరి చూపు.. ఆంధ్రా వైపు.. ఎన్నికల ఫలితాలపై హైదరాబాద్లో చర్చలు..
[ 03-06-2024]
ఏ ఇద్దరు కలిసినా ఆంధ్రాలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపైనే చర్చ. ఆదివారం కదా అని ఎవరి ఇంటికి వెళ్లినా గెలుపు అవకాశాలపై చర్చలు. ఎవరికీ అందని ఓటరు నాడి పట్టుకోలేక ఫలితాల కోసం తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. -
కోటి గొంతుకలు ఒక్కటై.. పల్లవించె తెలంగాణమై...
[ 03-06-2024]
ప్రత్యేక రాష్ట్ర నినాదం.. అమరుల త్యాగం.. ఉద్యమకారుల పోరాటం.. వెరసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ స్వప్నం నెరవేరి పదేండ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం నిర్వహించిన దశాబ్ది సంబరాలు అంబరాన్నంటాయి. -
అమ్మో.. హోటల్ భోజనమా!
[ 03-06-2024]
కొందరు నిర్వాహకుల నిర్లక్ష్యం.. హోటల్లో భోజనం అంటేనే భయపడేలా చేస్తోంది. కనీస ప్రమాణాలు పాటించకుండా, పరిశుభ్రతను గాలికొదిలేసి నిల్వ ఉంచి బూజు పట్టిన వంటకాలను వినియోగదారులకు వడ్డిస్తున్నారు. -
బైకు రేసులకు బ్రేకులు
[ 03-06-2024]
రాయదుర్గం టీహబ్ రోడ్లలో బైకు రేసులతో హల్చల్ చేస్తున్న బైకర్లపై రాయదుర్గం పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వారాంతాల్లో అర్ధరాత్రి బైకులతో తెల్లవార్లూ రేసులు, -
అవతరణ సంబురం.. అంతా పరవశం
[ 03-06-2024]
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఆదివారం జిల్లా అంతటా ఘనంగా జరిగాయి. ఊరు, వాడ, పల్లె, పట్నం అనే తేడా లేకుండా చిన్నా, పెద్దా అందరూ సంబురాలు జరిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జెడా వందనం నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. -
రేపటితో ఉత్కంఠకు తెర
[ 03-06-2024]
లోక్సభ ఓట్ల లెక్కింపునకు కౌంట్డౌన్ మొదలైంది. మరో 24 గంటల్లో పార్టీల, అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రాజధాని పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ స్థానాలకు మంగళవారం కౌంటింగ్ జరగనుంది. -
కోడ్ ముగియగానే సున్నా బిల్లులు
[ 03-06-2024]
రంగారెడ్డి జోన్ పరిధిలో అర్హులైన విద్యుత్తు వినియోగదారులకు ఈ నెల నుంచే గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియగానే 6వ తేదీ నుంచి బిల్లులు జారీ చేయాలని డిస్కం నిర్ణయించింది. -
ఏప్రిల్లో ఎత్తులకు.. మేలో దిగువకు
[ 03-06-2024]
ఐటీ, ఆకాశహర్మ్యాలకు నిలయంగా మారిన రంగారెడ్డి జోన్ పరిధిలో ఏప్రిల్ నెలలో డిమాండ్ అధికంగా నమోదైంది. మార్చి నుంచి మే నెల వరకు గరిష్ఠ విద్యుత్తు డిమాండ్, సగటు డిమాండ్, -
ఉత్సాహంగా సైకిల్ ర్యాలీలు
[ 03-06-2024]
ప్రపంచ బై సైకిల్ దినోత్సవాన్ని (జూన్ 3) పురస్కరించుకొని ఆదివారం సైక్లింగ్ కమ్యూనిటీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. నానక్రామ్గూడ, నార్సింగి, -
ఉరుములు, మెరుపులతో అకాల వర్షం
[ 03-06-2024]
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం ఆదివారం సాయంత్రం జిల్లాలోని ధారూర్, బషీరాబాద్, వికారాబాద్, తాండూరు, పెద్దేముల్ మండలాల్లో కురిసింది. -
చేవెళ్లలో ఎవరిదో విజయం?
[ 03-06-2024]
సార్వత్రిక ఫలితాలకు సమయం దగ్గరకొచ్చేసింది. ఇంకా 24 గంటలు గడిస్తే చాలు. విజేతలెవరో తెలిసిపోతుంది. కానీ అప్పటిదాకా నేతల్లో ఉత్కంఠ. చేవెళ్ల ఎంపీ స్థానం పరిధిలోకి వచ్చే జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. -
నవీన్ కుమార్రెడ్డి గెలుపుతో భారాసలో జోష్
[ 03-06-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భారాస విజయం సాధించడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. గత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో గద్వాల, అలంపూర్లో మాత్రమే ఆ పార్టీ గెలుపొందింది. -
ఎన్టీఆర్ విశిష్ట పురస్కార ప్రదానం
[ 03-06-2024]
తెలుగు జాతి కీర్తి, ప్రతిష్ఠలను ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయులు ఎన్టీఆర్ అని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి కీర్తించారు. -
ఇద్దరిని బలిగొన్న నీటిట్యాంకర్
[ 03-06-2024]
సంతోషంగా నగరాన్ని తిలకించేందుకు వచ్చిన సందర్శకుల్లో ఇద్దరిని వాటర్ ట్యాంకర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించిన ఘటన ఇది. నార్సింగి ఇన్స్పెక్టర్ హరిక్రిష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈతకు వెళ్లి యువకుడి మృతి
[ 03-06-2024]
క్వారీ గుంతలో ఈత కొట్టడానికి వెళ్లి నీట మునిగి యువకుడు మృతి చెందాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టారెడ్డిపేటలో ఉంటున్న పల్లం అరుణ్(22) హెచ్పీ గోదాంలో సిలిండర్ల డెలివరీ బాయ్. -
‘బీమా బైపాస్ సర్జరీతో సమస్యలు స్వల్పం’
[ 03-06-2024]
బీమా బైపాస్ శస్త్రచికిత్సతో(బైలటేరియల్ ఇంటర్నల్ మమ్మరీ ఆర్టరీ-బీఐఎంఏ) అనారోగ్య సమస్యలు స్వల్పంగా ఉంటాయని, ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం.. -
హోటల్లో ఉరేసుకుని.. సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణం
[ 03-06-2024]
హోటల్ గదిలో ఉరేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్రెడ్డి, ఎస్సై రవికుమార్లు తెలిపిన వివరాల ప్రకారం. -
భార్య కాపురానికి రావడం లేదని.. భర్త ఆత్మహత్య
[ 03-06-2024]
భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
గెలిచినా.. ఓడినా పాక్ ఫ్యాన్స్ దృష్టంతా మనమీదే: యువరాజ్ సింగ్
-
జూన్ 4 వరకు ఆగండి.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారే: సోనియాగాంధీ
-
64.2 కోట్ల మంది ఓటేశారు.. ప్రపంచ రికార్డు సృష్టించామన్న ఈసీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు.. రూ.12.50 లక్షల కోట్ల లాభం!
-
పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారం.. వైకాపాకు సుప్రీంలో ఎదురుదెబ్బ