వ్యాపారి హత్యతో అట్టుడికిన బేగంబజార్!
యువ వ్యాపారి నీరజ్ పన్వర్ హత్యతో బేగంబజార్ ప్రాంతం అట్టుడికి పోయింది. బేగంబజార్ కోల్సావాడీకి చెందిన యువ వ్యాపారి నీరజ్ పన్వర్ అదే ప్రాంతానికి చెందిన సంజనను ప్రేమించి ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
బేగంబజార్లో మూత పడిన దుకాణాలు
గోషామహల్, న్యూస్టుడే: యువ వ్యాపారి నీరజ్ పన్వర్ హత్యతో బేగంబజార్ ప్రాంతం అట్టుడికి పోయింది. బేగంబజార్ కోల్సావాడీకి చెందిన యువ వ్యాపారి నీరజ్ పన్వర్ అదే ప్రాంతానికి చెందిన సంజనను ప్రేమించి ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నెలన్నర క్రితం బాబు పుట్టాడు. కులాంతర వివాహాన్ని జీర్ణించుకోలేకపోయిన సంజన కుటుంబీకుల్లోని కొందరు శుక్రవారం రాత్రి బేగంబజార్ చేపల మార్కెట్ వద్ద నీరజ్ పన్వర్ను హత్య చేసిన విషయం తెలిసిందే.
మార్కెట్ బంద్.. పీఎస్ ముందు ధర్నా..
హత్యకు నిరసనగా హైదరాబాద్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్, బేగంబజార్ రెసిడెన్షియల్ అసోసియేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం బేగంబజార్లో వ్యాపారులందరూ దుకాణాలు తెరవలేదు. ఉదయం పదిన్నర గంటలకు బేగంబజార్ మిట్టీకా షహర్ నుంచి వందలాది మంది వ్యాపారులు, బాధితుడి కుటుంబసభ్యులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టి షాయినాయత్గంజ్ పోలీసుస్టేషన్కు చేరుకొని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. బాధితుడి కుటుంబీకులు, బంధువులతో పాటు అతని భార్య సంజన ఈ ధర్నాలో పాల్గొన్నారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్.. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. డీసీపీ డేవిస్ జోయల్, ఏసీపీ సతీశ్కుమార్, సీఐ అజయ్కుమార్లు ఎమ్మెల్యేతో పాటు వ్యాపార సంఘం ప్రతినిధులతో మాట్లాడారు.
నా సోదరులే హత్య చేశారు: సంజన
నా భర్తను మా సోదరులే హత్య చేశారని నీరజ్ పన్వర్ భార్య సంజన విలపించింది. షాయినాయత్గంజ్ పీఎస్ ఎదురుగా ధర్నాలో పాల్గొన్న ఆమె విలేఖరులతో మాట్లాడింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే తాను చేసిన పాపమా..? అని ప్రశ్నించింది. తన భర్తను హతమార్చిన వారందరికీ ఉరి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరింది.
* యువ వ్యాపారి నీరజ్ పన్వర్ మృతదేహానికి ఉస్మానియాలో సాయంత్రం నాలుగున్నర గంటలకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
అంతిమయాత్రకు తరలివచ్చిన జనం
హెచ్ఆర్సీ నోటీసులు
నారాయణగూడ: శుక్రవారం రాత్రి బేగంబజార్లో జరిగిన హత్యపై ఎస్హెచ్ఆర్సీ తీవ్రంగా స్పందించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్ ఈ కేసును సూమోటోగా విచారణకు స్వీకరించింది.ఈ సంఘటనపై జూన్ 30లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
బందోబస్తు మధ్య అంతిమయాత్ర
ఉస్మానియా ఆసుపత్రి: నీరజ్ పన్వర్ మృతదేహానికి ఫోరెన్సిక్ వైద్యురాలు ఝాన్సీ ఆధ్వర్యంలో పరీక్షలు ఉస్మానియాలో నిర్వహించారు. స్థానికుల అభ్యర్థన మేరకు కోల్సావాడీ వద్ద నుంచి అంతిమయాత్ర కాలినడకన బేగంబజార్ నుంచి ఇమ్లిబన్ శ్మశాన వాటిక వరకూ సాగింది. ఇమ్లిబన్ శ్మశాన వాటికలో సాయంత్రం మృతదేహానికి అతని సోదరుడు దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుడి కుటుంబీకుల్ని తెరాస రాష్ట్ర నాయకులు నందకిశోర్ వ్యాస్(బిలాల్), ఆనంద్ కుమార్గౌడ్, వ్యాపార సంఘాల ప్రతినిధులు పరామర్శించి ధైర్యం చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే