సహజ ప్రసవం.. అందుకో ప్రోత్సాహం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ ప్రసవాలను పెంచటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య సిబ్బందికి నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించింది. 2022-2023 ఆర్థిక సంవత్సరం నుంచి
వికారాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్రం
చొరవ చూపుతున్న ప్రభుత్వం
న్యూస్టుడే, వికారాబాద్ మున్సిపాలిటీ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ ప్రసవాలను పెంచటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య సిబ్బందికి నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించింది. 2022-2023 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 4న వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో సాధారణ కాన్పుకు గాను సిబ్బందికి రూ.3000 అందించనున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
అన్ని కేంద్రాల్లో నిర్వహణ
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసవాలు చేస్తున్నారు. తాండూరు మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో ఆధునిక సౌకర్యాలున్నాయి. జిల్లాలోనే అత్యధిక ప్రసవాలు ఇక్కడే జరుగుతున్నాయి. ఆ తర్వాత వికారాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్రం ఉంది. జిల్లాలో 24 గంటల పాటు కొనసాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 7 ఉన్నాయి. వీటిలో నెలకు 8 నుంచి 10 వరకు ప్రసవాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు 1518
జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక బస్తీ, 2 పట్టణ దవాఖానాలున్నాయి. నాలుగు సామాజిక ఆరోగ్య కేంద్రాలు పరిగి, వికారాబాద్, మర్పల్లి, కొడంగల్లో ఉన్నాయి. జిల్లా ఆసుపత్రి తాండూరులో ఉంది. ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో సహజ ప్రసవాలు 1518 జరపగా సిజేరియన్ ప్రసవాలు 842 ఉన్నాయి. ఇందుకు భిన్నంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉంది. వీటిల్లో ఎక్కువగా కోతలే జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సహజ ప్రసవాలు 257 జరిగితే సిజేరియన్ 800 ఉన్నాయి. కొంత కాలంగా ప్రభుత్వం సాధారణ ప్రసవాలపై దృష్టి పెట్టింది. తాండూరులో ప్రతి నెల 250 నుంచి 350 వరకు కాన్పులు జరుగుతున్నాయి. వికారాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 150 నుంచి 180 వరకు చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 8నుంచి 10 ప్రసవాలు చేస్తున్నారు.
85 శాతం సాధిస్తేనే...
సహజ ప్రసవాల్లో 85 శాతం లక్ష్యం సాధిస్తేనే ప్రోత్సాహకంగా రూ.3000 చెల్లించనున్నారు. నెలకు జిల్లా ఆసుపత్రిలో 250, ప్రాంతీయ ఆసుపత్రిలో 150, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 50, ఇరవై నాలుగు గంటలు పాటు కొనసాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 10, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 5 సాధారణ ప్రసవాలు జరపాలని లక్ష్యం నిర్ణయించారు. ఇవి పూర్తిచేస్తేనే ప్రోత్సహకం అందజేస్తారు.
గర్భిణులకు వివరించాలి - డాక్టర్ జీవరాజ్, జిల్లా ఉప వైద్యాధికారి, వికారాబాద్
ప్రోత్సాహకాల నేపథ్యంలో సిబ్బంది, అధికారులు తగిన చొరవ చూపాలి. గర్భిణులకు సహజ ప్రసవం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించాలి. ప్రస్తుతం 24 గంటలూ పనిచేసే పీహెచ్సీల్లో ప్రతి నెల 8 నుంచి10 వరకు కాన్పులు చేస్తున్నారు. చాలావరకు సహజ ప్రసవాలే ఉంటున్నాయి. ఇక నుంచి ఆసుపత్రుల్లో సహజ కాన్పులు ఎక్కువ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు అవగాహన కల్పిస్తాం. వైద్య సిబ్బందికి కూడా ప్రోత్సాహకాల గురించి వివరిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు