logo

Hyderabad news: బంజారాహిల్స్‌లో యువతిని గదిలో బంధించి అత్యాచారం!

జూబ్లీహిల్స్‌లో సామూహిక అత్యాచార ఘటన మరువకముందే బంజారాహిల్స్‌లో మరో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని గదిలో బంధించి కాపలాదారుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Updated : 08 Aug 2022 08:03 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్‌లో సామూహిక అత్యాచార ఘటన మరువకముందే బంజారాహిల్స్‌లో మరో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని గదిలో బంధించి కాపలాదారుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 4న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లోని ఓ బస్తీకి చెందిన యువతికి అదే ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న చిన్మయి సైక్యా(22)తో పరిచయం ఏర్పడింది. యువతిపై కన్నేసిన అతడు ఈ నెల 4న ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బయటకు చెబితే చంపుతానంటూ బెదిరించాడు. ఈ దారుణాన్ని జీర్ణించుకోలేక.. మరుసటి రోజు ‘తనకు చనిపోవాలని ఉందంటూ’ స్నేహితురాలికి చరవాణిలో సంక్షిప్త సందేశం పంపింది. ఆమె బాధితురాలి సోదరికి చెప్పటంతో ఈ దారుణం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బంజారాహిల్స్‌ సీఐ ఎం.నరేందర్‌ తెలిపారు. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని