ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు బోర్డు
గాజులరామారం పరిధిలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వ పాఠశాల సమీపంలోని 12, 13 సర్వే నంబర్లలోని సింహభాగం భూమి ఇప్పటికే కబ్జాదారుల వశమైంది. జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల సమీపంలో 3 ఎకరాల స్థలాన్ని..
రూ. 40 కోట్ల విలువైన రెండు ఎకరాల కబ్జా
షాపూర్నగర్, న్యూస్టుడే: గాజులరామారం పరిధిలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వ పాఠశాల సమీపంలోని 12, 13 సర్వే నంబర్లలోని సింహభాగం భూమి ఇప్పటికే కబ్జాదారుల వశమైంది. జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల సమీపంలో 3 ఎకరాల స్థలాన్ని.. ఓ స్థిరాస్తి వ్యాపారి ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. తర్వాత 12 సర్వే నంబరులోని రూ.40 కోట్ల విలువైన రెండు ఎకరాల కబ్జాకు మరో స్తిరాస్థి వ్యాపారి పథకం పన్నాడు. గతంలో ఈ విషయమై ‘ఈనాడు’లో వచ్చిన కథనాలకు రెవెన్యూ అధికారులు స్పందించి మొక్కలు నాటి ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ సూచికలు ఏర్పాటు చేశారు. తాజాగా దీని పక్కనే ఉన్న 445 సర్వే నంబరు పేరుతో.. వ్యాపారులు సర్వే నంబరు 12లోని ప్రభుత్వ సూచికలను తొలగించి ప్రైవేటు స్థలంగా కోర్టు ఆర్డరు పేరుతో సూచికలను ఏర్పాటు చేశారు. ఏకంగా ప్రహారీ నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ఏప్రిల్లో ఇదే వ్యక్తులు ప్రహరీ నిర్మాణానికి ప్రయత్నించగా ‘ఈనాడు’లో కథనం రావడంతో జేసీబీతో వారు ఏర్పాటు చేసిన ఇనుప స్తంభాలను అధికారులు తొలగించారు. మళ్లీ మరోసారి రాత్రికి రాత్రే ప్రభుత్వ సూచికలు తొలగించి తమ బోర్డులను ఏర్పాటుచేసుకున్నారు. 12 సర్వే నంబరులో మొత్తం 12.24 గుంటల స్థలం ఉండేది. ఇందులో స్థానికుల పోరాటంతో ప్రభుత్వ పాఠశాల, క్రీడామైదానం కోసం 6.24 గుంటలను కేటాయించగా ప్రభుత్వ పాఠశాలతో పాటు మైదానం ఏర్పాటుచేశారు. మరో 2 ఎకరాల్లో జేఎన్ఎన్యూఆర్ఎం గృహ సముదాయాన్ని నిర్మించారు. ఇవన్నీ పోను రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇంకా 4 ఎకరాలు ఉండాలి. అయితే గృహసముదాయాన్ని ఆనుకుని ఉన్న స్థలంలో కొంత కబ్జా కాగా.. రోడ్డుకు ఇవతలి వైపున 2 ఎకరాలు ఉంది. ఇది ప్రభుత్వ స్థలమేనని అధికారులకు తెలుసు. ఇదే స్థలంలో మూడు సంవత్సరాల క్రితం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మొక్కలూ నాటారు. తాజాగా ఈ స్థలం 445 సర్వే నంబరులోకి వస్తుందని.. రెవెన్యూ సర్వే విభాగం ఏడీఐ ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొంటూ వ్యాపారులు కబ్జా తతంగాన్ని చాపకింద నీరులా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే రూ. 40 కోట్ల విలువైన స్థలం కనుమరుగయ్యే అవకాశముంది.
ఇదే స్థలంలో 2019లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
వివేకానంద్, అప్పటి కలెక్టర్ వెంకట్రాంరెడ్డి
సర్వే చేయిస్తాం
ఈ విషయమై తహసీల్దారు సంజీవరావును వివరణ కోరగా.. స్థిరాస్తి వ్యాపారి 12 సర్వే నంబరు స్థలంలోని ప్రభుత్వ సూచికలు తొలగించి ప్రైవేటు స్థలంగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటుచేసిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. సదరు వ్యక్తులను ప్రశ్నించగా ఈ స్థలం 445 సర్వే నంబరులోకి వస్తుందని పత్రాలు చూపించినట్లు తెలిపారు. సోమవారం స్థలాన్ని సర్వే చేయించి ప్రభుత్వ స్థలంలో వెలిసిన నిర్మాణాలను తొలగిస్తామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు