logo

రాచకొండ సైబర్‌ క్రైం ఏసీపీగా హరికృష్ణ

రాచకొండ సైబర్‌ క్రైం ఏసీపీగా ఎస్వీ.హరికృష్ణ నియమితులయ్యారు. హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ బాధ్యతల్లో ఉన్న ఆయన్ను సైబర్‌ క్రైం విభాగానికి బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 30 Nov 2022 01:58 IST

ఈనాడు,హైదరాబాద్‌: రాచకొండ సైబర్‌ క్రైం ఏసీపీగా ఎస్వీ.హరికృష్ణ నియమితులయ్యారు. హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ బాధ్యతల్లో ఉన్న ఆయన్ను సైబర్‌ క్రైం విభాగానికి బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నవంబరు 7న హరికృష్ణను నగర భద్రతా విభాగం(సీఎస్‌డబ్ల్యూ) ఏసీపీగా నియమించారు. తాజా బదిలీల నేపథ్యంలో గత నియామకాన్ని రద్దు చేస్తున్నట్లు డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాచకొండ సైబర్‌ క్రైం ఏసీపీ బాధ్యతల్లో ఉన్న ఎస్‌.హరినాథ్‌ను వికారాబాద్‌ జిల్లా క్రైం రికార్డ్స్‌ బ్యూరో డీఎస్పీగా నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని