logo

28న బీసీల చలో దిల్లీ

బీసీల డిమాండ్ల సాధనకు ఈనెల 28న చలో దిల్లీ విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జూజుల శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు.

Published : 19 Mar 2023 02:03 IST

మాట్లాడుతున్న శ్రీనివాస్‌గౌడ్‌

యూసుఫ్‌గూడ, న్యూస్‌టుడే: బీసీల డిమాండ్ల సాధనకు ఈనెల 28న చలో దిల్లీ విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జూజుల శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. శనివారం యూసుఫ్‌గూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో బీసీల గణన చేపట్టాలన్నారు. చట్ట సభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు దామాషా ప్రకారం బీసీల రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్లతో జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన తెలపనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బండిగారి రాజుగౌడ్‌, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు శ్రీనివాస్‌, శ్యామ్‌, వెంకటకృష్ణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని