logo

మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్‌నాథ్‌సింగ్‌

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలిసి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు.

Updated : 20 Apr 2024 06:09 IST

ఆలయం రిజిస్టర్‌లో సంతకం చేస్తున్న రాజ్‌నాధ్‌సింగ్‌. చిత్రంలో లక్ష్మణ్‌, అర్చకుడు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలిసి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు రాజ్‌నాథ్‌సింగ్‌కు స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని గర్భగుడి వద్ద ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులను అడిగి ఆలయ చరిత్రను తెలుసుకున్నారు. ఆలయ ఛైర్మన్‌ రామేశ్వర్‌ కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం మాతంగేశ్వరిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్‌లోని మెహబూబ్‌ కళాశాలలో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని