చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
సైబరాబాద్ ఈవోడబ్ల్యూ ఠాణాలో కేసు
ఈనాడు, హైదరాబాద్: దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు. చిట్టీల పేరుతో రూ.4.15 కోట్లు వసూలు చేసి పత్తాలేకుండా పోయారు. నగరంలోని బాలానగర్ చింతల్ కేంద్రంగా జరిగిన ఈ మోసంపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేసే మేకల నాగమునెయ్య, ఆయన భార్య నాగమణి, సమీప బంధువులు చేకూరి రంగనాయకులు, గురుస్వామి15 ఏళ్లుగా బాలానగర్ చింతల్ వెంకటేశ్వరనగర్లో ఉంటున్నారు. నాగమణి 2006 నుంచి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. పదుల సంఖ్యలో కుటుంబాలు చిట్టీలు వేసేవారు. నాగమణి ఆమె కుటుంబం అందరూ కలిసి 6 చిట్టీ గ్రూపులు నిర్వహించేవారు. 2022లో నాగమణి.. తన దగ్గర చిట్టీలు వేసే ఓ మహిళ నుంచి రూ.40.85 లక్షలు రుణం తీసుకుంది. బదులుగా కొన్ని చెక్కులు ఇచ్చింది. ఏడాది గడిచినా తీసుకున్న అప్పు.. చిట్టీ డబ్బు ఇవ్వలేదు. మరికొందరిదీ ఇదే పరిస్థితి. రెండు వారాల క్రితం బాధితులు వెళ్లి ఒత్తిడి చేశారు. అప్పటి నుంచి నాగమునెయ్య, నాగమణి, రంగనాయకులు, గురుస్వామి పత్తాలేకుండా పోయారు. మొత్తం 35 మంది నుంచి రూ.4.15 కోట్లు వసూలు చేసి పరారైనట్లు బాధితులు తెలుసుకున్నారు. సైబరాబాద్ ఈవోడబ్ల్యూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఒక్కొక్కరూ రూ.10 లక్షల కంటే ఎక్కువ మోసపోయినవారే అధికంగా ఉండడం గమనార్హం. పోలీసులు ఆ నలుగురి మీద కేసు నమోదు చేశారు.
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పాఠశాల వ్యాన్ డ్రైవర్కు 20 ఏళ్ల జైలు
అమీర్పేట, న్యూస్టుడే: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పాఠశాల వ్యాన్ డ్రైవర్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ బుధవారం న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో 2022లో జరిగిన ఈ నేరం జరిగింది. అమీర్పేటలోని ఓ పాఠశాలలో నర్సరీ చదువుతున్న బాలిక(3)ను ప్రతీరోజు ఇంటి నుంచి పాఠశాలకు, తిరిగి ఇంటికి వ్యాన్ డ్రైవర్ జి.రామకృష్ణ(44) చేరుస్తుండేవాడు. 2022 డిసెంబరు 7న పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చాక బాలికను పరిశీలించిన తల్లి ఆరా తీయగా విషయం వెలుగు చూసింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన అప్పటి ఎస్సార్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు డ్రైవర్ రామకృష్ణపై ఛార్జిషీటు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాల విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి నాంపల్లిలోని 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.అనిత 20 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 6 నెలల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తలాక్ అని మొయిల్ పంపిన భర్తపై ఫిర్యాదు.. కేసు
ఫిల్మ్నగర్: ప్రేమ పెళ్లి చేసుకుని తలాక్ ఇ-బయాన్ అంటూ మొయిల్ పంపించిన భర్తపై చట్టరీత్యా చర్యలుకోరుతూ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో ఫిల్మ్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వివరాలప్రకారం.. షేక్పేట మధురిహిల్స్కు చెందిన మహిళ, ఇమ్రాన్ ఖాదర్ ప్రేమపెళ్లి చేసుకున్నారు. వీరికిఇద్దరు సంతానం. కోవిడ్ నుంచి భార్య, పిల్లలను ఆమె తల్లిదండ్రులవద్ద వదిలి వేరుగా ఉంటున్నాడు. అనేకమార్లు ఆమె ఫోన్చేసినా స్పందన కరవైంది. తాజాగా ఇమ్రాన్ తలాక్ ఇ-బయాన్ను మెయిల్ ద్వారా పంపాడు. దీంతో ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.
సస్పెండైన విద్యుత్తు అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు
అల్వాల్, న్యూస్టుడే: అల్వాల్లోని మచ్చబొల్లారం-హరేకృష్ణ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న విద్యుత్తు అధికారి అనిల్కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ నాయకత్వంలోని బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు చేసింది. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న అనిల్కుమార్ కీసర అసిస్టెంట్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తూ గత సంవత్సరం ఫిబ్రవరిలో రూ.12వేల లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెండయ్యారు. దర్యాప్తులో విస్తుగొలిపే ఆస్తుల చిట్టా బయటపడింది. ఇంట్లో రూ.12 లక్షల నగదు, అనిల్ జేబులో రూ.74వేల నగదు, 223 గ్రాముల బంగారం, కోటి ఆస్తులను గుర్తించి ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. అనంతరం అనిల్కుమార్ బోయిన్పల్లి నుంచి తన నివాసాన్ని హరేకృష్ణ కాలనీకి మార్చారు. బుధవారం సోదాలు చేసి కొన్ని స్థిరాస్తి దస్తావేజులు, వడ్డీలకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కూడా భారీగానే ఉంటుందని ఆనంద్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో దారుణం.. పార్కింగ్ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
[ 04-05-2024]
సాయంత్రం సమయం.. అంతా చూస్తుండగానే ఇనుప రాడ్డుతో హోటల్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి యజమానిపై ఒక్కసారిగా దాడి చేశాడు. తలకు బలమైన గాయాలైన ఆయన ఐదు గంటలపాటు మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. -
కేపీహెచ్బీలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
[ 04-05-2024]
గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేపీహెచ్బీ వద్ద చోటు చేసుకుంది. -
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
[ 04-05-2024]
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లు మొదటి నుంచి స్థానికేతరులకే పట్టంకడుతున్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన వారు విజయం సాధించలేకపోయారు. -
గడప దాటిస్తే ... గండం గడిచినట్లే
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గరపడటంతో బూత్ మేనేజ్మెంట్పై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రచారం ఒకెత్తయితే పోలింగ్ రోజు ఓటర్లను ఇంటి గడప దాటించి పోలింగ్ కేంద్రానికి రప్పించి ఓట్లేయించడం చాలా కీలకం. -
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
[ 04-05-2024]
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్య ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
[ 04-05-2024]
తక్కువ ధరకే ప్లాట్లు విక్రయిస్తామంటూ దంపతులు 15 మందికి రూ.12.35 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు. తప్పుడు ప్రకటనలు, ఫోర్జరీ పత్రాలతో మోసగించిన వీబీజే క్యాప్స్టోన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కందుల వెంకట ప్రసాద్ గుప్తా, ఆయన భార్య అనురాధను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు సీసీఎస్ డీసీపీ శ్వేత ఓ ప్రకటనలో తెలిపారు. -
నగర ఓటరు.. తీర్పు ఎప్పటికప్పుడు మారు
[ 04-05-2024]
శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో నగర ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటోంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్నినెలల వ్యవధిలో 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. -
సైబర్సిటీలో భారీగా వాడకం
[ 04-05-2024]
ఐటీ కార్యాలయాలు, ఆకాశహర్మ్యాలు, పరిశ్రమలకు నిలయమైన సైబర్సిటీ సర్కిల్ పరిధిలో వేసవిలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. సిటీలోని తొమ్మిది సర్కిళ్లలో ఇక్కడే అత్యధిక వాడకం నమోదైంది. -
బంధాన్ని కాదని.. భర్తను బంధించి
[ 04-05-2024]
ఆస్తి కోసం భార్య ఇనుప గొలుసుతో కట్టేసి భర్తను చిత్రహింసలు పెట్టింది. ఘట్కేసర్ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్లోని అంబేడ్కర్నగర్కు చెందిన సెంట్రింగ్ గుత్తేదారు పత్తి నరసింహ(50) భార్య భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. -
తరుణీ కరుణించు
[ 04-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో మహిళ ఓటర్లు కీలకం కావడంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోల్లో మహిళల కోసం రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. -
పట్టణ ఓటరుపై పట్టుకు..
[ 04-05-2024]
ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ గేటర్లో రాజకీయ వేడి మొదలైంది. మహానగరంలో 28 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. -
రాజ్పుత్ల ఐకమత్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
[ 04-05-2024]
రాజ్పుత్ల ఐకమత్యాన్ని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు లోక్సభ ఎన్నికల్లో భాజపాకు బుద్ధిచెప్పాలని మజ్లిస్ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
రంజిత్రెడ్డికి ఓట్లతో గుణపాఠం చెప్పాలి
[ 04-05-2024]
రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన భారాసకు ద్రోహం చేసిన రంజిత్రెడ్డికి ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సబితారెడ్డి పిలుపునిచ్చారు. శంకర్పల్లిలో శుక్రవారం ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్షోలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఆమె పాల్గొన్నారు. -
తపాలా ఓటులో తడబాటు.. వెనుదిరిగిన ఓటర్లు
[ 04-05-2024]
రాజధానిలో కోటి పదిలక్షల మంది ఓటర్లుండగా.. సుమారు పది వేల పోలింగ్ కేంద్రాల్లో 50వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు. భద్రతా సిబ్బంది, ఇతర సహాయ సిబ్బంది కలిపితే మరో 20వేల మంది ఉంటారు. -
ప్రభుత్వాన్ని కూల్చడానికి కేసీఆర్ కుట్ర
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి భారాస కుట్రలు చేస్తుందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పురపాలక పట్టణంలో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా కౌన్సిలర్ భరత్ బృందం పార్టీలో చేరిన సందర్భంగా సభ నిర్వహించారు. -
మా అభ్యర్థులను గెలిపించుకుంటాం
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మున్నూరు కాపు అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించుకుంటామని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్రావు ప్రకటించారు. -
నక్షత్రాలు,గ్రహాల గుట్టు తెలుసుకుందాం
[ 04-05-2024]
వినూత్న పరిశోధనలతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచేందుకు.. అంతరిక్ష పరిశోధనలపై ప్రోత్సహించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మినీ అబ్జర్వేటరీని ప్రారంభించింది. -
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..
[ 04-05-2024]
అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. పాదబాటపై నడుచుకుంటూ వెళ్తున్న హార్డ్వేర్ ఇంజినీర్ విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరిగుట్టకి చెందిన తుమ్మ భావన రుషి (35) రెండేళ్ల క్రితం సుజాత అనే ఉపాధ్యాయురాలిని ప్రేమ వివాహం చేసుకొని వెంకటగిరిలో నివసిస్తున్నాడు. -
ఎవరిదో పైచేయి
[ 04-05-2024]
చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు (టీఆర్ఆర్, గడ్డం ప్రసాద్కుమార్, బుయ్యని మనోహర్రెడ్డి), భారాసకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు (ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, ఆనంద్) తమ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓట్లు సాధించడంపై దృష్టి నిలిపారు. -
భారాస విజయానికి వ్యూహ రచన
[ 04-05-2024]
తాండూరులో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తాండూరు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్ కుమార్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?