కేపీహెచ్‌బీలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ వద్ద చోటు చేసుకుంది.

Updated : 04 May 2024 09:53 IST

కూకట్‌పల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ వద్ద చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఆశ్రితా రెడ్డి(22) మాదాపూర్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. బాచుపల్లిలో నివసిస్తున్న తన స్నేహితుల వద్దకు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం డీకొట్టడంతో కిందపడి తలకు తీవ్రగాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని