ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య

ప్రేమించిన యువతితో గొడవపడిన ఓ యువకుడు ఆమెతోనే ఫోన్‌ మాట్లాడుతూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Updated : 09 May 2024 10:06 IST

ఇమ్రోజ్‌ పటేల్‌
రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: ప్రేమించిన యువతితో గొడవపడిన ఓ యువకుడు ఆమెతోనే ఫోన్‌ మాట్లాడుతూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా తాండూర్‌కు చెందిన ఇమ్రోజ్‌పటేల్‌(29) కొన్ని సంవత్సరాలుగా రాజేంద్రనగర్‌లోని పరమారెడ్డిహిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. కొన్నిరోజులుగా ఆ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ యువతి ఇమ్రోజ్‌ను దూరం పెట్టింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఇమ్రోజ్‌పటేల్‌ మంగళవారం రాత్రి తాను నివసించే ఫ్లాట్‌ నుంచి ఆ యువతికి ఫోన్‌ చేశాడు. కొద్దిసేపు మాట్లాడి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. వెంటనే ఆమె అక్కడికి దగ్గరలో ఉండే మరో స్నేహితుడికి ఫోన్లో విషయం చెప్పి ఇమ్రోజ్‌పటేల్‌ ఫ్లాట్‌కు వెళ్లాలని సూచించింది. ఆయన వెళ్లి చూడగా అప్పటికే ఇంట్లో దుప్పటితో ఉరివేసుకొని ఇమ్రోజ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు