పూడిక తొలగేనా..?
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రధాన వరదకాలువలు ఉండగా ఏటా వర్షాకాలం రాకముందే పూడికతీత పనులు చేయిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా పూడిక, చెత్తాచెదారం తొలగించడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు.
మురుగు కాలువల్లో చెత్తాచెదారం
న్యూస్టుడే, కరీంనగర్ కార్పొరేషన్
మంకమ్మతోట రెండో ఠాణా పక్కనుంచి ప్రవహించే వరద కాల్వ
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రధాన వరదకాలువలు ఉండగా ఏటా వర్షాకాలం రాకముందే పూడికతీత పనులు చేయిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా పూడిక, చెత్తాచెదారం తొలగించడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. టెండర్ల ప్రక్రియ పూర్తవగా ఆ పనులను గుత్తేదారులకు అప్పగించనున్నారు. వచ్చే నెల మొదటి వారంలోగా పనులు పూర్తి చేసి వర్షం నీరు సాఫీగా ప్రవహించేలా పూడికను తొలగించాలని భావిస్తున్నారు. పూర్తిస్థాయిలో వరద కాల్వలు శుభ్రం చేయకుండా ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే పూడికను తొలగించేలా టెండర్లలో పొందుపర్చారు.
అధ్వానంగా అంతర్గత కాలువలు
ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న మురుగునీటి కాల్వలతో పాటు అంతర్గత వీధుల్లోని డ్రైనేజీలలో మట్టి పేరుకుపోయింది. కొన్నిచోట్ల మూసుకుపోగా, మరికొన్ని చోట్ల చెత్తాచెదారం నిండి ఉంది. ఆరు నెలలుగా పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదు. డ్రైనేజీలలో చెత్తను తొలగించడం లేదు. మురుగునీరు అలాగే నిలిచి ఉంటుంది. గతంలో ఎప్పటికప్పుడు పనులు చేసే వారు. కొన్ని నెలలుగా కార్మికులు, ఇన్స్పెక్టర్లు, జవాన్లు పట్టనట్లుగా ఉంటున్నారు.
శుభ్రం చేస్తేనే..
నూతన రహదారులు నిర్మించిన చోట బహిరంగ కాల్వలే కనిపించడం లేదు. పైపులైనుతో డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. ప్రతీ వంద మీటర్లకు ఒక ఛాంబర్ ఇస్తుండగా దాని పక్కనే పైపులతో రంధ్రాలు వదిలేశారు. వర్షం నీరంతా ఇందులోంచే వెళ్లాల్సి ఉండగా అవి మూసుకుపోయాయి. డివిజన్ల వారీగా వీటన్నింటినీ పరిశీలించి చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయిస్తే నీరంతా డ్రైనేజీల్లోకి వెళ్లే అవకాశముంది.
15 రోజుల్లో పూర్తికి చర్యలు..
వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా ముందస్తుగా నాలాలు, డ్రైనేజీలు శుభ్రం చేసే పనులు వెంటనే ప్రారంభించనున్నాం. వరద కాల్వలు గుత్తేదారులతో, మురుగునీటి కాల్వలు కార్మికులతో శుభ్రం చేయిస్తాం. 15 రోజుల్లో పనులు పూర్తయ్యేలా చర్యలకు ఆదేశించాం.
బి.శ్రీనివాస్, కమిషనర్, కరీంనగర్ నగరపాలిక
పూడికతీత పనులు ఇక్కడే..
- గౌతమినగర్, అమీర్నగర్, కోతిరాంపూర్, కట్టరాంపూర్, భగత్నగర్ వైపు ఉన్న వరదకాల్వ
- మల్కాపూర్ రోడ్డు చౌరస్తా నుంచి శాతవాహన యూనివర్సిటీ నుంచి కొత్త లేబర్ అడ్డా జ్యోతినగర్
- రాంనగర్ పారమిత, సిద్ధార్థ స్కూల్స్ నుంచి చేపల మార్కెట్
- వాణినికేతన్ స్కూల్ వెనుక నుంచి టూటౌన్ పోలీస్స్టేషన్ ఆర్ఆండ్బీ రోడ్డు కల్వర్టు
- రాంనగర్ చౌరస్తా నుంచి మార్క్ఫెడ్ వరకు ఉన్న ఆర్ఆండ్బీ డ్రైనేజీ
- రైల్వేట్రాక్(ఈ19) నుంచి తీగలగుట్టపల్లి ప్రధాన రహదారి రైల్వే గేట్
- ముకరంపుర పరివార్ బేకరీ నుంచి సాయికృష్ణ థియేటర్ వరకు, ఇక్కడి నుంచి కలెక్టరేట్, కలెక్టరేట్ నుంచి అంబేడ్కర్ స్టేడియం
- శనివారం అంగడి బజారు నుంచి వరాహస్వామి గుడి వరకు గల వరదకాల్వ
- ప్రభుత్వాసుపత్రి ఎదురుగా నుంచి శర్మనగర్ మీదుగా శనివారం అంగడి బజారు
- సాయిబాబా టెంపుల్ నుంచి గౌరిశెట్టి కాంప్లెక్స్
- డీ94 కాలువ నుంచి జగిత్యాల రోడ్డు.. అక్కడి నుంచి రేకుర్తి వరకు. డీ94 కాలువ నుంచి గౌడ్స్ కాలనీ
- దోబీఘాట్ జంక్షన్ నుంచి హోటల్ శ్వేత, తారక వరకు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేనేం పాపం చేశానమ్మా!
[ 15-06-2024]
అమ్మా.. ఏడుస్తున్నావా! ఎందుకమ్మా రోదిస్తావ్.. నీ ఒడిలో ఉండగానే ఓ మృగం నన్ను కాటేసిందని కుమిలిపోతున్నావా! తల్లి పొత్తిళ్లలోనే ఆడపిల్లకు రక్షణ లేదని బాధ పడుతున్నావా.. అయినా.. ఏడ్చి ఏం సాధిస్తావమ్మా? -
వేగంగా.. పారదర్శకంగా..!
[ 15-06-2024]
గత సర్కారు హయాంలో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం అమలు తీరు, మంచినీరు ఏ విధంగా అందుతుంది? జలాలపై ప్రజల అభిప్రాయ సేకరణకు ప్రస్తుత ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వే చేయిస్తోంది. -
ప్రగతి చక్రానికి రథ సారథులు
[ 15-06-2024]
ఆర్టీసీ అనగానే టక్కున గుర్తుకొచ్చేది ప్రజా రవాణా వ్యవస్థ. అన్ని వర్గాల ప్రజలను బస్సుల్లో వారివారి గమ్యస్థానాలకు చేరవేస్తుంటుంది. వీటికి సారథులుగా వివిధ విభాగాల్లో పని చేసే ఉద్యోగులే కీలకపాత్ర పోషిస్తుంటారు. -
ఎవరికీ పట్టని వలస బతుకులు
[ 15-06-2024]
వలస కార్మికుల రక్షణకు పాలకులు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి -
సొంతింటి కల నెరవేరేదెన్నడో?
[ 15-06-2024]
పేదల సొంతింటి కల నెరవేరబోతోంది. గత ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. -
రామగుండం విద్యుత్తు కేంద్రం విస్తరణపై సందిగ్ధం
[ 15-06-2024]
రామగుండం విద్యుత్తు కేంద్రం విస్తరణపై మరోసారి సందిగ్ధం నెలకొంది. మూకుమ్మడిగా అధికారులను యాదాద్రి విద్యుత్తు కేంద్రానికి డిప్యుటేషన్ కల్పిస్తూ ఆదేశాలు రావడంతో ఆందోళన నెలకొంది -
నిధులు చాలక... అంగన్వాడీ భవనాలు పూర్తికాక
[ 15-06-2024]
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆట, పాటలతో కూడిన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అయితే సొంత భవనాలు లేక చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు -
మురుగు శుద్ధి ఎప్పుడో?
[ 15-06-2024]
జిల్లా కేంద్రం.. సిరిసిల్ల పట్టణం రోజురోజుకు విస్తరిస్తోంది. జనావాసాలు, డైయింగ్ యూనిట్ల నుంచి నిత్యం 20 ఎంఎల్డీ (మిలియన్ లిక్విడ్ డిఛార్జి)లకు పైగా వ్యర్థ జలాలు నేరుగా మానేరు వాగులో కలుస్తున్నాయి -
జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు దంపతులు
[ 15-06-2024]
మావోయిస్టు దంపతులు శుక్రవారం కరీంనగర్ సీపీ, వరంగల్ కమిషనరేట్ ఇన్ఛార్జి కమిషనర్ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో జనజీవన స్రవంతిలో కలిశారు. కరీంనగర్లో జరిగిన మీడియా సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు -
ద్విభాషా పుస్తకం.. అవగాహన సులభం
[ 15-06-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో ఉన్నతమైన బోధనను విద్యార్థులకు అందజేయాలన్న ఉద్దేశంతో మూడేళ్ల క్రితం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వం ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టింది. -
ఆలయ ఉద్యోగుల్లో బదిలీల గుబులు
[ 15-06-2024]
ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన ఆలయ ఉద్యోగులకు బదిలీల గుబులు పట్టుకుంది. దీర్ఘకాలంగా ఒకేచోట పని చేస్తున్న వారికి ఈసారి స్థానచలనం తప్పదని చెబుతున్నారు. -
అప్పు తీసుకున్న వారి వేధింపులు..మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
[ 15-06-2024]
అప్పు తీసుకున్న వ్యక్తులు తిరిగి చెల్లించకపోగా చంపుతామని బెదిరించడం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. -
హమ్మయ్య.. జీతాలు వచ్చాయి
[ 15-06-2024]
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పని చేస్తున్న 200 మంది నర్సింగ్ అధికారులకు ఎట్టకేలకు జీతాలు వచ్చాయి -
పూడిక తొలగింపుతోనే.. భవిష్యత్తుకు భరోసా
[ 15-06-2024]
శ్రీరాంసాగర్ జలాశయంలో పూడిక పేరుకుని నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు తగ్గినట్లు ఇటీవలే అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది: హోంమంత్రి అనిత
-
మళ్లీ ‘మెలోడీ’ మూమెంట్.. మోదీ, మెలోనీ మరో సెల్ఫీ వైరల్
-
అనంతలో దుండగుల దుశ్చర్య.. ఓటమి అక్కసుతో తాగునీటి ట్యాంకులో పురుగుల మందు
-
తెలుగు ఐఏఎస్ కృష్ణతేజ సేవలు అభినందనీయం: డిప్యూటీ సీఎం పవన్
-
వాళ్ల స్టార్డమ్ను దృష్టిలో పెట్టుకొనే కల్కి రూపొందించా: నాగ్ అశ్విన్
-
భారీ మెజార్టీతో గెలిపించారు.. నాపై బాధ్యత మరింత పెరిగింది: ‘ప్రజా దర్బార్’లో నారా లోకేశ్