డివిజన్ కేంద్రం.. సేవలు జాప్యం
మంథని డివిజన్ కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో పూర్తి స్థాయిలో సేవలందడం లేదు.
మంథని ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీలు
న్యూస్టుడే, మంథని: మంథని డివిజన్ కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో పూర్తి స్థాయిలో సేవలందడం లేదు. ఎంపీడీవో, ఆర్డీవో, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, పురపాలక సంఘం, ఆసుపత్రులు, ఎస్టీవో కార్యాలయాల్లో ఏళ్ల తరబడి పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. కొన్ని కార్యాలయాల ఉద్యోగులు డిప్యుటేషన్పై ఇతర ప్రాంతాల్లో పని చేస్తుండటంతో స్థానికంగా సేవల్లో జాప్యం జరుగుతోంది.
ఆర్డీవో కార్యాలయం
- ఖాళీలు: రెండు డిప్యూటీ తహసీల్దారు, రెండు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు.
- ప్రభావం: దస్త్రాలు త్వరగా కదలక భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో జాప్యం.
మున్సిపాలిటీ
- మేనేజర్, పట్టణ ప్రణాళిక అధికారి(టీపీవో), ఏఈ, శానిటరీ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.
- ఇళ్ల నిర్మాణాలకు అనుమతిలో జాప్యం జరుగుతోంది. మంచిర్యాలకు చెందిన ఇన్ఛార్జి అధికారి వారానికి ఒక రోజు కూడా మంథనికి రాకపోవడంతో కొన్ని ఇళ్లను పరిశీలించకుండానే అనుమతి ఇస్తున్నారని, అన్నీ సక్రమంగా ఉన్నా కొన్నింటికి అనుమతి రావడం లేదన్న ఆరోపణలున్నాయి. శానిటరీ ఇన్స్పెక్టర్ లేక పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదు. మేనేజర్, సిబ్బంది అందుబాటులో లేక కార్యాలయంలో దస్త్రాల ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
మండల పరిషత్తు
- ఎంపీడీవో, సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.
- ఉపాధిహామీ పథకం, సామాజిక పింఛన్లు తదితర పనులపై కార్యాలయానికి వచ్చే ప్రజలు ఎంపీడీవో అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. కమాన్పూర్ ఎంపీడీవో మంథని బాధ్యతలు అదనంగా నిర్వర్తిస్తుండగా వారానికి రెండు రోజులు మాత్రమే వస్తున్నారు. మిగతా రోజుల్లో ఎంపీడీవో వద్దకు దస్త్రాలు తీసుకెళ్దామంటే కార్యాలయంలో సిబ్బంది కొరత నెలకొంది.
పంచాయతీరాజ్ సబ్డివిజన్
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, మూడు ఏఈ పోస్టులు. (మంథని, ముత్తారం, రామగిరి, ముత్తారం మండలాలకు నలుగురు ఏఈలు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఒకరు మాత్రమే ఉన్నారు.)
- ఒకే ఏఈ ఉండటం, టెక్నికల్ అసిస్టెంట్ లేకపోవడంతో నిర్మాణం పనుల్లో జాప్యం.
కోశాగార శాఖ
- ఏటీవో, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.
- పంచాయతీలు, గుత్తేదారులు, ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు పాస్ కావడం లేదు.
- ఆర్ అండ్ బీ శాఖ సబ్ డివిజన్ సీనియర్ అసిస్టెంట్, రెండు ఏఈ పోస్టులు.
- ఒకే ఏఈ ఉండటంతో కళాశాల భవనాలు, వంతెనలు, రహదారి నిర్మాణం పనులు ఆలస్యం.
వ్యవసాయ శాఖ
- మండల వ్యవసాయాధికారి పోస్టు. రామగిరి అధికారికి అదనపు బాధ్యతలు.
- సీజన్లో సేవలందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు తెగుళ్లు వచ్చినపుడు నివారణపై రైతులకు అవగాహన కల్పించడం లేదు.
గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం
- జూనియర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు.
- గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తినపుడు అటు మిషన్ భగీరథ అధికారులు లేక, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగంలో సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
విద్యా శాఖ
- మండల విద్యాధికారి పోస్టు.
- గుంజపడుగు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి మంథని, ముత్తారం మండలాలకు ఇన్ఛార్జి అధికారిగా బాధ్యతలు. పాఠశాలలపై పర్యవేక్షణ లోపంతో పాటు సకాలంలో పనులు జరగడం లేదు.
ఐసీడీఎస్ కార్యాలయం
- సీడీపీవో, గ్రేడ్-2 సుపర్వైజర్, టైపిస్టు, నైట్ వాచ్మెన్ పోస్టులు.
- గోదావరిఖని సీడీపీవో మంథని బాధ్యతలు చూస్తుండగా వారానికి ఒకసారి మాత్రమే వస్తున్నారు. కార్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులపై పర్యవేక్షణ కరవైంది.
మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం
- గైనకాలజిస్టు, మత్తు వైద్య నిపుణుడు, నాలుగు స్టాఫ్ నర్సు, రెండు ల్యాబ్ టెక్నికల్ అసిస్టెంట్, మూడు థియేటర్ అసిస్టెంట్ పోస్టులు, మూడు డాటా ఎంట్రీ ఆపరేటర్, నాలుగు ఒప్పంద ఉద్యోగులు, ఒక సెక్యూరిటీ గార్డు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- గైనకాలజిస్టులు లేక గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. ఆపరేషన్ సమయంలో థియేటర్ అసిస్టెంట్లు లేక వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు.
సామాజిక వైద్యశాల
- నలుగురు వైద్యులు, 12 స్టాఫ్ నర్సులు, ఒక ఎంఎన్వో పోస్టులు.
- వైద్యుల కొరతతో రోగుల ఇబ్బందులు. వైద్యులు మధ్యాహ్నం వరకే అందుబాటులో ఉండటంతో సాయంత్రం, రాత్రి వేళల్లో రోగులకు వైద్య సేవలు అందడం లేదు.
నీటి పారుదల శాఖ సబ్ డివిజన్
- రెండు ఏఈ, అటెండర్, వాచ్మెన్ పోస్టులు.
- చెరువులపై పర్యవేక్షణ కొరవడింది. ఎస్సారెస్పీ కాలువ నీటి విడుదల సమయంలో పర్యవేక్షణ సరిగ్గా లేక చివరి ఆయకట్టుకు అందని పరిస్థితి.
త్వరలోనే భర్తీకి చర్యలు
మంథని నియోజకవర్గ పరిధిలో అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని రెండు జిల్లాల కలెక్టర్లకు, ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఆదేశించాం. ప్రస్తుతం ఉన్న ఖాళీ పోస్టులతో పాటు త్వరలో జరిగే ఉద్యోగ నియామకాల్లో నియాజకవర్గానికి ప్రాధాన్యమిస్తాం.
డి.శ్రీధర్బాబు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేనేం పాపం చేశానమ్మా!
[ 15-06-2024]
అమ్మా.. ఏడుస్తున్నావా! ఎందుకమ్మా రోదిస్తావ్.. నీ ఒడిలో ఉండగానే ఓ మృగం నన్ను కాటేసిందని కుమిలిపోతున్నావా! తల్లి పొత్తిళ్లలోనే ఆడపిల్లకు రక్షణ లేదని బాధ పడుతున్నావా.. అయినా.. ఏడ్చి ఏం సాధిస్తావమ్మా? -
వేగంగా.. పారదర్శకంగా..!
[ 15-06-2024]
గత సర్కారు హయాంలో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం అమలు తీరు, మంచినీరు ఏ విధంగా అందుతుంది? జలాలపై ప్రజల అభిప్రాయ సేకరణకు ప్రస్తుత ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వే చేయిస్తోంది. -
ప్రగతి చక్రానికి రథ సారథులు
[ 15-06-2024]
ఆర్టీసీ అనగానే టక్కున గుర్తుకొచ్చేది ప్రజా రవాణా వ్యవస్థ. అన్ని వర్గాల ప్రజలను బస్సుల్లో వారివారి గమ్యస్థానాలకు చేరవేస్తుంటుంది. వీటికి సారథులుగా వివిధ విభాగాల్లో పని చేసే ఉద్యోగులే కీలకపాత్ర పోషిస్తుంటారు. -
ఎవరికీ పట్టని వలస బతుకులు
[ 15-06-2024]
వలస కార్మికుల రక్షణకు పాలకులు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి -
సొంతింటి కల నెరవేరేదెన్నడో?
[ 15-06-2024]
పేదల సొంతింటి కల నెరవేరబోతోంది. గత ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. -
రామగుండం విద్యుత్తు కేంద్రం విస్తరణపై సందిగ్ధం
[ 15-06-2024]
రామగుండం విద్యుత్తు కేంద్రం విస్తరణపై మరోసారి సందిగ్ధం నెలకొంది. మూకుమ్మడిగా అధికారులను యాదాద్రి విద్యుత్తు కేంద్రానికి డిప్యుటేషన్ కల్పిస్తూ ఆదేశాలు రావడంతో ఆందోళన నెలకొంది -
నిధులు చాలక... అంగన్వాడీ భవనాలు పూర్తికాక
[ 15-06-2024]
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆట, పాటలతో కూడిన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అయితే సొంత భవనాలు లేక చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు -
మురుగు శుద్ధి ఎప్పుడో?
[ 15-06-2024]
జిల్లా కేంద్రం.. సిరిసిల్ల పట్టణం రోజురోజుకు విస్తరిస్తోంది. జనావాసాలు, డైయింగ్ యూనిట్ల నుంచి నిత్యం 20 ఎంఎల్డీ (మిలియన్ లిక్విడ్ డిఛార్జి)లకు పైగా వ్యర్థ జలాలు నేరుగా మానేరు వాగులో కలుస్తున్నాయి -
జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు దంపతులు
[ 15-06-2024]
మావోయిస్టు దంపతులు శుక్రవారం కరీంనగర్ సీపీ, వరంగల్ కమిషనరేట్ ఇన్ఛార్జి కమిషనర్ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో జనజీవన స్రవంతిలో కలిశారు. కరీంనగర్లో జరిగిన మీడియా సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు -
ద్విభాషా పుస్తకం.. అవగాహన సులభం
[ 15-06-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో ఉన్నతమైన బోధనను విద్యార్థులకు అందజేయాలన్న ఉద్దేశంతో మూడేళ్ల క్రితం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వం ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టింది. -
ఆలయ ఉద్యోగుల్లో బదిలీల గుబులు
[ 15-06-2024]
ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన ఆలయ ఉద్యోగులకు బదిలీల గుబులు పట్టుకుంది. దీర్ఘకాలంగా ఒకేచోట పని చేస్తున్న వారికి ఈసారి స్థానచలనం తప్పదని చెబుతున్నారు. -
అప్పు తీసుకున్న వారి వేధింపులు..మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
[ 15-06-2024]
అప్పు తీసుకున్న వ్యక్తులు తిరిగి చెల్లించకపోగా చంపుతామని బెదిరించడం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. -
హమ్మయ్య.. జీతాలు వచ్చాయి
[ 15-06-2024]
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పని చేస్తున్న 200 మంది నర్సింగ్ అధికారులకు ఎట్టకేలకు జీతాలు వచ్చాయి -
పూడిక తొలగింపుతోనే.. భవిష్యత్తుకు భరోసా
[ 15-06-2024]
శ్రీరాంసాగర్ జలాశయంలో పూడిక పేరుకుని నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు తగ్గినట్లు ఇటీవలే అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కోహ్లీ అలా చేస్తే రిషభ్ పంత్ సంతోషిస్తాడు’
-
వాహనదారులకు కర్ణాటక భారీ షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలపై వాత
-
రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక: మంత్రి నారాయణ
-
మినిస్టర్ పవన్కల్యాణ్.. అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చిన వదినమ్మ సురేఖ
-
‘మౌస్ జిగ్లింగ్’ చేస్తున్నారని ఉద్యోగులపై కంపెనీ వేటు.. ఇంతకీ ఏంటిది?
-
ఆ మంత్రిత్వ శాఖలు నా మనసుకు దగ్గరగా ఉన్నాయి.. ప్రజలకు మేలు చేస్తా: పవన్