logo

Prabhas: దుర్గా పరమేశ్వరి సేవలో ప్రభాస్‌.. గుర్తుపట్టని అభిమానులు

చారిత్రక కటీలు దుర్గా పరమేశ్వరి అమ్మవారిని ప్రముఖ నటుడు ప్రభాస్‌ దర్శించుకున్నారు. మాస్కు ధరించి, శుక్రవారం ఆలయానికి వచ్చిన ఆయనను చివరి క్షణం వరకు భక్తులు గుర్తించలేదు.

Updated : 13 Jan 2024 07:17 IST

అమ్మవారి చిత్రపటాన్ని అందుకుంటున్న ప్రభాస్‌

మంగళూరు, న్యూస్‌టుడే : చారిత్రక కటీలు దుర్గా పరమేశ్వరి అమ్మవారిని ప్రముఖ నటుడు ప్రభాస్‌ దర్శించుకున్నారు. మాస్కు ధరించి, శుక్రవారం ఆలయానికి వచ్చిన ఆయనను చివరి క్షణం వరకు భక్తులు గుర్తించలేదు. ‘సలార్‌’ చిత్ర నిర్మాత విజయ్‌ కిరంగదూరుతో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సమితి ప్రతినిధులు ప్రభాస్‌కు అమ్మవారి పటాన్ని బహూకరించారు. అమ్మవారి చిత్రాన్ని అందుకుంటున్న నటుని చిత్రాన్ని ఆలయ ప్రతినిధులు శుక్రవారం విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని