మరింత పడిపోయిన విద్యుదుత్పాదన
రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.
రాయచూరు ఉష్ణ విద్యుత్తు కేంద్రం టవర్లు
రాయచూరు, న్యూస్టుడే : రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం. రాయచూరు కేంద్రంలో ఒకటి, రెండు, మూడు, ఆరు యూనిట్లు పూర్తిగా స్తంభించాయి. నాలుగు, ఐదు, ఏడు, ఎనిమిది యూనిట్ల ద్వారా కేవలం 669 మెగావాట్ల తయారీ సాధ్యపడుతోంది. ఈ కేంద్రం మొత్తం ఉత్పాదన సామర్థ్యం 1720 మెగావాట్లు. సగం యూనిట్లు పడకేయడంతో 1051 మెగావాట్ల విద్యుత్తు నష్టం వాటిల్లింది. 1700 మెగావాట్ల సామర్థ్యమున్న బళ్లారిలో 646 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నారు. మూడు యూనిట్లలో చివరి యూనిట్ ఆగిపోయింది. రెండు యూనిట్లలో పూర్తి స్ధాయిలో ఉత్పాదన సాధ్యపడటం లేదు. ఫలితంగా 1054 మెగావాట్లను కోల్పోయింది. యరమరాస్లోని ఒకటి, రెండు యూనిట్లు ద్వారా 1600 మెగావాట్ల ఉత్పాదన చేయాల్సి ఉండగా... 754 మెగావాట్లే అందుతోంది. యూనిట్లలో ఆశించినంత తయారీ జరగనందున 846 మెగావాట్ల నష్టపోయింది. ఐదు కేంద్రాల ద్వారా ప్రతి రోజూ 7680 మెగావాట్ల ఉత్పాదన జరగాలి. సాయంత్రం వరకు 3506 మెగావాట్లను ఉత్పత్తి చేశారు. 4174 మెగావాట్లను కర్ణాటక విద్యుత్తు నిగమ కోల్పోయింది. జలాశయాల్లో నీటి మట్టం పడిపోవడం, సాంకేతిక కారణాల వల్లనే యూనిట్లు నిలిపివేయటానికి కారణంగా తెలుస్తోంది.
ఉడుపిలోని రెండు యూనిట్ల ద్వారా (సామర్థ్యం 1200 మెగావాట్లు) 927 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఉత్పాదనలో ఎంతో మెరుగుపడినట్లు నిపుణులు వివరించారు. 1460 మెగావాట్ల కెపాసిటీ ఉన్న జిందాల్లో మార్చి ఆరంభంలో రెండంకెల సంఖ్యలో ఉత్పాదన నమోదయ్యేది. గురువారం 510 మెగావాట్లు తయారైంది. దీన్ని మంచి పరిణామంగా భావిస్తున్నారు.
జల విద్యుత్తు..
రాష్ట్రంలోని జలవిద్యుత్తు కేంద్రాలు మొండికేస్తున్నాయి. శరావతిలో 605, నాగజహరిలో 507, వారాహిలో 228, కొడసళ్లిలో 113, గేరుసొప్పాలో 104, కాద్రాలో 50, జోగ్లో 45, సూపాలో 40, శివసముద్రంలో 14, ఎల్పీహెచ్లో 13, మణిడ్యామ్లో ఒక మెగావాట్ ఉత్పత్తి చేస్తున్నారు. జల కేంద్రాల ద్వారా మొత్తం 1720 మెగావాట్లు తయారు అవుతోంది. షింషా, మునిరాబాద్, బాద్రా, ఘటక ప్రభ, ఆలమట్టిలో ఉత్పాదన శూన్యం. హైడ్రాలిక్ ప్రాజెక్టుల్లో ఉత్పాదన అవుతున్నందునే థర్మల్లో ఉత్పత్తి తగ్గిన ప్రభావం ప్రస్తుతానికి కన్పించడం లేదు. ఏప్రిల్, మే నెలల్లో జల ఉత్పాదన నిలిపివేసే అవకాశముంది. విపత్తును తప్పించేందుకు శాఖోత్పన్న కేంద్రాల్లో ఉత్పాదన పెంచుకోవాలని విద్యుత్తు నిపుణులు విద్యుత్తు నిగమ ఉన్నాధిÅకారులకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరన్న దిగ్విజయ యాత్ర
[ 27-04-2024]
ప్రజాస్వామ్య పండగలో ఓటర్లు తమ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించారు. -
పోలింగ్.. శాంతియుతం
[ 27-04-2024]
చెదురుమదురు ఘటనలు మినహా 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. -
భాజపాది ఖాళీ చెంబు పార్టీ
[ 27-04-2024]
భాజపా ఖాళీ చెంబు పార్టీ. ఖాళీ చెంబుతో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పెట్టుబడిదారులకే మోదీ ఊతం
[ 27-04-2024]
రైతుల రుణాలు మాఫీˆ చేయడం కన్నా, శ్రీమంతులు, పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేయడంపైనే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆసక్తి ఎక్కువని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. -
ప్చ్.. నగరం.. తీరు మారలేదు
[ 27-04-2024]
విద్యావంతులు అధికంగా ఉండే బెంగళూరు నగరవాసులు ఆశించిన స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
సకుటుంబ సమేతంగా..!
[ 27-04-2024]
రాష్ట్రంలో తొలి విడత లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కీలక నాయకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి సందడి చేయడం ఆసక్తికరంగా సాగింది. -
బౌండరీ దాటిన ఓటు బంతి!
[ 27-04-2024]
లోకసభ ఎన్నికల పోలింగ్ ఘట్టాన్ని క్రీడాకారులు ఆసక్తికరంగా మార్చారు. -
ఎందరో మహానుభావులు..
[ 27-04-2024]
ఎండ తీవ్రత పెరగకనే ఓటేయాలని బెంగళూరు వాసులు ఉత్సాహంగా కదలడం శుక్రవారం ఉదయమే కనిపించింది. -
విధి నిర్వహణలోనే తుదిశ్వాస వదిలి..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఓ అధికారిణి మృతి చెందిన ఘటన చెళ్లకెర తాలూకాలో శుక్రవారం జరిగింది. -
వేర్వేరు ప్రాంతాల్లో బాలికలపై లైంగికదాడి
[ 27-04-2024]
రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి దిగ్భ్రాంతి కలిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో