logo

తిరుమలలో కర్ణాటక యువకుడి హల్‌చల్‌

బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్‌చల్‌ చేశాడు.

Published : 19 Apr 2024 03:10 IST

శ్రీవారి ఆలయం ఎదుట కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలి ఫొటోతో కార్యకర్త

తిరుమల, న్యూస్‌టుడే : బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్‌చల్‌ చేశాడు. తమ నాయకురాలు భారీ మెజార్టీతో గెలవాలని శ్రీవారిని ఆకాంక్షిస్తున్నానని వీడియో, ఫొటోలు తీసుకున్నాడు. ఇంత జరుగుతున్నా అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అతడిని నిలువరించలేదు. రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, ఫొటోలు శ్రీవారి ఆలయం వద్దకు తీసుకురావడం నిషేధం. అయినా ఫొటోతోపాటు తిరుమలకు చేరుకుని ప్రచారం చేయడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని