యాప్ల వలలో విలవిల
పబ్జీ, బెట్టింగ్ యాప్ల వలలో పడిన ఇద్దరు బాలురను (17) బెదిరించి నగలు, నగదు, వస్తువులను దోచుకున్న నలుగురిని రాజరాజేశ్వరినగర ఠాణా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
నిందితుల నుంచి జప్తు చేసుకున్న నగదును పరిశీలిస్తున్న కొత్వాలు
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : పబ్జీ, బెట్టింగ్ యాప్ల వలలో పడిన ఇద్దరు బాలురను (17) బెదిరించి నగలు, నగదు, వస్తువులను దోచుకున్న నలుగురిని రాజరాజేశ్వరినగర ఠాణా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గంగావతికి చెందిన కార్తిక్ కుమార్ (42), సునీల్ (30), రాజరాజేశ్వరినగర నివాసి వెమన్ (19), కెంగేరి ఉపనగర నివాసి వివేక్ (19)లను నిందితులుగా గుర్తించారు. ఆభరణాలను కరిగించిన ముద్దగా చేసిన 302 గ్రాముల బంగారం, రూ.23.50 లక్షల నగదుతో కలిపి రూ.41.50 లక్షల సొత్తు వీరి నుంచి జప్తు చేసుకున్నామని నగర పోలీసు కమిషనర్ బి.దయానంద్ వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే.. ఐడియల్ హోమ్స్లో ఉంటున్న ఒక విద్యార్థి చెడు అలవాట్ల బారిన పడ్డాడు. బెట్టింగ్ యాప్లలో పెద్ద మొత్తాన్ని కోల్పోయాడు. మరో స్నేహితుడి ఇంటి నుంచి సుమారు 600 గ్రాముల ఆభరణాలను దొంగిలించి తీసుకురమ్మని, వాటిని తాకట్టు పెట్టి నగదు చేసుకుని, పందేలు కొనసాగించాడు. వారి బలహీనతను అడ్డుపెట్టుకున్న నిందితులు ఆభరణాలు తీసుకుని, తక్కువ మొత్తాన్ని ఆ విద్యార్థులకు ఇచ్చారు. ప్రతిసారీ వారిద్దరి ఇళ్ల నుంచి నగదు, బంగారాన్ని తీసుకురమ్మని బెదిరిస్తూ వచ్చారు. తమ నివాసంలో బంగారం దొంగతనమైన విషయాన్ని గుర్తించిన ఒక విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు విచారణలో ఇద్దరు విద్యార్థులూ ఈ నగలను తాకట్టు పెట్టారని గుర్తించారు. నగలు తాకట్టు పెట్టుకుని, బెదిరింపులకు పాల్పడిన నలుగురిని అరెస్టు చేశామని దయానంద్ తెలిపారు. సమావేశంలో పోలీసు అధికారులు సతీశ్ కుమార్, రమణ గుప్త, చంద్రగుప్త తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మత్తు వీడలేకనే చిత్తు
[ 22-05-2024]
రాష్ట్ర హోంశాఖ ఏటేటా రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మారుస్తామని ప్రకటనలు చేస్తున్నా.. అదంతా మాటలకే పరిమితమని తేలిపోతోంది. -
హజ్ యాత్రకు ముందడుగు
[ 22-05-2024]
భారతదేశంలోని అన్ని ధర్మాలకు చెందిన పౌరులు ఒకే తల్లి బిడ్డలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
అన్నదాత బతుకు విషాదాంతం
[ 22-05-2024]
కర్ణాటకలో ఓ రైతన్న మరణం దిగ్భ్రమగొలిపింది. బెళగావి జిల్లా ఇస్లాంపురానికి చెందిన రాజు ఖోతగి అనే రైతు సేద్యం కోసం స్థానికంగా ఓ మహిళ నుంచి రుణం తీసుకుని నిలువునా కష్టాల్లో మునిగిపోయాడు. -
ఎన్ఐఏ అధికారుల దాడుల జోరు
[ 22-05-2024]
కన్నడిగుల రాజధాని నగరి బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్ ప్రాంత రామేశ్వరం కేఫ్లో పేలుడుకు సంబంధించిన కేసులో కీలక ఆధారాల సేకరణ దిశగా జాతీయ భద్రతా దళం (ఎన్ఐఏ) కీలక చర్యలకు ఉపక్రమించింది. -
కొడగు.. విహారానికి గొడు
[ 22-05-2024]
భారతీయ సైన్యానికి ఎందరెందరో వీరాధివీరులను అందించిన కొడగు సీమ అందాల వైభవం మాటలకందనిది. అక్కడి ప్రకృతి పారవశ్యం వర్ణనాతీతం. -
హంపీలో కూలిన పురాతన మండపాలు
[ 22-05-2024]
పర్యాటక నగరి హంపీలో వారం నుంచి కురుస్తున్న వర్షాలకు విరుపాక్ష వీధిలోని పురాతన మండపాల్లో కొన్ని మంగళవారం రాత్రి ఉన్నట్టుండి కుప్పకూలాయి. -
ఆదోనిలో భారీగా గంజాయి స్వాధీనం
[ 22-05-2024]
కర్ణాటకలోని బళ్లారిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ఆరా తీయడంతో డొంక కదిలింది. -
బంగేరా జీవితం.. ప్రజలకే అంకితం
[ 22-05-2024]
తాను, వసంత బంగేరా ఇద్దరం ఒకేసారి విధానసౌధలో అడుగుపెట్టామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గుర్తుచేసుకున్నారు. -
సహాయ నటి విద్యా నందీశ్ హత్య
[ 22-05-2024]
భజరంగి’తో పాటు పలు చిత్రాల్లో సహాయక నటిగా పని చేసిన విద్యా నందీశ్ (35) దారుణ హత్యకు గురైంది. ఆమె భర్త నందీశ్ సుత్తితో కొట్టి, హత్య చేసి పరారయ్యాడని పోలీస్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..