ఆమె ప్రాతినిధ్యం..అంతంత మాత్రం!
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించిన బళ్లారి లోక్సభ నియోజకవర్గంలో ఈసారి మహిళా అభ్యర్థులు పోటీ చేయలేదు.
బళ్లారి లోక్సభ నియోజకవర్గంలో పోటీకి దూరంగా మహిళలు
బసవరాజేశ్వరి హ్యాట్రిక్ విజయం
బళ్లారి, న్యూస్టుడే: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించిన బళ్లారి లోక్సభ నియోజకవర్గంలో ఈసారి మహిళా అభ్యర్థులు పోటీ చేయలేదు. ఓటర్ల సంఖ్యలో సింహభాగం వారే ఉన్నా..పోటీలో మాత్రం వెనుకబడ్డారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో కేంద్ర మాజీ మంత్రి బసవరాజేశ్వరి, భాజపా అగ్రనేత్రి, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, బళ్లారి జిల్లాలో భాజపాకు గట్టి పునాది వేసిన సుష్మాస్వరాజ్, మాజీ మంత్రి బి.శ్రీరాములు సోదరి జె.శాంతల పోటీతో అందరి దృష్టిని ఆకర్షించిన బళ్లారి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మహిళల పోటీలేకుండానే ఎన్నిక జరుగనుంది. జాతీయ పార్టీలతో పాటు, గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల నుంచి పురుషులే పోటీలో నిలిచారు.
మేటి నాయకురాళ్లు పోటీ చేసిన గడ్డ
బళ్లారి లోక్సభ నియోజకవర్గానికి 1952 నుంచి 2019 వరకు 17 సార్వత్రిక, రెండు ఉప ఎన్నికలు కలిపి మొత్తం 19 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి మొదటి సారిగా 1984లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బసవరాజేశ్వరి ఒక్కరే బరిలో నిలిచారు. ఎన్నికల్లో గెలిచి ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఆమె వరుసగా 1984, 1989, 1991లో గెలుపొందారు. కేంద్రంలో ప్రధాని పి.వి.నరసింహారావు మంత్రి వర్గంలో కేంద్ర మహిళ-శిశు అభివృద్ధి మంత్రిగా పనిచేశారు. అనంతరం 1996, 1998లో జరిగిన ఎన్నికల్లో మహిళలు పోటీకి దూరంగా ఉండిపోయారు. 1999లో దేశ, అంతర్జాతీయ స్థాయిలోనే ఈ స్థానానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి అగ్రనేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి సుష్మాస్వరాజ్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సోనియాగాంధీ 56,100 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గెలిచినా అమేథికి పరిమితం కావడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో గౌసియా బేగం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 10,306 ఓట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. 2009లో భాజపా నుంచి జె. శాంత పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు పోటీ చేయలేదు. 2018 ఉప ఎన్నికల్లో జె.శాంత భాజపా అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వి.ఎస్.ఉగ్రప్ప చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లో 12 మంది బరిలో నిలిచినా మహిళలు లేకపోవడం గమనార్హం. ఈ సారి ఎన్నికల్లో అదే పునరావృతం అయింది.
మహిళా ఓటర్లే అధికం
బళ్లారి లోక్సభ నియోజకవర్గం ఎస్టీ కేటగిరీకి రిజర్వేషన్ అయింది. ఈ స్థానం పరిధిలోకి ఎనిమిది విధానసభ నియోజకవర్గాలు వస్తాయి. ఏప్రిల్ 4 వరకు 18 ఏళ్ల పైబడిన వారు ఓటరు జాబితాలో నమోదు చేసుకున్నారు. లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 18,77,751 మంది ఓటర్లు ఉన్నాయి. ఇందులో మహిళా ఓటర్లు 9,51,522 మంది, పురుషులు 9,25,961 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 25,561 మంది ఎక్కువగా ఉన్నారు. అయినా ఈసారి లోక్సభ నియోజకవర్గం నుంచి ఒక్క మహిళా అభ్యర్థి పోటీ చేయలేదని లెక్కలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మత్తు వీడలేకనే చిత్తు
[ 22-05-2024]
రాష్ట్ర హోంశాఖ ఏటేటా రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మారుస్తామని ప్రకటనలు చేస్తున్నా.. అదంతా మాటలకే పరిమితమని తేలిపోతోంది. -
హజ్ యాత్రకు ముందడుగు
[ 22-05-2024]
భారతదేశంలోని అన్ని ధర్మాలకు చెందిన పౌరులు ఒకే తల్లి బిడ్డలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
అన్నదాత బతుకు విషాదాంతం
[ 22-05-2024]
కర్ణాటకలో ఓ రైతన్న మరణం దిగ్భ్రమగొలిపింది. బెళగావి జిల్లా ఇస్లాంపురానికి చెందిన రాజు ఖోతగి అనే రైతు సేద్యం కోసం స్థానికంగా ఓ మహిళ నుంచి రుణం తీసుకుని నిలువునా కష్టాల్లో మునిగిపోయాడు. -
ఎన్ఐఏ అధికారుల దాడుల జోరు
[ 22-05-2024]
కన్నడిగుల రాజధాని నగరి బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్ ప్రాంత రామేశ్వరం కేఫ్లో పేలుడుకు సంబంధించిన కేసులో కీలక ఆధారాల సేకరణ దిశగా జాతీయ భద్రతా దళం (ఎన్ఐఏ) కీలక చర్యలకు ఉపక్రమించింది. -
కొడగు.. విహారానికి గొడు
[ 22-05-2024]
భారతీయ సైన్యానికి ఎందరెందరో వీరాధివీరులను అందించిన కొడగు సీమ అందాల వైభవం మాటలకందనిది. అక్కడి ప్రకృతి పారవశ్యం వర్ణనాతీతం. -
హంపీలో కూలిన పురాతన మండపాలు
[ 22-05-2024]
పర్యాటక నగరి హంపీలో వారం నుంచి కురుస్తున్న వర్షాలకు విరుపాక్ష వీధిలోని పురాతన మండపాల్లో కొన్ని మంగళవారం రాత్రి ఉన్నట్టుండి కుప్పకూలాయి. -
ఆదోనిలో భారీగా గంజాయి స్వాధీనం
[ 22-05-2024]
కర్ణాటకలోని బళ్లారిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ఆరా తీయడంతో డొంక కదిలింది. -
బంగేరా జీవితం.. ప్రజలకే అంకితం
[ 22-05-2024]
తాను, వసంత బంగేరా ఇద్దరం ఒకేసారి విధానసౌధలో అడుగుపెట్టామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గుర్తుచేసుకున్నారు. -
సహాయ నటి విద్యా నందీశ్ హత్య
[ 22-05-2024]
భజరంగి’తో పాటు పలు చిత్రాల్లో సహాయక నటిగా పని చేసిన విద్యా నందీశ్ (35) దారుణ హత్యకు గురైంది. ఆమె భర్త నందీశ్ సుత్తితో కొట్టి, హత్య చేసి పరారయ్యాడని పోలీస్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..