అటవీ వీరుడి కుటుంబానికి అవమానం!
ఆయన అటవీ భూమిని పరిరక్షించడంలో తెగువ చూపారు... విధి నిర్వహణలోనే హత్యకు గురై ప్రాణాలు కోల్పోయాలు... ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఖమ్మం రోటరీనగర్, న్యూస్టుడే
ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబానికి కేటాయించిన స్థలం
ఆయన అటవీ భూమిని పరిరక్షించడంలో తెగువ చూపారు... విధి నిర్వహణలోనే హత్యకు గురై ప్రాణాలు కోల్పోయాలు... ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొని ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు సేవలను కొనియాడారు. సేవలకు గుర్తింపుగా రూ.50 లక్షల పరిహారం, 500 చ.గ ఇంటి స్థలం, భార్యకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. హామీల అమలులో భాగంగా ఇచ్చిన ఇంటి స్థలానికి ఏర్పాటు చేసిన ప్రహరీని కొద్ది రోజులకే తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది మృతుని కుటుంబాన్ని అవమానించడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పరిహారం ఇలా...
శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, 500 చగ ఇంటి స్థలం, భార్య భాగ్యలక్ష్మికి ఉద్యోగావకాశం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఖమ్మం నగరంలో బుర్హాన్పురం రెవెన్యూ సర్వే నెం.93లో 500 చగ ఇంటి స్థలాన్ని కేటాయించారు. సర్వ హక్కులు కల్పించేందుకు ప్రభుత్వ ధర ప్రకారం చదరపు గజానికి రూ.9,500 చొప్పున మొత్తం రూ.47.5 లక్షలు చెల్లించాలని కోరారు. దీన్ని పింఛనులో నెలకు 39,585 చొప్పున పదేళ్లపాటు చెల్లించేందుకు శ్రీనివాసరావు కుటుంబం అంగీకరించింది. దీంతో స్థలానికి ఉత్తర్వులను ఖమ్మం జిల్లా కలెక్టరు వీపీ గౌతమ్ చేతుల మీదుగా 2023 జనవరి ఒకటిన భార్య భాగ్యలక్ష్మికి అందజేశారు. సదరు స్థలానికి గూగుల్ మ్యాప్తో సహా ఖమ్మం అర్బన్ రెవెన్యూ అధికారులు అందించారు.
ప్రహరీ తొలగింపు...
తదుపరి శ్రీనివాసరావు కుటుంబాన్ని కలెక్టరేట్కు పిలిపించి ప్రహరీ నిర్మించుకోవాలని, బోరు వేసుకుని నల్లా కనెక్షను తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు రూ.2 లక్షలు వెచ్చించి సదరు స్థలానికి రెడీమేడ్ ప్రహరీని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఉన్న నిద్రగన్నేరు చెట్టు తొలగించేందుకు ఆ కుటుంబం అటవీ శాఖకు చలానా కూడా చెల్లించింది. కానీ రెండు రోజుల్లోనే సదరు ప్రహరీని రాత్రికిరాత్రి తొలగించడం చర్చనీయాంశమైంది. వేలాది ఎకరాల అటవీ భూమిని కాపాడి ప్రభుత్వానికి విశేష సేవలందించిన మృతుడు శ్రీనివాసరావును అవమానించడమేనంటూ దీనిపై ఈర్లపూడి గ్రామస్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హత్య నేపథ్యమిదీ...
పోడు సాగుకు అడ్డు వస్తున్నాడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు బీట్లో 2022 నవంబరు 22న జరిగిన గొత్తికోయల దాడిలో అటవీ శాఖ ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు(40) మృతి చెందారు. దీనిపై ఆ శాఖ ఉద్యోగులు తీవ్ర నిరసన తెలిపాయి. ఆయన హత్యపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
నీటి పారుదల శాఖ స్థల వివాదం న్యాయస్థానంలో ఉంది. ఎన్నెస్పీ ఉద్యోగులు ఈ స్థలం తమకే కేటాయించాలని గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీఈ కార్యాలయం నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఉత్తర్వులు ఇచ్చినా సదరు స్థలాన్ని శ్రీనివాసరావు కుటుంబానికి స్వాధీనం చేయలేదు. ప్రత్యామ్నాయ స్థలం అన్వేషిస్తున్నాం. త్వరలోనే కలెక్టరు చేతుల మీదుగా అందజేస్తాం.
శైలజ, తహసీల్దారు, ఖమ్మం అర్బన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిషన్ భగీరథ పైప్లైన్ లీక్.. నీరు వృథా
[ 03-05-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం కోర్ట్ ఏరియాలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకైంది. దీంతో భారీగా వరద స్థానిక నివాసాల వద్దకు చేరుకుంది. -
కొనసాగుతున్న హోమ్ ఓటింగ్
[ 03-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎనలేనిది. ఓటు హక్కు పొందడమే కాకుండా వినియోగించుకోవడమూ అత్యంత ప్రధానం. వయోభారం, అంగవైకల్యంతో ఉన్న వారు కొందరు ఓటు హక్కును ఉపయోగించుకోలేక పోతున్నారు. -
గతి తప్పిన గణితం... వికసించని విజ్ఞానం
[ 03-05-2024]
పదోతరగతి ఫలితాల్లో గతంతో పోలిస్తే రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెరుగైన స్థానం దక్కింది. అయితే ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణులు కాలేదు. -
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ను గెలిపించండి: మంత్రులు
[ 03-05-2024]
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. -
ఎగువ, దిగువ సభల్లో ప్రాతినిధ్యం
[ 03-05-2024]
భారత పార్లమెంట్లోని ఎగువ, దిగువ సభల్లో (లోక్సభ, రాజ్యసభ) సభ్యులుగా ఎన్నికైనవారు దేశంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. -
సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ
[ 03-05-2024]
తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ హత్య చేసింది. భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం సుదిమళ్ల పంచాయతీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. -
సౌరమే సౌభాగ్యం
[ 03-05-2024]
ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు మానవాళికి జీవనాధారం.. వెలుగు లేకపోతే మనుగడ లేదు. అలాంటి సూర్యుడికి ఒకరోజు ఉంది. అపరిమితమైన సౌరశక్తిని ఒడిసిపడితే సంప్రదాయ ఇంధన వనరులను తరిగిపోకుండా కాపాడుకోవచ్చు. -
పట్టభద్రులూ ఓటుకు పోటెత్తాలి
[ 03-05-2024]
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ గురువారం వెలువడింది. 2021లో జరిగిన ఎన్నికలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డి ఎన్నికయ్యారు. -
భానుడి భగభగలతో రెడ్ అలర్ట్
[ 03-05-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అత్యధికంగా ఉన్నందున రెడ్ అలర్ట్ (అత్యంత ప్రమాదకర స్థాయి)ను ప్రకటించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేవీఎల్ శిరీష గురువారం తెలిపారు. -
‘ఎర్లీబర్డ్’ రాబడి రూ.15.15 కోట్లు
[ 03-05-2024]
ఐదు శాతం రాయితీతో ఆస్తిపన్ను చెల్లింపునకు పురపాలక శాఖ అవకాశం కల్పించిన నేపథ్యంలో ఉభయ జిల్లాల్లోని నగర, పురపాలికల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: నామా
[ 03-05-2024]
మహాలక్ష్మి పథకం అమలు కోసం మహిళామణులు ప్రభుత్వాన్ని నిలదీయాలని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. -
రఘురాంరెడ్డి గెలుపు చారిత్రక అవసరం: మంత్రి తుమ్మల
[ 03-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మెజార్టీ చరిత్రలో నిలిచిపోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు