సౌరమే సౌభాగ్యం
ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు మానవాళికి జీవనాధారం.. వెలుగు లేకపోతే మనుగడ లేదు. అలాంటి సూర్యుడికి ఒకరోజు ఉంది. అపరిమితమైన సౌరశక్తిని ఒడిసిపడితే సంప్రదాయ ఇంధన వనరులను తరిగిపోకుండా కాపాడుకోవచ్చు.
సౌరమే సౌభాగ్యం శక్తిని ఒడిసిపడితేనే మేలు
ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు మానవాళికి జీవనాధారం.. వెలుగు లేకపోతే మనుగడ లేదు. అలాంటి సూర్యుడికి ఒకరోజు ఉంది. అపరిమితమైన సౌరశక్తిని ఒడిసిపడితే సంప్రదాయ ఇంధన వనరులను తరిగిపోకుండా కాపాడుకోవచ్చు. ఈసారి సరిపడినంత వర్షాలు లేవు. ఇప్పటికే సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జలాశయాల్లో నీరు అడుగంటుతోంది. రాష్ట్రంలో ప్రధానంగా నీటి(హైడల్)తోనే విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. ఇది సరిపోవడం లేదు. బొగ్గు నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్తు(థర్మల్)కు సైతం నీరు కావాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఎప్పటికీ తరిగిపోని సౌరశక్తితో విద్యుత్తును విరివిగా ఉత్పత్తి చేయాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సౌరశక్తి వినియోగం, లోటుపాట్లు వంటి అంశాలపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం...
- ఖమ్మం రోటరీనగర్, న్యూస్టుడే
కాలుష్య రహితం..
సౌరశక్తిని ప్రోత్సహించేందుకు సూర్య దినోత్సవాన్ని ప్రతిపాదించారు. సౌరవిద్యుదుత్పత్తి సమయంలో పర్యావరణానికి ఎటువంటి హాని చేసే ఉద్గారాలు ఉత్పత్తి కావు. అందుకే దీనిని ‘గ్రీన్ ఎనర్జీ’ అంటారు. ఉత్పత్తి అత్యంత చవక. ఎక్కడైనా, ఎంత కొద్ది మొత్తంలోనైనా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. నివాసాలపైనా, ఖాళీ స్థలాల్లో, పంట పొలాల్లో వీటి పలకలను(సోలార్ ప్యానల్స్) ఏర్పాటు చేసుకుని ఇన్వర్టర్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. బ్యాటరీల్లో నిల్వ చేసుకుని వినియోగించుకోవచ్చు.
- సౌర విద్యుత్తు ఉత్పత్తిని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో) ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం(పీఎం సూర్యఘర్ స్కీం)’ ద్వారా ప్రోత్సహిస్తోంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు నడుస్తున్నాయి. ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించడం లక్ష్యం. రూ.78 వేల వరకు రాయితీని అందిస్తున్నారు.
- ఈ విద్యుత్తు ఉపయోగించి కోతులు, ఇతర జంతువుల నుంచి ఇళ్లు, పంట పొలాలకు రక్షణ కల్పించుకోవచ్చు.
- ఉత్పత్తి చేసి మనం వినియోగించుకోగా మిగిలింది ప్రభుత్వానికి విక్రయించవచ్చు. పరికరాలు అమర్చినప్పుడే మిగిలి విద్యుత్తు గ్రిడ్కు వెళ్లేలా అనుసంధానిస్తారు. ఆరునెలలకోసారి మన బ్యాంకు ఖాతాకు డబ్బు చెల్లిస్తారు.
ఇవిగో సౌర వెలుగులు..
- సౌర విద్యుత్తు ఉత్పత్తిలో సమీకృత జిల్లా కలెక్టరు కార్యాలయం ఆదర్శంగా నిలుస్తోంది. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలోని ఈ కార్యాలయం ప్రాంగణంలో 2023 అక్టోబరు నుంచి సౌర ఫలకాలను ఏర్పాటు చేసి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. 100 కేవీఏ హెచ్టీ, 100 కేవీఏ ఎల్టీ సౌర ఫలకాలతో నిత్యం సుమారు 900 యూనిట్ల విద్యుత్తు, నెలకు 24 వేల యూనిట్లు ఉత్పత్తి అవుతోంది. వినియోగించుకోగా మిగిలిన విద్యుత్తును ఆన్గ్రిడ్కు అందజేస్తున్నారు. ప్రతినెలా సుమారు రూ.2 లక్షలకుపైగా విద్యుత్తు బిల్లు ఆదా అవుతోంది.
- ఖమ్మం నగరపాలక సంస్థ చైతన్యనగర్ రూ.10 లక్షల ఖర్చుతో పార్కులో 10 కేవీ సౌర విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు చేసింది.
- నగరపాలక సంస్థ కార్యాలయంపై వంద కిలోవాట్లు, ఆవరణలో 30 కేవీ సౌర విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు రూ.70 లక్షలు ఖర్చు చేస్తున్నారు.
ఏమిటీ దినోత్సవం
1978లో అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ దీన్ని ప్రతిపాదించారు. మే 3న అంతర్జాతీయ సూర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. అమెరికాలో ప్రారంభమైన ఈ ఆచారం ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల్లో పాటిస్తున్నారు.
సద్వినియోగం చేసుకుంటే మేలు...
ప్రస్తుతం సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అందించే ఆన్గ్రిడ్ సర్వీసులు 620 ఉన్నాయి. ఇందులో గృహ విద్యుత్తు 456, వాణిజ్యం 121, చిన్న పరిశ్రమలు 5, పాఠశాలలు/దేవాలయాలు 38 ఉన్నాయి.
ప్రాథమికంగా కొంత ఖర్చుతో కూడుకున్నది కావడంతో ప్రజలు ఆసక్తి చూపడం లేదు. విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంది. ప్రతినెలా చెల్లించే విద్యుత్తు బిల్లు మొత్తాన్ని దీర్ఘకాలం లెక్కిస్తే ఇది తక్కువే. పంట పొలాల్లో సైతం కొద్దిమందే ఏర్పాటు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది
[ 17-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జగదాంబ సెంటర్లో భారాస ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి నిరసన కార్యక్రమం నిర్వహించారు. -
ఖాతాకమామీషు
[ 17-05-2024]
సైబర్ నేరగాళ్ల అక్రమ లావాదేవీలకు బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న ముఠాల మూలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ విస్తరించి ఉంటున్నాయి. -
చిల్లిగవ్వ రాలే..
[ 17-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే ఎన్క్వాస్. -
కాసులు కురిపించిన తల్లాడ చెక్పోస్టు
[ 17-05-2024]
ఖమ్మం జిల్లా తల్లాడలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్టు ఆదాయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. -
గర్భిణులూ.. జాగ్రత్త
[ 17-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత సాధారణ జనాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
సమస్యల పరిష్కారంపైప్రత్యేక దృష్టి: జడ్పీ ఛైర్మన్ కంచర్ల
[ 17-05-2024]
జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. -
వైభవంగా సీతారామ కల్యాణం
[ 17-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
తెలంగాణ ఉద్యమంలో రాందాస్ది కీలక పాత్ర
[ 17-05-2024]
తెలంగాణ తొలితరం ఉద్యమంలో కొలిశెట్టి రాందాస్నాయక్ కీలక పాత్ర పోషించారని ఉద్యమకారుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ అన్నారు. -
మీ పిల్లలతో కథలు చదివిస్తారా..!
[ 17-05-2024]
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో నేటితరం విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకే పరిమితం అవుతున్నారు. -
వ్యవసాయ విద్యకు... సాంకేతిక దన్ను
[ 17-05-2024]
ప్రస్తుతం అన్ని రంగాల్లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. విద్యా రంగంలో సాంకేతికతను ప్రవేశ పెట్టడం విద్యార్థులకు మేలుచేసే అంశమే. -
నెల రోజుల్లో అందుబాటులోకి నూతన విద్యుత్తు ప్లాంటు
[ 17-05-2024]
అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ ఆవరణలో నిర్మాణంలో ఉన్న 2.5మెగావాట్ విద్యుత్తు ప్లాంటు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని టీజీ ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ బి.వి.సుధాకరరెడ్డి తెలిపారు. -
రాయలకు కడసారి వీడ్కోలు
[ 17-05-2024]
భారాస నేత, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో గురువారం పూర్తయ్యాయి. -
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
[ 17-05-2024]
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్
-
స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమా హిట్టవుతుందని చెప్పలేం: సెహ్వాగ్
-
చైనాకు తగ్గి.. భారత్కు పెరిగిన విదేశీ పెట్టుబడులు : ఐరాస
-
ఏపీలో ఎన్నికల ముందు.. తర్వాత హింసపై సిట్ దర్యాప్తు
-
దేశంలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన: కేజ్రీవాల్
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం