రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ను గెలిపించండి: మంత్రులు
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు.
మంచుకొండలో ప్రసంగిస్తున్న మంత్రి తుమ్మల, చిత్రంలో మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి
రఘునాథపాలెం, న్యూస్టుడే: రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. మంచుకొండ సెంటర్లో గురువారం నిర్వహించిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం హస్తం గుర్తుకు ఓటు వేయాలన్నారు. ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల అనంతరం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలవుతుందని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మానుకొండ రాధాకిశోర్, గుత్తా వెంకటేశ్వర్లు, మద్దినేని స్వర్ణకుమారి, మలీదు జగన్, వాంకుడోతు విజయ, దీపక్నాయక్ పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం:లోక్సభ ఎన్నికల్లో భారాస, భాజపాను ఏడు కండేలా లోతు గొయ్యితీసి పాతిపెడదామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. దమ్మాయిగూడెంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. గడిచిన పదేళ్లలో రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జడ్పీటీసీ సభ్యులు బెల్లం శ్రీనివాసరావు, చావా శివరామకృష్ణ, మంగీలాల్, శ్రీను, సురేశ్ పాల్గొన్నారు. డీసీసీబీ డైరెక్టర్ రామసహాయం నరేశ్రెడ్డి మాట్లాడుతుండగా బీరోలుకు చెందిన పలువురు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నరేశ్రెడ్డి మాటలు ఎవరూ వినరని, ఆయన చెబితే ఓటు వేసేవారు కూడా వేయరని కేకలు వేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. నరేశ్రెడ్డి తన వ్యతిరేక వర్గీయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి అతడి మాటలను ఖండించారు.
ఖమ్మం మామిళ్లగూడెం: తాను పక్కా స్థానికుడిని అని కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి స్పష్టం చేశారు. తన స్వగ్రామం కూసుమంచి మండలం చేగొమ్మ అని పేర్కొన్నారు. ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ నాయకులను కలిసి మద్దతు కోరారు. మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ మతోన్మాద, ఫాసిస్ట్ భాజపాను ఓడించాలన్నారు. ఇండియా కూటమికి మద్దతుగా నిలవాలన్నారు. జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాయల చంద్రశేఖర్, గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ఎండీ.జావీద్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది
[ 17-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జగదాంబ సెంటర్లో భారాస ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి నిరసన కార్యక్రమం నిర్వహించారు. -
ఖాతాకమామీషు
[ 17-05-2024]
సైబర్ నేరగాళ్ల అక్రమ లావాదేవీలకు బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న ముఠాల మూలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ విస్తరించి ఉంటున్నాయి. -
చిల్లిగవ్వ రాలే..
[ 17-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే ఎన్క్వాస్. -
కాసులు కురిపించిన తల్లాడ చెక్పోస్టు
[ 17-05-2024]
ఖమ్మం జిల్లా తల్లాడలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్టు ఆదాయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. -
గర్భిణులూ.. జాగ్రత్త
[ 17-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత సాధారణ జనాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
సమస్యల పరిష్కారంపైప్రత్యేక దృష్టి: జడ్పీ ఛైర్మన్ కంచర్ల
[ 17-05-2024]
జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. -
వైభవంగా సీతారామ కల్యాణం
[ 17-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
తెలంగాణ ఉద్యమంలో రాందాస్ది కీలక పాత్ర
[ 17-05-2024]
తెలంగాణ తొలితరం ఉద్యమంలో కొలిశెట్టి రాందాస్నాయక్ కీలక పాత్ర పోషించారని ఉద్యమకారుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ అన్నారు. -
మీ పిల్లలతో కథలు చదివిస్తారా..!
[ 17-05-2024]
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో నేటితరం విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకే పరిమితం అవుతున్నారు. -
వ్యవసాయ విద్యకు... సాంకేతిక దన్ను
[ 17-05-2024]
ప్రస్తుతం అన్ని రంగాల్లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. విద్యా రంగంలో సాంకేతికతను ప్రవేశ పెట్టడం విద్యార్థులకు మేలుచేసే అంశమే. -
నెల రోజుల్లో అందుబాటులోకి నూతన విద్యుత్తు ప్లాంటు
[ 17-05-2024]
అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ ఆవరణలో నిర్మాణంలో ఉన్న 2.5మెగావాట్ విద్యుత్తు ప్లాంటు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని టీజీ ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ బి.వి.సుధాకరరెడ్డి తెలిపారు. -
రాయలకు కడసారి వీడ్కోలు
[ 17-05-2024]
భారాస నేత, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో గురువారం పూర్తయ్యాయి. -
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
[ 17-05-2024]
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
హింసపై ఈసీకి సీఈవో నివేదిక.. కీలక నేతల అరెస్టులకు అవకాశం?
-
రివ్యూ: విద్య వాసుల అహం.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
-
పాక్ వద్ద అణ్వస్త్రాలున్నా.. నిర్వహణకు డబ్బుల్లేవు కదా! - మోదీ
-
ధోనీ నుంచి అసలైన షో చూడబోతున్నాం: భారత మాజీ క్రికెటర్
-
కేజ్రీవాల్ ఇంటి నుంచి వీడియో వెలుగులోకి.. ‘హిట్మ్యాన్’ అంటూ స్వాతీమాలీవాల్ పోస్టు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM