రఘురాంరెడ్డి గెలుపు చారిత్రక అవసరం: మంత్రి తుమ్మల
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మెజార్టీ చరిత్రలో నిలిచిపోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
దమ్మపేట, న్యూస్టుడే: ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మెజార్టీ చరిత్రలో నిలిచిపోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గండుగులపల్లిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకులతో ఆయన మాట్లాడారు. రఘురాంరెడ్డి గెలుపు చారిత్రక అవసరమని చెప్పారు. రాహుల్గాంధీ ప్రధాని కావటంలో తెలంగాణ రాష్ట్రం కీలకస్థానం పోషించనుందన్నారు. దశాబ్దాల కాలంగా ఇందిరాగాంధీ కుటుంబం ప్రాణత్యాగాలతో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిందన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును చూసి, రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీకి ప్రతిపక్షాలు భయపడాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటేడ్ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. ఓటమి భయంతోనే ప్రధాని నరేంద్రమోదీ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ తన స్థాయిని నిలబెట్టుకునే మాటలు మాట్లాడాలన్నారు. పెనుబల్లి మండల భారాస నాయకుడు లక్కినేని వినీల్ మంత్రిని కలుసుకొని అక్కడి రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఎల్లిన రాఘవరావు, సోమరాజు సీతారామారావు, చీకటి రామారావు, కొయ్యల అచ్యుతరావు, కేవీ సత్యనారాయణ, దొడ్డా ప్రసాద్, కాసాని నాగప్రసాద్, ఎర్రా వసంతరావు, మోహన్రావు పాల్గొన్నారు.
గెలిపిస్తే మరింత సేవ చేస్తా: పోరిక
మణుగూరు పట్టణం, అశ్వాపురం: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరు, అశ్వాపురంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆరు గ్యారంటీల అమలుతో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. మహబూబాబాద్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటూ మరింత సేవ చేస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. మిత్రపక్షాల నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. మహబూబాబాద్ లోక్సభ స్థానం పార్టీ సమన్వయకర్త బిక్కసాని నాగేశ్వరరావు, అయోధ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది
[ 17-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జగదాంబ సెంటర్లో భారాస ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి నిరసన కార్యక్రమం నిర్వహించారు. -
ఖాతాకమామీషు
[ 17-05-2024]
సైబర్ నేరగాళ్ల అక్రమ లావాదేవీలకు బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న ముఠాల మూలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ విస్తరించి ఉంటున్నాయి. -
చిల్లిగవ్వ రాలే..
[ 17-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే ఎన్క్వాస్. -
కాసులు కురిపించిన తల్లాడ చెక్పోస్టు
[ 17-05-2024]
ఖమ్మం జిల్లా తల్లాడలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్టు ఆదాయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. -
గర్భిణులూ.. జాగ్రత్త
[ 17-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత సాధారణ జనాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
సమస్యల పరిష్కారంపైప్రత్యేక దృష్టి: జడ్పీ ఛైర్మన్ కంచర్ల
[ 17-05-2024]
జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. -
వైభవంగా సీతారామ కల్యాణం
[ 17-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
తెలంగాణ ఉద్యమంలో రాందాస్ది కీలక పాత్ర
[ 17-05-2024]
తెలంగాణ తొలితరం ఉద్యమంలో కొలిశెట్టి రాందాస్నాయక్ కీలక పాత్ర పోషించారని ఉద్యమకారుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ అన్నారు. -
మీ పిల్లలతో కథలు చదివిస్తారా..!
[ 17-05-2024]
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో నేటితరం విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకే పరిమితం అవుతున్నారు. -
వ్యవసాయ విద్యకు... సాంకేతిక దన్ను
[ 17-05-2024]
ప్రస్తుతం అన్ని రంగాల్లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. విద్యా రంగంలో సాంకేతికతను ప్రవేశ పెట్టడం విద్యార్థులకు మేలుచేసే అంశమే. -
నెల రోజుల్లో అందుబాటులోకి నూతన విద్యుత్తు ప్లాంటు
[ 17-05-2024]
అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ ఆవరణలో నిర్మాణంలో ఉన్న 2.5మెగావాట్ విద్యుత్తు ప్లాంటు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని టీజీ ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ బి.వి.సుధాకరరెడ్డి తెలిపారు. -
రాయలకు కడసారి వీడ్కోలు
[ 17-05-2024]
భారాస నేత, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో గురువారం పూర్తయ్యాయి. -
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
[ 17-05-2024]
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ
-
షర్మిల పిటిషన్.. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
-
మోదీపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు అర్థం లేనివి: రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM