logo

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

నరుకుళ్లపాడు పంచాయతీ పరిధిలోని ఓబులాపురం గ్రామం దగ్గర ఇటుక బట్టీల దగ్గరలో విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన కడారి రవి(54) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. తెల్లదేవరపల్లికి చెందిన కడారి రవి పురుగు మందుల కంపెనీలో

Published : 27 Jan 2022 05:42 IST

మృతుడు కడారి రవి

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే: నరుకుళ్లపాడు పంచాయతీ పరిధిలోని ఓబులాపురం గ్రామం దగ్గర ఇటుక బట్టీల దగ్గరలో విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన కడారి రవి(54) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. తెల్లదేవరపల్లికి చెందిన కడారి రవి పురుగు మందుల కంపెనీలో పని చేస్తున్నాడు. ఇంటి నుంచి మంగళవారం విధులకు వెళ్లి తిరిగి రాలేదు. ఓబులాపురం గ్రామం దగ్గరలో ఇటుక బట్టీల దగ్గర ఒక వ్యక్తి మృతి చెంది ఉన్నాడని బుధవారం ఉదయం రెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌ సిబ్బందికి అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ డి.ఆనంద్‌కుమార్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లారు. మృతుడి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతని భార్య నాగమణి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు, మైలవరం సీఐ శ్రీనులు పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని