logo

చినకామనపూడి పాఠశాలలో కరోనా కలవరం

మండలంలో చినకామనపూడి మండలపరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కొందరు జ్వరాలు, జలుబులతో ఉండటంతో గురువారం కొవిడ్‌

Published : 29 Jan 2022 01:39 IST

చినకామనపూడి (ముదినేపల్లి), న్యూస్‌టుడే: మండలంలో చినకామనపూడి మండలపరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కొందరు జ్వరాలు, జలుబులతో ఉండటంతో గురువారం కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. శుక్రవారం వచ్చిన ఫలితాల్లో నాలుగో తరగతి చదువుతున్న ముగ్గురు, ఆరో తరగతి విద్యార్థి, ఓ ఉపాధ్యాయుడికి పాజిటివ్‌గా తేలిందని హెచ్‌.ఎం. రామోజీ తెలిపారు. పాఠశాల ఆవరణలో బ్లీచింగ్‌ చల్లించామని, పంచాయతీ ఆధ్వర్యంలో శనివారం శానిటైజేషన్‌ చేయిస్తామని వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని