పర్యాటకం.. జగన్నాటకం
నల్లమల్ల.. ఎర్రమల్ల కొండల ప్రాంతం.. నిత్యం శివనామస్మరణ.. నెమలి హొయలు పలికే ‘జల’తరంగాలు.. ఆదిమానవుడు నడిచిన నేల.. పర్యాటక పరంగా అభివృద్ధి చెందాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ తీరుతో నిస్తేజంగా మారింది.
నిధులివ్వని సర్కారు
ఐదేళ్లలో అభివృద్ధి సున్నా
న్యూస్టుడే, నంద్యాల పట్టణం: నల్లమల్ల.. ఎర్రమల్ల కొండల ప్రాంతం.. నిత్యం శివనామస్మరణ.. నెమలి హొయలు పలికే ‘జల’తరంగాలు.. ఆదిమానవుడు నడిచిన నేల.. పర్యాటక పరంగా అభివృద్ధి చెందాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ తీరుతో నిస్తేజంగా మారింది. పర్యాటకుల మదిని దోచుకునే ప్రకృతి అందాలు ఉన్నా ఐదేళ్లుగా నిరాదరణకు గురైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సగటున ఏడాదిలో 40 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. ఇందులో ముఖ్యంగా శ్రీశైలం, మహానంది, యాగంటి, మంత్రాలయం, నందవరం చౌడేశ్వరీ దేవి ఆలయాలకు ఎక్కువగా వస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులు, యాత్రికులతోపాటు రాష్ట్రంలోని పొరుగు జిల్లాలైన వైఎస్సార్, అనంతపురం, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, మహబూబ్నగర్ నుంచి ఎక్కువగా వస్తున్నారు. కానీ యాత్రికులు, భక్తుల సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకపోవడంతో పర్యాటకం దెబ్బతింది.
ఆలయాల్లో అరకొర సౌకర్యాలు
సప్తనదుల సంగమం సంగమేశ్వరం క్షేత్రంలో, కొలనుభారతిలోని సరస్వతి ఆలయం సమీపంలో విడతల వారీగా కాటేజీలను నిర్మిస్తే అటు భక్తులతోపాటు ఇటు పర్యాటకుల వసతులు, సౌకర్యాలు కల్పించినట్లు అవుతుంది. ఈ విషయంపై పర్యాటక శాఖ పలుమార్లు ప్రతిపాదనలు పంపినా లాభం లేదు. దీంతో ఈ ఆలయాలకు వచ్చిన భక్తులు త్వరగా దర్శనం ముగించుకుని తిరిగి వెళ్తున్నారు. ఓర్వకల్లు సమీపంలోని రాక్ గార్డెన్స్లో, కేతవరం సమీపంలోని ఆదిమానవుడు సంచరించిన ప్రాంతంలో సౌండ్ అండ్ లైట్ షోలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పంపినా పట్టించుకునేవారే కరవయ్యారు. మిడుతూరు సమీపంలోని రోళ్లపాడు బట్టమేక సంరక్షణ వద్ద రిసార్టులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నా ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నుంచి స్పందన లేదు.
శాఖల మధ్య కుదరని సమన్వయం
నంద్యాల జిల్లా వెలుగోడు జలాశయం వద్ద 10 ఎకరాల స్థలంలో వినోదాన్ని కల్పించే పార్కు నిర్మాణానికి నాలుగేళ్ల కిందట పర్యాటక శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. రూ.100 కోట్ల వ్యయంతో ఇక్కడ రిసార్టు, హోటల్, పార్కులతోపాటు ఈతకొలను, బోట్ క్లబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థల సేకరణ సమస్యగా మారింది. నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఉన్న స్థలాన్ని పర్యాటక శాఖకు బదిలీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్ద టూరిస్ట్ ప్రాజెక్టు ఏర్పాటు కాలేదు.
అతిథులకు సౌకర్యాలేవీ
- కర్నూలు, నంద్యాల జిల్లాలకు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతోపాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చే ప్రజల కనీస సౌకర్యాల కోసం వివిధ ప్రాంతాల్లో రెస్టారెంట్లు, ఆరోగ్య కేంద్రాలు, రిసార్టుల ఏర్పాటుకు పర్యాటక శాఖ చొరవ చూపినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లభించలేదు.
- పాణ్యం సమీపంలో పర్యాటక రెస్టారెంటుకు 5 ఎకరాలు, సంజామల మండలం నొస్సం గ్రామ సమీపంలో రహదారి పక్కన ఎమ్యూనిటీస్ కోసం 5 ఎకరాలు, కొలిమిగుండ్ల మండలం బోయవారిపల్లె దగ్గర 2.5 ఎకరాలు సేకరించినా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో నిర్మాణాలు జరగలేదు.
- సంగమేశ్వరం క్షేత్రం సమీపంలో కృష్ణా నదిపై నూతనంగా నిర్మించనున్న తీగల వంతెనలో భాగంగా కపిలేశ్వరం వద్ద 10 ఎకరాల్లో రెస్టారెంటు, హెల్త్ కేంద్రం ఏర్పాటు చేయాలని మూడేళ్ల కిందట ప్రతిపాదనలు పంపినా ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు.
పశ్చిమ ప్రాంతాన్ని పట్టించుకోలేదు
కర్నూలు జిల్లాలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ వివిధ ప్రాజెక్టులను డిజైన్ చేసినా కార్యరూపం దాల్చలేదు. ఆదోనిలో రణమండల ఆంజనేయ స్వామి క్షేత్రానికి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ హోటల్, వసతి సౌకర్యాలను కల్పించేందుకు పర్యాటక శాఖ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. గోనెగండ్ల సమీపంలోని గాజులదిన్నె ప్రాజెక్టు వద్ద పర్యాటకుల కోసం గార్డెనింగ్, రిసార్టులు, రెస్టారెంట్ ఏర్పాటుకు పంపిన ప్రతిపాదనలు నాలుగేళ్లుగా దస్త్రాల రూపంలోనే ఉన్నాయి. పెద్దతుంబళం వద్దనున్న జైన్ ఆలయాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తే గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల పర్యాటకులు వస్తే స్థానికంగా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలతోపాటు వ్యాపారపరంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వివిధ నిర్మాణాల కోసం రూ.5 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు మూడేళ్ల కిందటే తయారు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో అడుగు ముందుకు పడలేదు. యర్రగుడి దగ్గర అశోకుని శిలా శాసనాలు ఉన్న ప్రాంతాన్ని హెరిటేజ్ టూరిజంగా అభివృద్ధి చేయాలని భావించి ఆ మేరకు ఏర్పాట్లు చేసినా ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకం లేకపోవడంతో ఆగిపోయాయి.
జగన్నాథగట్టు కానరాని ప్రగతి గట్టు
కర్నూలు నగరానికి ఆనుకొని ఉన్న జగన్నాథగట్టును పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ముందుకు సాగడం లేదు. కొండపైన రిసార్టులు, రెస్టారెంట్లు, కాటేజీలు నిర్మించి పర్యాటకులను ఆకట్టుకుంటే.. కొండ పైనున్న రెండు ఆలయాలు అభివృద్ధి చెందుతాయి. జగన్నాథగట్టు నుంచి ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఈ మార్గం మధ్యలోనే గార్గేయపురం చెరువు, కేతవరం కొండలు, ఓర్వకల్లు విమానాశ్రయం వంటివన్నీ కలిసిపోయే విధంగా అభివృద్ధి పనులు చేయాలనే ప్రతిపాదనకు కష్టాలు తప్పలేదు.
గుహల నిర్వహణ మరిచారు
బెలూం గుహలను 2002లో అప్పటి తెదేపా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ గుహలకు నెలకు వేలాదిగా యాత్రికులు తరలివస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణను మరిచింది. గుహల లోపలి భాగంలో ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో మహానంది క్షేత్రానికి ఏడాది పొడవునా లక్షల్లో యాత్రికులు వస్తుంటారు. ఇక్కడ వినోదాన్ని కల్పించే పార్కులను ఏర్పాటు చేయాలని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణపై శిక్షణ కార్యక్రమం
[ 03-06-2024]
సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణపై జిల్లా కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన ఆధ్వర్యంలో జనరల్ అబ్జర్వర్స్ జాఫర్, మీర్ తారిఖ్ అలీ, బిపుల్ సైకియా సమక్షంలో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
హాలహర్వి లో 64.6 మి.మీ. వర్షపాతం నమోదు
[ 03-06-2024]
హాలహర్వి మండలంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. -
ఎమ్మిగనూరులో 69.2 మి.మీ. వర్షపాతం నమోదు
[ 03-06-2024]
మండలంలో 69.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. -
పక్కాగా లెక్కింపు బలగాల మోహరింపు
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. 4వ తేదీన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కర్నూలు జిల్లాకు సంబంధించి ఓట్ల లెక్కింపు కార్యక్రమం నగర శివారులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరగనుంది. -
నాణ్యతకు నీళ్లొదిలినారు
[ 03-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 200కు పైగా గుర్తింపు ఉన్న నర్సరీలు ఉన్నాయి.. అనధికారికంగా మరో 50కిపైగా నడుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో రామళ్లకోట, పత్తికొండ, గోనెగండ్ల, ఎమ్మిగనూరు, ఓర్వకల్లు, కోడుమూరు తదితర మండలాల్లో ఎక్కువగా నర్సరీలు ఉన్నాయి. -
మహాదేవ.. విధిరాత మార్చవా
[ 03-06-2024]
ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల మహాక్షేత్రంలో పాలనా వ్యవహారాల నిర్వహణకు అవసరమైన ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కీలక పోస్టులు భర్తీ కాకపోవడంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందడం లేదు. ఫలితంగా సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి. -
మద్యానికి బారులు
[ 03-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బార్లు, ప్రభుత్వ మద్యం దుకాణాలు ఆదివారం కిటకిటలాడాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో 175 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 49 బార్లు ఉన్నాయి. -
కూటమిదే విజయం : తిక్కారెడ్డి
[ 03-06-2024]
ఈ నెల 4న ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి నూటికి నూరు శాతం గెలుపు ఖాయమని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించబోతున్నారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
చెంత నీరున్నా చింతే!
[ 03-06-2024]
ఆళ్లగడ్డ 21వ బ్లాక్ వద్ద ఉన్న మేజరు కాల్వ పూడికతీత పనులు గత ఏడాది జూన్లో చేపట్టారు. టెయిల్ఎండ్ పనులు పూర్తికాకపోవడంతో చేపట్టిన పనులన్నీ వృథాగా మారాయి. కాల్వను ఇప్పటికే రైతులు పూడ్చేయడంతో నీటి ప్రవాహం జరగడం లేదు. -
కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
[ 03-06-2024]
జూన్ 4న ఓట్ల లెక్కింపు సిబ్బంది విధులు నిర్వహించేందుకుగాను రెండో ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా.జి.సృజన అబ్జర్వర్లకు వివరించారు. -
వ్యాపారికి రొక్కం.. రైతుకు దుఃఖం
[ 03-06-2024]
ఏటా నాసిరకం విత్తనాలతో అన్నదాత నష్టపోతునే ఉన్నారు. వ్యవసాయ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నాణ్యమైన విత్తనాలు రైతులు ఎంపిక చేసుకోవాలని అధికారులు చెబుతున్నా.. నాణ్యమైన వాటిని అందించడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. -
ఎమర్జెన్సీ వైద్య బృందం ఏర్పాటు చేయండి
[ 03-06-2024]
రాయలసీమ యూనివర్సిటీలోని ప్రతి బ్లాక్లో ఎమర్జెన్సీ వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని, ప్రతి ఫ్లోర్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎమర్జెన్సీ కిట్లను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా.జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. -
లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా చేయాలి
[ 03-06-2024]
ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఆదివారం ఆయన విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహణపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి మృతి.. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీకి మధ్యంతర బెయిల్
-
లోక్సభ ఫలితాలపై ఉత్కంఠ.. ప్రపంచం చూపు భారత్ వైపు!
-
దిల్లీ మద్యం కేసు.. కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 7 వరకు పొడిగింపు..
-
ఉ.కొరియా వర్సెస్ ద.కొరియా.. ‘మిలటరీ డీల్’ రద్దుకు ‘సై’
-
9 ఓట్ల తేడాతో వీళ్లు.. 98శాతం ఓట్లతో వాళ్లు: లోక్సభ ఎన్నికల్లో ఈ రికార్డులు తెలుసా?
-
పేర్ని నాని, సజ్జలను పోలీసులు అదుపులోకి తీసుకోవాలి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి