logo

వైకాపాలో రగడ

పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాలులో ఆదివారం వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక సగర (ఉప్పర) సంఘం నాయకులు ఏర్పాటు చేసిన సమావేశం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వీరశైవ సంఘం ఛైర్మన్‌ రుద్రగౌడ్‌, పట్టణ బ్యాంకు ఛైర్మన్‌ యు.కె.రాజు తదితరులు హాజరయ్యారు.

Published : 29 Apr 2024 02:51 IST

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాలులో ఆదివారం వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక సగర (ఉప్పర) సంఘం నాయకులు ఏర్పాటు చేసిన సమావేశం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వీరశైవ సంఘం ఛైర్మన్‌ రుద్రగౌడ్‌, పట్టణ బ్యాంకు ఛైర్మన్‌ యు.కె.రాజు తదితరులు హాజరయ్యారు. పట్టణంలోని ఉప్పర కల్యాణ మంటపాన్ని ఎమ్మెల్యే అనుచరుడికి అప్పగిస్తున్న ఆనవాయితీ కొనసాగుతోందని, అలా కాకుండా సగర సంఘానికి అప్పగించాలని చేసిన తీర్మానాన్ని వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంలో వైకాపా యువ నాయకులు వీరేంద్ర, శ్రీరామ్‌ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. వీరిద్దరితోపాటు ఉప్పర కల్యాణ మంటపం నిర్వహణ విషయంలో మరికొందరి మధ్య వాగ్వాదం పెట్టుకున్నారు. చివరికి కుల సంఘం పెద్ద సర్దిచెప్పారు. ఉప్పర కల్యాణ మంటపం నిర్వహించే కుల సంఘం నాయకులు దానికి సంబంధించిన లెక్కలు చూపించకపోవడంతో సంఘానికి అప్పగించాలని తీర్మానించినట్లు కుల సంఘం నాయకులు కొందరు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు