logo

విజయోత్సవ ర్యాలీకి వస్తా

సాధారణ ఎన్నికల అనంతరం నందికొట్కూరుకు మళ్లీ వస్తానని, విజయోత్సవ ర్యాలీ చేసుకుందామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Published : 01 May 2024 04:44 IST

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు

 

 మాట్లాడుతున్న తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు

నందికొట్కూరు, న్యూస్‌టుడే : సాధారణ ఎన్నికల అనంతరం నందికొట్కూరుకు మళ్లీ వస్తానని, విజయోత్సవ ర్యాలీ చేసుకుందామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నందికొట్కూరులో ప్రజాగళం సభ ముగిసిన తర్వాత చంద్రబాబు అల్లూరు గ్రామంలోని నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా బాధ్యుడు మాండ్ర శివానందరెడ్డి నివాసం ప్రాంగణంలో తన బస్సులో బస చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మంగళవారం ఉదయం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సైకో జగన్‌ గత ఎన్నికల్లో కోడి కత్తి సానుభూతి పొంది ముఖ్యమంత్రి అయ్యారని, ప్రస్తుతం గులకరాయి నాటకం ఆడుతున్నాడని, ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది వివిధ వేశాలతో ప్రజలను మోసం చేసేందుకు వస్తాడని, అలాంటివి నమ్మకుండా తిప్పి కొట్టాలన్నారు. తెదేపాపై చూపుతున్న ఆదరాభిమానాలను చూస్తే నందికొట్కూరును వదలబుద్ధి కావడం లేదన్నారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌, తెదేపా బాధ్యుడు మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య,  పురపాలక ఉపాధ్యక్షుడు రబ్బాని, నాయకుడు మాండ్ర లింగారెడ్డి  పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని