logo

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని  జేసీ,  నంద్యాల ఎన్నికల అధికారి  రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

Published : 02 May 2024 10:26 IST

నంద్యాల గాంధీ చౌక్: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని  జేసీ,  నంద్యాల ఎన్నికల అధికారి  రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని తహసీల్దార్  కార్యాలయం నుంచి శ్రీనివాస్ సెంటర్,  గాంధీ చౌక్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటును వేయాలని కోరారు.  యువత తమతోపాటు  పరిసర ప్రాంతాల్లో ఉన్న వారి చేత  ఓటు వేయించాలన్నారు. గాంధీ చౌక్ లో సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ నిరంజన్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి , ఎంహెచ్ఓ డాక్టర్. అంకిరెడ్డి, ఎంఈ రమణమూర్తి,  మెప్మా అధికారి విజయభాస్కర్ రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ శర్మ, శివప్రసాద్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు