logo

ఆదర్శ ఉద్యోగులకు అభినందన

ఆర్టీసీకి ఏప్రిల్ నెలలో అధిక ఆదాయం రావడానికి కృషి చేసిన సిబ్బందికి శుక్రవారం నంద్యాల ఆర్టీసీ డిపోలో ఆదర్శ ఉద్యోగులకు అభినందన సభను నిర్వహించారు.

Published : 10 May 2024 19:52 IST

రైతునగరం (నంద్యాల): ఆర్టీసీకి ఏప్రిల్ నెలలో అధిక ఆదాయం రావడానికి కృషి చేసిన సిబ్బందికి శుక్రవారం నంద్యాల ఆర్టీసీ డిపోలో ఆదర్శ ఉద్యోగులకు అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ప్రజా రవాణా అధికారిణి రజియా సుల్తానా హాజరయ్యారు. డిపోకు అధిక ఆదాయం రావడానికి కృషి చేసిన కండక్టర్లు రాయుడు, తిరుపాలు, రాజు, వెంకటేశ్వర్లు, డ్రైవర్లు చంద్రుడు, బాష, రాయుడు, రామయ్య, మనోహర్ రావు, టీపీ రెడ్డిలకు ఆమె ప్రశంసా పత్రాలు, పోత్సాహకాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజరు గంగాధరరావు, అసిస్టెంటు మేనేజర్ మద్దిలేటి నాయుడు, అసిస్టెంటు ఇంజినీరు విజయకుమార్, స్టేషన్ మేనేజరు తిమ్మయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు