మహిళల పెన్నిధి.. చదువుల సన్నిధి!
ఉమ్మడి జిల్లాలోనే ఏకైక మహిళా డిగ్రీ కళాశాలగా ఉన్న మహబూబ్నగర్లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అనేక ప్రత్యేకతలతో ఆదర్శంగా నిలుస్తోంది.
ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నో ప్రత్యేకతలు
కళాశాలలో విద్యార్థినులు
న్యూస్టుడే, మహబూబ్నగర్ విద్యావిభాగం: ఉమ్మడి జిల్లాలోనే ఏకైక మహిళా డిగ్రీ కళాశాలగా ఉన్న మహబూబ్నగర్లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అనేక ప్రత్యేకతలతో ఆదర్శంగా నిలుస్తోంది. 1981లో ఏర్పాటైన ఈ కళాశాలలో అత్యాధునిక వసతులు ఉన్నాయి. అపారమైన అనుభవం కలిగిన అధ్యాపకులు పాఠాలు బోధిస్తూ విద్యార్థినుల భవితకు బాటలు వేస్తున్నారు. సంప్రదాయ డిగ్రీ, పీజీలతో పాటు ఉపాధికి దోహదపడే వినూత్నమైన కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రవేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడి ప్రత్యేకతలపై ‘న్యూస్టుడే’ కథనం.
ఉమ్మడి జిల్లా కేంద్రం నడిబొడ్డున ఏర్పాటు చేసిన కళాశాలలో 2,957 మంది విద్యార్థినులు చదువుతున్నారు. 61 తగరతి గదులు, 31 లెక్చర్ హాల్స్, భౌతిక, రసాయన, వృక్ష, జంతుశాస్త్రాలకు సంబంధించి 13 ప్రయోగశాలలు, నైపుణ్యాలు పెంచే టాస్క్ సెల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ (ప్రత్యేక జిమ్), ప్లేస్మెంట్ సెల్, స్టూడెంట్ వెయిటింగ్ హాల్, క్యాంటీన్ అందుబాటులో ఉన్నాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమంలో బోధన కొనసాగుతోంది. ఒక పీజీ, 14 యూజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సమీపంలోనే బస్టాండు, రైల్వేస్టేషన్, క్రీడా మైదానం, ఆసుపత్రి ఉండటం విద్యార్థినులకు సానుకూలాంశాలు. సుదూర ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చేవారు బస్టాండులో దిగి కళాశాలకు కాలినడకన వెళ్లొచ్చు. సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ఉపాధి రంగాల్లో ఉద్యోగాల సాధనకు అవసరయ్యే నైపుణ్యాలు, కంప్యూటర్ కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఆత్మరక్షణకు యుద్ధ విద్య కూడా నేర్పిస్తారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాలు ఉన్నాయి. ప్రయోగశాలల్లో పీజీ స్థాయి వసతులు ఉన్నాయి. ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో కళాశాలలో నిర్వహిస్తున్న జాబ్ మేళాల్లో రూ.14వేల నుంచి రూ.24వేల వేతనంలో 220 మంది విద్యార్థినులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బీ+ న్యాక్ గ్రేడ్ ఉన్న ఈ కళాశాలకు స్వయం ప్రతిపత్తి సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రవేశ ప్రక్రియ ఇలా..
దోస్త్ వెబ్సైట్లో ఈనెల 25 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. వెబ్ఆప్షన్ల ప్రక్రియ ఈనెల 20 నుంచి ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఈ నెల 30 వరకు ఉంటుంది. జూన్ 3న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 10లోపు విద్యార్థులు రిపోర్టు చేయాలి. రెండో విడత రిజిస్ట్రేషన్లు జూన్ 4 నుంచి ప్రారంభమవుతాయి.
దరఖాస్తులకు ఆహ్వానం
ఈ ఏడాది వివిధ కోర్సుల్లో 1,380 సీట్లు ఉన్నాయి. ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దోస్త్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. నెట్, సెట్, పీహెచ్డీలు విద్యార్హతలు కలిగిన 79 మంది అధ్యాపకులు నాణ్యమైన విద్య అందిస్తారు. ప్రతి విద్యార్థినికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వినూత్నమైన కోర్సులు నిర్వహిస్తున్నాం. టాస్క్తో పాటు అనేక రకాలైన సంస్థలతో ప్రత్యేక ఎంవోయూలు ఉన్నాయి.
డా.ఎం.విజయ్కుమార్, ప్రిన్సిపల్, ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి: డీకే అరుణ
[ 16-06-2024]
పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం దేవరకద్ర మండలం చిన్నరాజమూర్ గ్రామంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. -
పాలమూరుకు కొత్త పాలనాధికారులు
[ 16-06-2024]
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఐఏఎస్ల బదిలీల్లో ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం కలిగింది. ఆయా జిల్లాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏఏఎస్ అధికారులు కలెక్టర్లుగా వస్తున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. -
నాన్నా వందనం.. విజయం నీకంకితం!
[ 16-06-2024]
తల్లి బిడ్డను నవమాసాలు మోస్తే.. తండ్రి పాతికేళ్లు మోస్తాడు. కలలో, మెలకువలో పిల్లల గురించే ఆలోచిస్తాడు. సమాజంలో ఉన్నత స్థానంలో నిలిపేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. ఎంత ఖర్చయినా భరిస్తాడు. -
జనరంజకంగా ప్రజాపాలన
[ 16-06-2024]
రాష్ట్రంలో ప్రజాపాలన జనరంజకంగా కొనసాగుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి పేర్కొన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో పర్యటించారు. -
చిన్నపొర్ల ఘటనలో ఐదుగురి అరెస్టు
[ 16-06-2024]
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. చిన్నపొర్ల ఘటనకు సంబంధించి శనివారం ఆయన ఇక్కడ ఠాణా వద్ద విలేకరులతో మాట్లాడారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
[ 16-06-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలైన ఘటన మహబూబ్నగర్ మండలంలో చోటు చేసుకుంది. గ్రామీణ ఠాణా ఎస్సై విజయ్కుమార్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేటకు చెందిన తౌసిఫ్ అన్వర్ అలీ(20) దేవరకద్ర సమీపంలోని స్విట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. -
భవనాలు శిథిలం.. సమస్యలు అనేకం
[ 16-06-2024]
భాషాభివృద్ధికి, స్వాతంత్య్రోద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన గ్రంథాలయాలు అవసాన దశకు చేరుతున్నాయి. రెండు దశాబ్దాలుగా లైబ్రేరియన్ల నియామకం లేకపోవడంతో జిల్లాలో ఉన్న ఒకరిద్దరికి మూడు, నాలుగు గ్రంథాలయాలకు ఇన్ఛార్జిలుగా నియమించారు. -
సీట్లు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ
[ 16-06-2024]
ఈ చిత్రం శనివారం మధ్యాహ్నం ధన్వాడ కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న మరికల్ ఆంగ్ల మాధ్యమ కేజీబీవీ వద్ద కనిపించింది. ఆరో తరగతి ప్రవేశాల కోసం పిల్లల్ని తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు ఎలాగైనా ప్రవేశం కల్పించాల్సిందిగా ప్రత్యేకాధికారి రాజ్యలక్ష్మికి విన్నవిస్తుండగా తీసింది. -
సుంకేశుల నుంచి నీటి విడుదల
[ 16-06-2024]
వర్షాల ప్రభావంతో తుంగభద్ర నదికి వరద ప్రవాహం పెరగడంతో రాజోలి శివారులోని సుంకేశుల జలాశయం నుంచి 2 గేట్లను ఎత్తి శనివారం నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి జలాశయానికి 18,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. -
గత కలెక్టర్పై భూ అక్రమాల ఆరోపణ
[ 16-06-2024]
జిల్లా కలెక్టర్గా వల్లూరు క్రాంతి పనిచేసిన సమయంలో భూ అక్రమాలకు పాలడ్డారని జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఓఎస్డీ హరిప్రసాద్కు శనివారం సచివాలయంలో ఫిర్యాదు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
-
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
-
నీతి ఆయోగ్ చెప్పిందదే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు
-
తిరుమల ప్రక్షాళనకు వేళాయె..!
-
స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా గెలుపు.. సూపర్8కు ఇంగ్లాండ్
-
దేశవ్యాప్తంగా ప్రారంభమైన సివిల్స్ ప్రాథమిక పరీక్ష