logo

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం ఉండవల్లి మండల పరిధిలోని అలంపూర్‌ చౌరస్తా ఫ్లైఓవర్‌పై జరిగింది.

Published : 29 Apr 2024 12:44 IST

రాజోలి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం ఉండవల్లి మండల పరిధిలోని అలంపూర్‌ చౌరస్తా ఫ్లైఓవర్‌పై జరిగింది. కాసిం(19), అమీర్ అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ నుంచి బనగానపల్లెకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి  జాతీయ రహదారిపై విభాగిని(డివైడర్)ను  ఢీకొట్టింది. ఈ ఘటనలో ఖాసీం అక్కడికక్కడే  మృతి చెందాడు. అమీర్‌  గాయపడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించారు.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొనిపరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని