logo

గద్వాలకు మిషన్‌ భగీరథ తాగునీరిచ్చాం: ఎమ్మెల్యే

గద్వాల పురపాలక సంఘం పరిధిలో అన్ని వార్డుల్లో మిషన్‌ భగీరథ పథకం కింద తాగునీరు అందిస్తున్న ఘనత భారత రాష్ట్ర సమితిదేనని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 08 May 2024 02:50 IST

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గద్వాల పురపాలక సంఘం పరిధిలో అన్ని వార్డుల్లో మిషన్‌ భగీరథ పథకం కింద తాగునీరు అందిస్తున్న ఘనత భారత రాష్ట్ర సమితిదేనని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన పుర పరిధిలోని 20, 21, 31 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. పలు కాలనీల్లో కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఆరు గ్యారంటీలు అందడం లేదని వస్తున్న విమర్శలను పక్కదారి పట్టించడానికి ఈ ఎన్నికల్లో మరో ఐదు గ్యారంటీలంటూ కాంగ్రెస్‌పార్టీ నానా తంటాలు పడుతోందని ఆరోపించారు. భారాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ గురుకుల పాఠశాలలను సమర్ధంగా నిర్వహించి వేలాది మంది విద్యార్థులకు బంగారు బాటలు పరిచారని, అలాంటి వ్యక్తిని లోక్‌సభకు పంపించాలని కోరారు. పుర వైస్‌ ఛైర్మన్‌ బాబర్‌, కౌన్సిలర్లు నాగిరెడ్డి, నరహరిశ్రీనివాసులు, మురళి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు