పిల్లలూ కథలు చదివేద్దామా.!
వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్, సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకుండా వారిలో పఠనాశక్తి పెంచే దిశగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఎన్సీఈఆర్టీ సహకారంతో రూమ్ టూ రీడ్ సంస్థ ‘లిటరసీ క్లౌడ్’ మాధ్యమం ద్వారా ఇంటి వద్దనే ప్రాథమిక స్థాయి విద్యార్థులు కథలు చదువుకునేలా ఏర్పాటు చేసింది.
వేసవి సెలవుల్లో పఠనాశక్తి పెంచుకునేందుకు అవకాశం
లిటరసీ క్లౌడ్ వెబ్ పేజీ
రాజోలి, న్యూస్టుడే: వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్, సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకుండా వారిలో పఠనాశక్తి పెంచే దిశగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఎన్సీఈఆర్టీ సహకారంతో రూమ్ టూ రీడ్ సంస్థ ‘లిటరసీ క్లౌడ్’ మాధ్యమం ద్వారా ఇంటి వద్దనే ప్రాథమిక స్థాయి విద్యార్థులు కథలు చదువుకునేలా ఏర్పాటు చేసింది. వెబ్పేజీలో తెలుగుతో పాటు దేశంలోని అన్ని భాషల్లో వీటిని అందుబాటులో ఉంచారు. ఇవి విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేందుకు ఉపయోగపడతాయి. వివిధ కేటగిరీలు, స్థాయిలలో పుస్తకాలు ఉన్నాయి. కంప్యూటర్, చరవాణిలలో ఆన్లైన్లో చదవడంతో పాటు డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో చదువుకునే వెసులుబాటు ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,200కి పైగా ప్రభుత్వ పాఠశాలలుండగా, 2,450కి పైగా ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో 1 నుంచి 5వ తరగతి వరకు దాదాపు 1.80 లక్షల మందికి పైగా చదువుతున్నారు. వీరంతా ఈ కథల పుస్తకాలను చదివేయొచ్చు.
వెబ్సైట్ ఇలా ఉపయోగించాలి
గూగుల్ సెర్ప్లో www.literacycloud.org వెబ్పేజీ ప్రారంభించాలి. లేదా విద్యాశాఖ ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా సంబంధిత వెబ్పేజీకి వెళ్లొచ్చు. ఇందులో మనకు కోరిన భాషను ఎంచుకోవాలి. తరువాత పిల్లలకు ఆసక్తి ఉన్న కథల పుస్తకాలు, నవలలు, సందేశాత్మక చిత్రాలు, ప్రత్యక్షమవుతాయి. పుస్తకాల్లో ఎక్కువగా చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. నీతి కథలు, యాక్టివిటీ, సిటిజన్షిప్, క్రియేటివిటీ అండ్ టెక్నాలజీ, హెల్త్, నేచురల్ సైన్సు, హిస్టరీ అండ్ కల్చర్, లీడర్ షిప్ మొదలైన కేటగిరీల్లో పుస్తకాలు, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చదవడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, భావవ్యక్తీకరణ సామర్థ్యాలు సైతం మెరుపడనున్నాయి. ఇలా కాకుండా 040-4520 9722 అనే నంబర్కు ఫోన్ చేస్తే రూమ్ టూ రీడ్ సంస్థ అందించే కథలను వినొచ్చు.
చదివిస్తే ఎంతో ఉపయోగం
రూమ్ టూ రీడ్ అనే సంస్థ చిన్న పిల్లల కోసం కథలు వెబ్పేజీలో అందుబాటులో ఉంచింది. తల్లిదండ్రులు చొరవ చూపి పిల్లల చేత వాటిని చదివించడం ద్వారా పఠనా సామర్థ్యం, సృజనాత్మకత పెరుగుతుంది. లిటరసీ క్లౌడ్కు సంబంధించి లింక్, క్యూ ఆర్ కోడ్ అన్ని పాఠశాలల హెచ్ఎంలకు పంపించడం జరిగింది. వారి ద్వారా తల్లిదండ్రులకు చేరుతుంది. లేదా వెబ్సైట్ ద్వారా చూడొచ్చు. వేసవి సెలవుల్లో ఇది ఎంతో ఉపయోగకరం.
ఎస్తేర్రాణి, జిల్లా విద్యాశాఖ సమన్వయ అధికారి, జోగులాంబ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాల్మీకి ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం
[ 16-06-2024]
జిల్లా వాల్మీకి ఉద్యోగ సంఘం, సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఆదివారం గద్వాల్ లోని వాల్మీకి భవన్లో ప్రతిభ చాటిన పదవ తరగతి విద్యార్థులకు పురస్కారాల ప్రదానోత్సవం చేపట్టారు. -
సోమవారం నుంచి వైకుంఠనారాయణ స్వామి ఉత్సవాలు
[ 16-06-2024]
రాజోలి గ్రామంలో ప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచిన శ్రీలక్ష్మి వైకుంఠనారాయణ స్వామి ఉత్సవాలు సోమవారం నుంచి అంగరంగవైభవంగా ప్రారంభంకానున్నాయి. -
సమస్యల మధ్య కొనసాగుతున్న బాలికల విద్య
[ 16-06-2024]
జోగులాంబ గద్వాల జిల్లాలో కస్తూర్బా పాఠశాలల్లో నిర్వహిస్తున్న బాలిక విద్య సమస్యల మధ్య కొనసాగుతుందని భాజపా అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి అన్నారు. -
సుంకేసుల జలాశయం నుంచి నీటి విడుదల
[ 16-06-2024]
రాజోలి శివారులోని సుంకేశుల జలాశయం నుంచి రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. -
అత్తారింట్లో అల్లుడి దారుణ హత్య
[ 16-06-2024]
ఉండవెల్లి మండల కేంద్రంలో అత్తారింటికి వచ్చిన అల్లుడు హత్యకు గురైన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన -
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి: డీకే అరుణ
[ 16-06-2024]
పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం దేవరకద్ర మండలం చిన్నరాజమూర్ గ్రామంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. -
పాలమూరుకు కొత్త పాలనాధికారులు
[ 16-06-2024]
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఐఏఎస్ల బదిలీల్లో ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం కలిగింది. ఆయా జిల్లాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏఏఎస్ అధికారులు కలెక్టర్లుగా వస్తున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. -
నాన్నా వందనం.. విజయం నీకంకితం!
[ 16-06-2024]
తల్లి బిడ్డను నవమాసాలు మోస్తే.. తండ్రి పాతికేళ్లు మోస్తాడు. కలలో, మెలకువలో పిల్లల గురించే ఆలోచిస్తాడు. సమాజంలో ఉన్నత స్థానంలో నిలిపేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. ఎంత ఖర్చయినా భరిస్తాడు. -
జనరంజకంగా ప్రజాపాలన
[ 16-06-2024]
రాష్ట్రంలో ప్రజాపాలన జనరంజకంగా కొనసాగుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి పేర్కొన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో పర్యటించారు. -
చిన్నపొర్ల ఘటనలో ఐదుగురి అరెస్టు
[ 16-06-2024]
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. చిన్నపొర్ల ఘటనకు సంబంధించి శనివారం ఆయన ఇక్కడ ఠాణా వద్ద విలేకరులతో మాట్లాడారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
[ 16-06-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలైన ఘటన మహబూబ్నగర్ మండలంలో చోటు చేసుకుంది. గ్రామీణ ఠాణా ఎస్సై విజయ్కుమార్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేటకు చెందిన తౌసిఫ్ అన్వర్ అలీ(20) దేవరకద్ర సమీపంలోని స్విట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. -
భవనాలు శిథిలం.. సమస్యలు అనేకం
[ 16-06-2024]
భాషాభివృద్ధికి, స్వాతంత్య్రోద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన గ్రంథాలయాలు అవసాన దశకు చేరుతున్నాయి. రెండు దశాబ్దాలుగా లైబ్రేరియన్ల నియామకం లేకపోవడంతో జిల్లాలో ఉన్న ఒకరిద్దరికి మూడు, నాలుగు గ్రంథాలయాలకు ఇన్ఛార్జిలుగా నియమించారు. -
సీట్లు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ
[ 16-06-2024]
ఈ చిత్రం శనివారం మధ్యాహ్నం ధన్వాడ కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న మరికల్ ఆంగ్ల మాధ్యమ కేజీబీవీ వద్ద కనిపించింది. ఆరో తరగతి ప్రవేశాల కోసం పిల్లల్ని తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు ఎలాగైనా ప్రవేశం కల్పించాల్సిందిగా ప్రత్యేకాధికారి రాజ్యలక్ష్మికి విన్నవిస్తుండగా తీసింది. -
సుంకేశుల నుంచి నీటి విడుదల
[ 16-06-2024]
వర్షాల ప్రభావంతో తుంగభద్ర నదికి వరద ప్రవాహం పెరగడంతో రాజోలి శివారులోని సుంకేశుల జలాశయం నుంచి 2 గేట్లను ఎత్తి శనివారం నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి జలాశయానికి 18,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. -
గత కలెక్టర్పై భూ అక్రమాల ఆరోపణ
[ 16-06-2024]
జిల్లా కలెక్టర్గా వల్లూరు క్రాంతి పనిచేసిన సమయంలో భూ అక్రమాలకు పాలడ్డారని జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఓఎస్డీ హరిప్రసాద్కు శనివారం సచివాలయంలో ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివి.. మస్క్ ట్వీట్ వేళ రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
-
రోజుకు 14 గంటల పని.. చేతులపై కాలిన గాయాలు.. 58 మంది బాలకార్మికులకు విముక్తి!
-
ఐర్లాండ్ను ఆదుకున్న డెలానీ, లిటిల్.. పాకిస్థాన్ లక్ష్యం 107
-
తెదేపా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు
-
కోహ్లీ ఆటతీరుపై ఎలాంటి ఆందోళన లేదు.. మద్దతుగా నిలిచిన బ్యాటింగ్ కోచ్