మహమ్మారి బారిన 89 మంది..
జిల్లాలో ఆదివారం 89 మంది కరోనా వైరస్ బారిన పడ్డారని ఇన్ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. యాంటిజెన్ పరీక్షల్లో భాగంగా 1619 మంది
సంగారెడ్డి అర్బన్, న్యూస్టుడే: జిల్లాలో ఆదివారం 89 మంది కరోనా వైరస్ బారిన పడ్డారని ఇన్ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. యాంటిజెన్ పరీక్షల్లో భాగంగా 1619 మంది నమూనాలు సేకరించగా 53 మంది, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో 36 మందికి కొవిడ్ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. పటాన్చెరులో 30, సంగారెడ్డిలో 25, జహీరాబాద్లో 10, నారాయణఖేడ్లో 10, బొల్లారం, కంది, గుమ్మడిదలలో ముగ్గురు చొప్పున, రామచంద్రాపురంలో అయిదుగురికి వైరస్ నిర్ధారణ కాగా.. వారంతా హోం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్: కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా జిల్లాలో ఆదివారం 15,305 మందికి టీకా పంపిణీ చేశామని జిల్లా ఇన్ఛార్జి వైద్యాధికారిణి ఒక ప్రకటనలో తెలిపారు. పీహెచ్సీల స్థాయిలో 2,120, ఆరోగ్య ఉప కేంద్రాల్లో 10,141, పురపాలికల పరిధిలో 1,476, 15-18 ఏళ్ల వయస్సుల వారు 1,512, బూస్టర్ డోస్ 56 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆమె వెల్లడించారు.
3,912 మంది వైరస్ అనుమానితులు
కంది మండలం తున్కిల్లతండాలో జ్వర సర్వే
సంగారెడ్డి అర్బన్, న్యూస్టుడే: జిల్లాలో మూడో రోజైన ఆదివారం జ్వర సర్వేను వైద్యారోగ్యశాఖ సిబ్బంది కొనసాగించారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈనెల 21న ఈ సర్వే ప్రారంభం కాగా.. మూడో రోజు జిల్లా వ్యాప్తంగా 695 గ్రామ పంచాయతీల పరిధిలో 1278 మంది.. బృందాలులుగా ఏర్పడి 77,144 ఇళ్లలో సర్వే చేశారు. 3,912 మందికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి.. అనుమానితులుగా తేల్చారు. వారందరికీ మందుల కిట్లు ఉచితంగా అందజేశారు. ఇప్పటి వరకు సదాశివపేట మండలం ఆత్మకూర్ పీహెచ్సీ పరిధిలో, హత్నూర మండలం చింతల్ చెర్వు, గుమ్మడిదల, రాయికోడ్, న్యాల్కల్, కోహీర్ మండలం దిగ్వాల్ పీహెచ్సీల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటి సర్వే పూర్తయినట్లుగా వైద్యాధికారులు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లోనూ సోమవారం నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని జిల్లా ఇన్ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM