ఫలితాలు మెరుగయ్యేలా..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న వారిలో ఎక్కువ మంది పేదలే. ప్రైవేటు కళాశాలల్లో చదివేందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడమే దీనికి కారణం. తమ పిల్లలను ప్రయోజకుల్ని చేయాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలల్లో చదివిస్తున్నారు.
ఇంటర్ విద్యార్థులకు ప్రతి వారం పరీక్షలు
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న వారిలో ఎక్కువ మంది పేదలే. ప్రైవేటు కళాశాలల్లో చదివేందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడమే దీనికి కారణం. తమ పిల్లలను ప్రయోజకుల్ని చేయాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలల్లో చదివిస్తున్నారు. వాటిలో చదువుతున్న వారిలో ఎక్కువ మంది గట్టెక్కడం లేదు. దీంతో తల్లిదండ్రుల లక్ష్యం నెరవేరని పరిస్థితి. ఇంటర్ బోర్డు తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాల మెరుగుకు బాటలు పడనున్నాయి.
సామర్థ్యానికి మెరుగులు
జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో 8,364 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో కొందరు వ్యవసాయ పనులు, పార్ట్టైం పనులు చేసుకుంటూ తరగతులకు హాజరవుతున్నారు. గత విద్యా సంవత్సరం సగం మంది విద్యార్థులైనా ఉత్తీర్ణులు కాలేదు. ప్రతి సంవత్సరం ఇలాంటి పరిస్థితులే ఉంటున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం పెంపుపై ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి వారం పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోనున్నారు.
ఎంసెట్, నీట్కు సన్నద్ధమయ్యేలా..
ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఎంసెట్, నీట్కు విద్యార్థుల్ని సిద్ధం చేస్తారు. ఇందుకు అధిక మొత్తంలో ఫీజులు నిర్ణయిస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు ఎలాంటి అవగాహన లేకుండా పరీక్షలు రాస్తుండటంతో ర్యాంకుల సాధనలో వెనుకబడుతున్నారు. ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వ కళాశాలల్లోనూ ఎంసెట్, నీట్కు విద్యార్థుల్ని సన్నద్ధం చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా అధ్యాపకులను నియమించడమా, ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకులతోనే శిక్షణ ఇవ్వడమా అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
బోర్డు ఆదేశాలు పాటిస్తాం
-గోవిందరామ్, జిల్లా ఇంటర్ విద్యాధికారి
ఇంటర్ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగుతాం. విద్యార్థులకు ప్రతి వారం పరీక్షలు నిర్వహించడం ద్వారా సామర్థ్యాలను ముందే గుర్తించేందుకు వీలుంటుంది. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారిస్తాం. ఎంసెట్, నీట్పై ఉన్నతాధికారుల ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు