దివ్యమైన ఆత్మవిశ్వాసం..
అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారిలోని కొందరు.. ఏదైనా పని చేయాలంటే వెనుకాడుతుంటారు. కనీస ప్రయత్నమైనా చేయరు. అలాంటిది ఈ దివ్యాంగులు మాత్రం తమ పట్టుదలతో శక్తికి మించి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారిలోని కొందరు.. ఏదైనా పని చేయాలంటే వెనుకాడుతుంటారు. కనీస ప్రయత్నమైనా చేయరు. అలాంటిది ఈ దివ్యాంగులు మాత్రం తమ పట్టుదలతో శక్తికి మించి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. లక్ష్య సాధనకు వైకల్యం అవరోధం కాదని ఇటీవల మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు రచయిత, దివ్యాంగుడు నిక్ వుజిసిన్ ప్రేరణ కల్పించారు. ఈ నేపథ్యంలో స్ఫూర్తిగా నిలిచిన పలువురు దివ్యాంగులపై ‘న్యూస్టుడే’ కథనం.
పట్టుదలతో ముందడుగు
న్యూస్టుడే, కోహెడ గ్రామీణం: ఆత్మవిశ్వాసం, తపన ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపిస్తున్నారు కోహెడ మండలం గుండారెడ్డిపల్లికి చెందిన పాశం నరేందర్రెడ్డి. ఒంటి కాలితో నడవలేని పరిస్థితిలో ఉన్నా సాగు చేస్తూ కుటుంబాన్ని చేదోడుగా నిలిచారు. సైకిల్పై వెనుక కూర్చొని వెళ్లడం నేర్చుకున్నారు. ఆ తర్వాత ద్విచక్ర వాహనం కొనుగోలు చేసి నడపడం నేర్చుకున్నారు. ఇప్పుడు అన్నీ పనులు తానే చేసుకుంటున్నారు. వరితో పాటు మిర్చి సాగు చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. కొంత పొలం వాగు అవతల ఉండగా తెప్పపై నారును అక్కడికి తరలించారు. వ్యవసాయం చేస్తూ ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తూ ఆదర్శంగా నిలిచారు.
ఇటు సాగు.. అటు సేవ..
- న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, కొండాపూర్: చిన్నప్పుడే పోలియో కారణంగా కాళ్లు చచ్చుబడ్డాయి. అయినా ధైర్యం కోల్పోకుండా సాగు చేస్తూ ఆదర్శంగా నిలిచారు కొండాపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన చంద్రశేఖర్. సేంద్రియ విధానంలో కూరగాయలు పండిస్తున్నారు. హరితగృహం ఏర్పాటుచేసి మెరుగైన దిగుబడులు సాధిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన చిరుధాన్యాలతో పాటు బియ్యం కూడా నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. స్వామి వివేకానంద, సత్యసాయి సేవా సమితి ద్వారా సేవా కార్యక్రమాలు సైతం కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎంతోమంది అధికారులు ఈయన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ప్రశంసించారు.
అన్నదాత సేవలో సంతృప్తి
న్యూస్టుడే, కొండపాక గ్రామీణం: శారీరక వైకల్యం ఉన్నా మిగతా వారికంటే తానేమీ తక్కువ కాదంటూ ఏఈవో కొలువు సాధించి స్ఫూర్తిగా నిలిచారు పట్నం విష్ణుకుమార్. కొండపాక మండలం మర్పడ్గ క్లస్టర్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. పాపన్నపేట మండలం దౌలాపూర్కు చెందిన సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడే పోలియో బారిన పడ్డారు. కుడి కాలు వంగిపోయి నడిచేందుకు ఇబ్బందులు ఎదురైనా పొలాల్లో క్షేత్రస్థాయిలో తిరుగుతూ రైతులకు సూచనలు చేస్తున్నారు. తల్లిదండ్రులు యాదమ్మ-అంజయ్య. సోదరి సరిత ఉన్నారు. అగ్రికల్చర్ డిప్లొమా చదివి వ్యవసాయ విస్తరణాధికారి ఉద్యోగాన్ని సాధించారు. వైకల్యం ఉన్నా చురుగ్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు.
కుటుంబానికి చేదోడుగా..
న్యూస్టుడే, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలం చీలపల్లికి చెందిన గొట్టిముక్కల సంగారెడ్డి పుట్టుకతోనే దివ్యాంగుడు. ఆత్మస్థైర్యంతో జీవనం సాగిస్తున్నారు. మల్లారెడ్డి, వెంకటమ్మ ఏకైక కుమారుడైన ఈయనకు పోలియో కారణంగా రెండు కాళ్లు పనిచేయడం లేదు. పట్టుదలతో చదువుకుని డిగ్రీ పూర్తి చేశారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేస్తుంటారు. తనవంతుగా కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే జీవనోపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. ఇంటికి సమీపంలో కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిపై ఆధారపడరు. మండల కేంద్రం నుంచి సరకులను తన బ్యాటరీ త్రిచక్ర వాహనంపై తెచ్చుకుంటారు. దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు