logo

సర్పంచులకు ఉత్తమ పంచాయతీ పురస్కారాలు

దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయతీ సతత్‌ జాతీయ వికాస్‌ పురస్కార్‌లో మండలంలోని ఆయా పంచాయతీలకు అవార్డులు వచ్చాయి. 

Published : 24 Mar 2023 01:11 IST

ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో సర్పంచులు, అధికారులు

మనోహరాబాద్‌, న్యూస్‌టుడే: దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయతీ సతత్‌ జాతీయ వికాస్‌ పురస్కార్‌లో మండలంలోని ఆయా పంచాయతీలకు అవార్డులు వచ్చాయి.  ఈ సందర్బంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీత, మండల ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి సర్పంచులు, కార్యదర్శులకు పురస్కారాలను అందజేశారు. మండలంలోని 13 గ్రామాలు వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. కార్యక్రమంలో డీఎల్పీవో శ్రీనివాస్‌, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, ఎంపీవో లక్ష్మినర్సింహులు  పాల్గొన్నారు.    

రామాయంపేట, న్యూస్‌టుడే: రామాయంపేట మండలంలోని సర్పంచులకు గురువారం పురస్కారాలను అందజేశారు. పలు విభాగాల్లో మార్కులు కేటాయించి అందుకు అనుగుణంగా కేటాయించారు.  ఎంపీపీ భిక్షపతి, వైస్‌ ఎంపీపీ స్రవంతి, ఎంపీడీవో ఉమాదేవి, తహసీల్దార్‌ అబ్దుల్‌ మన్నన్‌ ఎంపీవో గిరిజ పాల్గొన్నారు.

నార్సింగి (చేగుంట): నార్సింగి పంచాయతీకి మూడు విభాగాల్లో పురస్కారం అందజేశారు. ఎంపీపీ సబిత, జడ్పీటీసీ సభ్యుడు కృష్ణారెడ్డి, ఎంపీడీవో ఆనందమేరి, వైస్‌ ఎంపీపీ సుజాత, ఉప సర్పంచి యోగి, ఎంపీటీసీ సభ్యులు సత్యనారాయణ, సుజాత, ఎంపీవో సతీష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని