సత్వర సేవలకు మార్గం
ఇన్నాళ్లు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన కొనసాగిన డీసీసీబీ (జిల్లా సహకార కేంద్ర బ్యాంకు) సేవలు త్వరలో విస్తరించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సిద్దిపేటలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది.
సిద్దిపేటకు డీసీసీబీ ప్రాంతీయ కార్యాలయం
న్యూస్టుడే, సిద్దిపేట
ఇన్నాళ్లు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన కొనసాగిన డీసీసీబీ (జిల్లా సహకార కేంద్ర బ్యాంకు) సేవలు త్వరలో విస్తరించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సిద్దిపేటలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. ఈమేరకు రాష్ట్ర సహకార బ్యాంకు సన్నాహకం చేస్తోంది. పాలన వికేంద్రీకరణతో సత్వర సేవలు సాధ్యం కానున్నాయి. ఇన్నాళ్లు వివిధ సందర్భాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని డీసీసీబీ వరకు వెళ్లాల్సి వచ్చేది. నాబార్డు నుంచి డీసీసీబీకి, అక్కడి నుంచి అనుబంధ శాఖలకు, తద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు రుణ మొత్తాలు చేరుతాయి. వాటి ద్వారా రైతులకు, ఇతర వర్గాలకు లక్ష్యాల మేర రుణాలు అందిస్తుంటారు. డీసీసీబీల్లో అన్ని రకాల రుణాల చెల్లింపు, డిపాజిట్లు, లాకర్లు, ఇతరత్రా సదుపాయాలు కల్పిస్తారు. 2016లోనే జిల్లా ఏర్పాటైనప్పటికీ వికేంద్రీకరణ జరగలేదు. సహకార సంఘాల ఛైర్మన్లు.. డీసీసీబీ పాలకవర్గంలో డైరెక్టర్లు, ఛైర్మన్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. అలాంటపుడు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఎంపికలు, ఎన్నికలు చేపట్టాల్సి వచ్చేది. సిద్దిపేటలో ఏర్పాటైతే ఇక్కడ ప్రత్యేకంగా ఎన్నిక జరిగే అవకాశం ఉంది. డీసీసీబీ శాఖల పరిధిలో రూ.3 లక్షల వరకు రుణ పరిమితిగా ఉంటుంది. అంతకుమించితే సంగారెడ్డి వరకు వెళ్లాల్సి వచ్చేది. సంఘాల అధ్యక్షులు, ఉద్యోగులు వివిధ సమావేశాలకు అక్కడి వరకు వెళ్తుంటారు.
మరింత బలోపేతం
జిల్లాలో ఇప్పటికే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) కంప్యూటరీకరణ పూర్తయింది. సంఘాల ద్వారా ధాన్యం, మొక్కజొన్న, కంది, శనగలు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. సభ్యులకు పంట, వ్యవసాయ అనుబంధ రుణాలు అందిస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు విక్రయిస్తున్నారు. మూడు సొసైటీల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు కొనసాగుతున్నాయి. గత వానాకాలం సీజన్లో 190 కొనుగోలు కేంద్రాల ద్వారా 39,398 మంది రైతుల నుంచి 16.52 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు ద్వారా సత్ఫలితాలు సాధ్యం కానున్నాయి. చిరువ్యాపారులు, మహిళా సంఘాలకు, ఇతరత్రా రంగాల వారికి మేలు చేకూరనుంది. ఈ విషయమై డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డిని ‘న్యూస్టుడే’ సంప్రదించగా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదన్నారు.
జిల్లాలో శాఖలు - 12
ఉద్యోగులు - 102
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు - 21
సభ్యత్వం పొందిన రైతులు - 1,88,125
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM