భాజపా మళ్లీ వస్తే ప్రజల జీవితాలు ఆగం
భాజపా అధికారం చేపట్టిన పదేళ్లలో దేశంలో అసమానతలు పెరిగాయని ఆచార్య కోదండరాం అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సోమవారం తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు ఆగమవుతాయన్నారు.
ఆచార్య కోదండరాం
మాట్లాడుతున్న ఆచార్య కోదండరాం, వేదికపై లక్ష్మారెడ్డి, వీరన్నయాదవ్, సారయ్య, లింగమూర్తి తదితరులు
హుస్నాబాద్, న్యూస్టుడే: భాజపా అధికారం చేపట్టిన పదేళ్లలో దేశంలో అసమానతలు పెరిగాయని ఆచార్య కోదండరాం అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సోమవారం తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు ఆగమవుతాయన్నారు. సంపదను కొంతమందికి దోచి పెడుతున్నారని, కార్పొరేట్ రంగానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. గోమాంసంపై నిషేధ]ం అంటూనే, ఎగుమతిదారుల నుంచి చందాలు తీసుకుందని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థ లైన రైల్వే, సింగరేణి, ఎల్ఐసీ తదితర వాటిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించిందన్నారు. భారత్ జోడో అభియాన్ బాధ్యుడు, ఆచార్య యోగేంద్రయాదవ్ మాట్లాడుతూ మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రజల ఆదరణ లేకపోవడంతో భాజపా మ్యాచ్ఫిక్సింగ్కు పాల్పడిందని ఆరోపించారు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు కన్నెకంటి రవి మాట్లాడుతూ భాజపా ప్రభుత్వ వైఫల్యాలు, రైతు వ్యతిరేక విధానాలను గురించి ప్రజలకు వివరించాలని కోరారు. సదస్సులో నియోజకవర్గ తెలంగాణ ఐకాస కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి, సమన్వయకర్తలు మేకల వీరన్నయాదవ్, డ్యాగల సారయ్య అధ్యక్షత వహించగా విశ్రాంత ఆచార్యులు వీరన్ననాయక్. కాంగ్రెస్, సీపీఐ, ప్రజా సంఘాల ప్రతినిధులు బొలిశెట్టి శివయ్య, కేడం లింగమూర్తి, చిత్తారి రవీందర్, గడిపె మల్లేశ్, కోయడ కొమురయ్య, చెప్యాల ప్రకాశ్, రాజగోపాల్రావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడి.. భద్రత కొరవడి..
[ 21-05-2024]
సర్కారు బడుల్లో రక్షణ కరవైంది. ప్రహరీలు లేక, ఒక వేళా ఉన్నా, ఆకతాయిలు, మందుబాబులు వల్ల ప్రమాదం పొంచి ఉంటోంది. ఆయా మండలాలు, పట్టణాల్లో పాఠశాలలకు కాపలాదారులు లేరు. -
ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తరలించి భరోసా కల్పించాలి
[ 21-05-2024]
కొనుగోలు చేసిన ధాన్యాన్ని సమయానికి రవాణా చేసి రైతులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. -
ప్రత్యేక కమిటీ.. వేధింపుల నివారణకు దివిటీ
[ 21-05-2024]
మున్సిపల్ కార్యాలయాల్లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగుల రక్షణకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆగని ఇసుక దందా
[ 21-05-2024]
ఇసుక అక్రమ రవాణాకు అధికారులు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. వాగులు, నదులు, చెరువులను అక్రమార్కులు ఇష్టానుసారం తవ్వేస్తూ ‘జలసిరి’ని తరలించి జేబులు నింపుకొంటున్నారు. -
ప్రశాంతంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 21-05-2024]
సిద్దిపేటలో సోమవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో 307 మంది అభ్యర్థులు కంప్యూటర్ ఆధారంగా రాశారు. -
రైతులకు జీలుగ విత్తనాలు అందజేత
[ 21-05-2024]
జీలుగు విత్తనాలు లభించడంలేదని రైతులు రోడ్డెక్కిన ఘటన మండల కేంద్రం హవేలిఘనపూర్లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. -
చెత్త సేకరణ.. ఆదాయానికి కార్యాచరణ
[ 21-05-2024]
తూప్రాన్ మండలం మల్కాపూర్లో తడి, పొడి చెత్త సేకరించి కంపోస్టు ఎరువు తయారు చేయడంలో ఆదర్శంగా నిలిచారు. నిత్యం గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్కు తరలించి ఎరువుల తయారు చేసి, -
మామిడి ప్రదర్శనకు వేళాయె
[ 21-05-2024]
మామిడి సీజన్ వచ్చిందంటే అందరికీ గుర్తుకు వచ్చేది సంగారెడ్డిలోని ఫల పరిశోధనా స్థానమే. ఇక్కడ వందలాది రకాల మామిడి ఫలాలు రుచి చూసే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. -
క్రీడా సాధన.. భవితకు నిచ్చెన
[ 21-05-2024]
వేసవి సెలవుల్లో విద్యార్థులు చరవాణులతో కాలక్షేపం చేస్తుంటారు. సెల్ఫోన్లపై నుంచి పిల్లల ధ్యాసను మళ్లించాలన్న సంకల్పంతో పలువురు ఆటలు, యోగా ఉచితంగా నేర్పించేందుకు ముందుకొచ్చారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి బలవన్మరణం
[ 21-05-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు, కడుపు నొప్పితో సతమతం అవుతున్న ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నారు. -
తేనెటీగల పెంపకంతో ఉపాధి
[ 21-05-2024]
తేనెటీగల పెంపకంతో రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని మధ్య తెలంగాణ మండల సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి పేర్కొన్నారు. -
ధరణి సేవల్లో తాత్సారం
[ 21-05-2024]
అధికారులు సమయపాలన పాటించకపోవడం.. సిబ్బంది నిర్లక్ష్యంతో తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్లు, ధరణి సేవల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. -
గ్యాస్ రీఫిల్లింగ్.. ఇద్దరిపై కేసు
[ 21-05-2024]
రాయితీ గ్యాస్ను అక్రమంగా రీఫిల్లింగ్ చేసి విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేశామని సదాశివపేట సీఐ మహేష్గౌడ్ తెలిపారు. -
జిల్లాకు మూడు కస్తూర్బాలు మంజూరు
[ 21-05-2024]
బాలికల విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మేరకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాకు మూడు కస్తూర్బా బాలికల విద్యాలయాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
పుర పాలన గాడిన పడేదెలా?
[ 21-05-2024]
కొన్ని నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు.. ఇటీవల లోక్సభ ఎన్నికలు పూర్తికావడంతో ప్రభుత్వం స్థానిక సంస్థలపై దృష్టి సారించింది. -
‘కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే’
[ 21-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని టీపీసీసీ ఇంటలెక్చువల్ ఛైర్మన్, క్రమశిక్షణ సంఘం సభ్యుడు అనంతుల శ్యామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. -
సర్కారు బడులు..ఆదర్శం చాటేలా..
[ 21-05-2024]
సర్కారు బడుల్లో అత్యధిక శాతం పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుతుంటారు. ఈ తరుణంలో కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా చదువును అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
సిబ్బంది తగ్గుముఖం.. రిజిస్ట్రేషన్లలో జాప్యం
[ 21-05-2024]
చాలీచాలని సిబ్బందితో సరైన వసతులు లేక జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవహారాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయాన్ని అందించే కార్యాలయాల నిర్వహణలో పలు లోపాలు తలెత్తుతున్నాయి. -
ప్రయాణ ప్రాంగణ స్థలాన్ని కబ్జా.. కాపాడాలని వినతి
[ 21-05-2024]
ప్రజలకు ఉపయోగపడే ప్రయాణ ప్రాంగణం స్థలాన్ని కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకొని పరిరక్షించాలని నంగునూరు మండలం బద్దిపడగ గ్రామానికి చెందిన పలువురు సోమవారం కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ అధికారిణి దేవకిదేవికి వినతిపత్రం అందజేశారు. -
పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలి
[ 21-05-2024]
భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని స్థిరాస్తి వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజలింగం డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ టాప్-2 జట్లలో వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేరా..!
-
ఆ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్
-
ఆస్పత్రికి వెళ్తే దంపతులపై విరిగిపడిన చెట్టు.. భర్త మృతి
-
నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు: స్వాతి మాలీవాల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కాకాణి అవినీతిపై పెద్ద పుస్తకమే రాయొచ్చు: సోమిరెడ్డి