స్వీప్ నడవడి.. చైతన్య ఒరవడి
ప్రజాస్వామ్య పరిరక్షణలో ‘ఓటు’ పాత్ర అనిర్వచనీయం. పారదర్శకమైన పాలన సాకారం కావాలంటే.. ఒకవేళ ఎన్నికైన తరువాత నిలదీసే హక్కు పొందాలంటే.. ఓటు సద్వినియోగంతోనే సాధ్యం.
న్యూస్టుడే, సిద్దిపేట
వర్గల్ మండలంలో ప్రదర్శన
ప్రజాస్వామ్య పరిరక్షణలో ‘ఓటు’ పాత్ర అనిర్వచనీయం. పారదర్శకమైన పాలన సాకారం కావాలంటే.. ఒకవేళ ఎన్నికైన తరువాత నిలదీసే హక్కు పొందాలంటే.. ఓటు సద్వినియోగంతోనే సాధ్యం. ఆ దిశగా ఓటర్లలో చైతన్యం రావాల్సి ఉంది. ఓటున్నా వేయకపోతే ఐదేళ్లు మదనపడాల్సిందే. ఈ తరుణంలో స్వీప్ (సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిస్పేషన్) ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో చైతన్యానికి తనవంతు పాత్ర పోషిస్తోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో చేపడుతున్న కార్యక్రమాల తీరుతెన్నులపై ‘న్యూస్టుడే’ కథనం.
ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాలో ఏటా ఓటరు నమోదుకు చక్కటి స్పందన లభిస్తోంది. అయితే పోలింగ్లో మాత్రం కొన్ని ప్రాంతాలు వెనుకబడుతుండటం గమనార్హం. స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో పర్వాలేదనిస్తున్నా.. లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో అధికార యంత్రాంగం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. శతశాతం పోలింగ్ నమోదుకు ముందు నుంచి కృషి చేస్తున్నా.. పోలింగ్ రోజున ఫలితం కనిపించడం లేదు. హక్కు ఉన్నప్పటికి వివిధ కారణాలతో వినియోగించుకోవడం లేదు. ఈ క్రమంలోనే గతేడాది శాసనసభ ఎన్నికల ముందు నుంచి స్వీప్ యంత్రాంగం.. ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపడుతోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోనూ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
వివిధ కార్యక్రమాలతో..
పోలింగ్ గడువుకు సమీపిస్తున్న తరుణంలో రానున్న రోజుల్లోనూ చైతన్య ఒరవడిని కొనసాగించేందుకు అధికారులు సంకల్పించారు. సిద్దిపేట జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక పట్టణాల్లో పరుగు, యువతీ, యువకుల సమన్వయంతో ఫ్లాష్మాబ్లు చేపట్టారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో విస్తృతంగా చైతన్య కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. జిల్లా, మండల సమాఖ్యలు, వీవోలతో సమావేశం నిర్వహిస్తూ ఓటు ప్రాధాన్యాన్ని చెబుతున్నారు. రంగోలి, గోరింటాకు ఇతర రూపాల్లో స్వీప్ తనదైన ప్రత్యేకతను చాటుతోంది.
ముందంజలో యువ కేంద్రం..
ఎన్వైకే (నెహ్రూ యువ కేంద్రం) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 నుంచే ప్రజా చైతన్యం తేవడం ఆరంభించారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో ఫ్లాష్మాబ్లు చేపట్టారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఓట్ఫర్ రన్ నిర్వహించారు. మరోవైపు సంగారెడ్డిలో ఇంటింటా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్వైకే, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువజన సంఘాలు సంయుక్తంగా చైతన్యం తెస్తున్నాయి. పారదర్శకంగా ఓటు వేయాలంటూ వివరిస్తున్నారు. పట్టణాల్లో పోలింగ్ తక్కువ నమోదువుతున్న దృష్ట్యా ప్రత్యేకంగా దృష్టి సారించారు. పోలింగ్ శాతం పెంచేందుకు ఇంటింటా తిరుగుతూ.. ఇతర ప్రాంతాల్లో ఉండే వారిని రావాల్సిందిగా కోరుతున్నారు. వాట్సాప్ల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నారు. వీధి నాటకాల ప్రదర్శనకు సన్నద్ధమవుతున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో యువకులు, కళాకారులను భాగస్వాములను చేయనున్నారు.
అన్ని వర్గాలకు చేరితే ఫలితం..
ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఒకప్పటితో పోల్చితే ఈసారి అన్ని వర్గాల వారిని చైతన్యం తేవడంలో ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించకపోవడం గమనార్హం. పోలింగ్కు మరో 11 రోజులే మిగిలి ఉన్న దృష్ట్యా అన్ని వర్గాల్లో ‘ఓటు’పై చర్చ చేపట్టేలా కృషి చేస్తే మెరుగైన ఫలితం రావడం ఖాయం. వినూత్న అంశాలకు ప్రాధాన్యం ఇస్తే పోలింగ్ శాతం పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. మూసధోరణికి భిన్నంగా యోచిస్తే.. ఇట్టే ఆకట్టుకోవచ్చు. యువ భాగస్వామ్యం పెంచాల్సిన ఆవశ్యకత ఉంది.
హక్కుపై అవగాహన..
స్వీప్ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో గ్రామీణ స్థాయి నుంచి అవగాహన కల్పించేందుకు అడుగులు వేస్తున్నారు. గ్రామాల్లో బీఎల్వోలు ఇంటింటికి తిరుగుతూ ఓటు ప్రాధాన్యంపై అవగాహన కల్పిస్తున్నారు. సీ-విజిల్ యాప్ ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో కళాకారులతో కళాజాత కార్యక్రమాలు నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు. మున్సిపాలిటీల్లో హోర్డింగ్ల ద్వారా ప్రదర్శన చేపట్టారు. టోల్ ఫ్రీ నెం.1950పై చైతన్యం తీసుకొచ్చారు. సీ-విజిల్ యాప్ ప్రాధాన్యాన్ని చెబుతున్నారు. విద్యాసంస్థల్లో ఓటరు నమోదు, చైతన్య కార్యక్రమాలు, అన్ని వర్గాలు ఓటు వేసేలా ప్రచారం చేపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడి.. భద్రత కొరవడి..
[ 21-05-2024]
సర్కారు బడుల్లో రక్షణ కరవైంది. ప్రహరీలు లేక, ఒక వేళా ఉన్నా, ఆకతాయిలు, మందుబాబులు వల్ల ప్రమాదం పొంచి ఉంటోంది. ఆయా మండలాలు, పట్టణాల్లో పాఠశాలలకు కాపలాదారులు లేరు. -
ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తరలించి భరోసా కల్పించాలి
[ 21-05-2024]
కొనుగోలు చేసిన ధాన్యాన్ని సమయానికి రవాణా చేసి రైతులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. -
ప్రత్యేక కమిటీ.. వేధింపుల నివారణకు దివిటీ
[ 21-05-2024]
మున్సిపల్ కార్యాలయాల్లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగుల రక్షణకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆగని ఇసుక దందా
[ 21-05-2024]
ఇసుక అక్రమ రవాణాకు అధికారులు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. వాగులు, నదులు, చెరువులను అక్రమార్కులు ఇష్టానుసారం తవ్వేస్తూ ‘జలసిరి’ని తరలించి జేబులు నింపుకొంటున్నారు. -
ప్రశాంతంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 21-05-2024]
సిద్దిపేటలో సోమవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో 307 మంది అభ్యర్థులు కంప్యూటర్ ఆధారంగా రాశారు. -
రైతులకు జీలుగ విత్తనాలు అందజేత
[ 21-05-2024]
జీలుగు విత్తనాలు లభించడంలేదని రైతులు రోడ్డెక్కిన ఘటన మండల కేంద్రం హవేలిఘనపూర్లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. -
చెత్త సేకరణ.. ఆదాయానికి కార్యాచరణ
[ 21-05-2024]
తూప్రాన్ మండలం మల్కాపూర్లో తడి, పొడి చెత్త సేకరించి కంపోస్టు ఎరువు తయారు చేయడంలో ఆదర్శంగా నిలిచారు. నిత్యం గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్కు తరలించి ఎరువుల తయారు చేసి, -
మామిడి ప్రదర్శనకు వేళాయె
[ 21-05-2024]
మామిడి సీజన్ వచ్చిందంటే అందరికీ గుర్తుకు వచ్చేది సంగారెడ్డిలోని ఫల పరిశోధనా స్థానమే. ఇక్కడ వందలాది రకాల మామిడి ఫలాలు రుచి చూసే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. -
క్రీడా సాధన.. భవితకు నిచ్చెన
[ 21-05-2024]
వేసవి సెలవుల్లో విద్యార్థులు చరవాణులతో కాలక్షేపం చేస్తుంటారు. సెల్ఫోన్లపై నుంచి పిల్లల ధ్యాసను మళ్లించాలన్న సంకల్పంతో పలువురు ఆటలు, యోగా ఉచితంగా నేర్పించేందుకు ముందుకొచ్చారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి బలవన్మరణం
[ 21-05-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు, కడుపు నొప్పితో సతమతం అవుతున్న ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నారు. -
తేనెటీగల పెంపకంతో ఉపాధి
[ 21-05-2024]
తేనెటీగల పెంపకంతో రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని మధ్య తెలంగాణ మండల సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి పేర్కొన్నారు. -
ధరణి సేవల్లో తాత్సారం
[ 21-05-2024]
అధికారులు సమయపాలన పాటించకపోవడం.. సిబ్బంది నిర్లక్ష్యంతో తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్లు, ధరణి సేవల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. -
గ్యాస్ రీఫిల్లింగ్.. ఇద్దరిపై కేసు
[ 21-05-2024]
రాయితీ గ్యాస్ను అక్రమంగా రీఫిల్లింగ్ చేసి విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేశామని సదాశివపేట సీఐ మహేష్గౌడ్ తెలిపారు. -
జిల్లాకు మూడు కస్తూర్బాలు మంజూరు
[ 21-05-2024]
బాలికల విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మేరకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాకు మూడు కస్తూర్బా బాలికల విద్యాలయాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
పుర పాలన గాడిన పడేదెలా?
[ 21-05-2024]
కొన్ని నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు.. ఇటీవల లోక్సభ ఎన్నికలు పూర్తికావడంతో ప్రభుత్వం స్థానిక సంస్థలపై దృష్టి సారించింది. -
‘కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే’
[ 21-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని టీపీసీసీ ఇంటలెక్చువల్ ఛైర్మన్, క్రమశిక్షణ సంఘం సభ్యుడు అనంతుల శ్యామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. -
సర్కారు బడులు..ఆదర్శం చాటేలా..
[ 21-05-2024]
సర్కారు బడుల్లో అత్యధిక శాతం పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుతుంటారు. ఈ తరుణంలో కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా చదువును అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
సిబ్బంది తగ్గుముఖం.. రిజిస్ట్రేషన్లలో జాప్యం
[ 21-05-2024]
చాలీచాలని సిబ్బందితో సరైన వసతులు లేక జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవహారాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయాన్ని అందించే కార్యాలయాల నిర్వహణలో పలు లోపాలు తలెత్తుతున్నాయి. -
ప్రయాణ ప్రాంగణ స్థలాన్ని కబ్జా.. కాపాడాలని వినతి
[ 21-05-2024]
ప్రజలకు ఉపయోగపడే ప్రయాణ ప్రాంగణం స్థలాన్ని కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకొని పరిరక్షించాలని నంగునూరు మండలం బద్దిపడగ గ్రామానికి చెందిన పలువురు సోమవారం కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ అధికారిణి దేవకిదేవికి వినతిపత్రం అందజేశారు. -
పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలి
[ 21-05-2024]
భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని స్థిరాస్తి వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజలింగం డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్
-
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
-
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు
-
‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. తమ ఎంపీకి భాజపా షోకాజ్ నోటీసులు
-
‘ఫ్యామిలీస్టార్’కు నెగెటివ్ టాక్ ఇలా క్రియేట్ చేశారు: ఆనంద్ దేవరకొండ
-
నోరుజారి ఇరకాటంలో పడి.. ఉపవాసానికి సిద్ధమై: వివాదం వేళ భాజపా నేత పోస్టు