‘శత’శాతం ప్రగతి..!
నిర్దిష్ట ప్రణాళికకు శ్రమించే తత్వం తోడయితే.. సత్ఫలితాలు సాధ్యం. ఉపాధ్యాయుల అనుశీలన.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనేక సర్కారు బడులు శతశాతం ఫలితాలు సాధించి భళా అనిపించాయి.
‘పది’ వార్షిక ఫలితాల్లో సత్తా చాటిన సర్కారు బడులు
శత శాతం ఫలితాలు సాధించిన మెదక్ కస్తూర్బా పాఠశాల
న్యూస్టుడే, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి మున్సిపాలిటీ: నిర్దిష్ట ప్రణాళికకు శ్రమించే తత్వం తోడయితే.. సత్ఫలితాలు సాధ్యం. ఉపాధ్యాయుల అనుశీలన.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనేక సర్కారు బడులు శతశాతం ఫలితాలు సాధించి భళా అనిపించాయి. సకాలంలో పదో తరగతి సిలబస్ను పూర్తి చేసిన నిర్వాహకులు.. పునఃశ్చరణ ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దారు. వెనుకబడిన అంశాల్లో సందేహాలను నివృత్తి చేసి వెన్నుతట్టారు. తరచూ పరీక్షలు నిర్వహించి స్థైర్యాన్ని పెంచారు. ఉపాధ్యాయ బృందం సమష్టి తత్వం.. ఎప్పటికప్పుడు విద్యార్థులకు చేసిన దిశానిర్దేశం అనేక పాఠశాలల్లో ‘పది’లో మెరుగైన ఫలితాలను సాకారం చేసింది.
ఫలితాలతో దూసుకెళ్లి
ఏటా సిద్దిపేట జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు శతశాతం ఫలితాలతో దూసుకెళ్తున్నాయి. జిల్లాలో మొత్తం 26 మండలాలు ఉండగా.. తొమ్మిది మండలాల్లోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులంతా పాసవడం గమనార్హం. అక్కన్నపేట, చిన్నకోడూరు, ధూల్మిట్ట, కొండపాక, మద్దూరు, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట, రాయపోల్ మండలాలు ఈ ఘనతను సాధించాయి. జిల్లా వ్యాప్తంగా జడ్పీ, ఉన్నత పాఠశాలలు - 179, గురుకులాలు - 27, కస్తూర్బాలు-20, ఆదర్శ - 11, ఆశ్రమ -1 పాఠశాలలు శతశాతం ఫలితాలను సాధించాయి. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ సారి అనేక పాఠశాలలు మెరుగయ్యాయి. ప్రత్యేక తరగతుల నిర్వహణ, అధికారుల ప్రత్యేక చొరవతో ఇది సాధ్యమైంది.
ప్రత్యేక శ్రద్ధ వహించి..
మెదక్ జిల్లాలో ఈసారి పదిలో ఉత్తమ ఫలితాలు వచ్చాయి. ఉత్తమ ఫలితాల సాధనకు సర్కారు బడుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ, నిత్యం పరీక్షలు నిర్వహించి, వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ప్రత్యేకంగా మెటీరియల్ అందించారు. 37 జిల్లా పరిషత్తు పాఠశాలలు, ఎనిమిది కస్తూర్బా, 3 చొప్పున ఆదర్శ పాఠశాలలు, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమ గురుకులాలు, 2 గిరిజన గురుకులాలు, ఒక మైనార్టీ పాఠశాలు శతశాతం సాధించిన జాబితాలో ఉన్నాయి. గత విద్యాసంవత్సరం కంటే ఈ సారి 12 పాఠశాలల్లో శతశాతం ఫలితాలు వచ్చాయి.
పాఠశాలకో ఇన్ఛార్జి
సంగారెడ్డి జిల్లాలో వంద శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలు గతంలో కంటే ఈ సారి పెరిగాయి. ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో ప్రత్యేకంగా మూడు నెలల పాటు పాఠాల బోధనకు ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించారు. జిల్లా, మండల స్థాయి అధికారులకు ఒక్కో పాఠశాలను ఇన్ఛార్జిగా నియమించారు. వారంతా వారంలో మూడు రోజులు పిల్లల ప్రగతిని పరిశీలించి కల్టెకర్కు నేరుగా నివేదికలు ఇచ్చారు. ఇలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఫలితాలు సాధ్యమయ్యాయి. ఉపాధ్యాయులు వెనుకబడిన వారిని దత్తత తీసుకొని చదివించారు. ప్రభుత్వ 124, కస్తూర్బా 12, ఆదర్శ పాఠశాలలు 8, సాంఘిక సంక్షేమ గురుకులాలు 10, బీసీ గురుకులాలు 10 వరకు శతశాతం సాధించిన వాటిలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడి.. భద్రత కొరవడి..
[ 21-05-2024]
సర్కారు బడుల్లో రక్షణ కరవైంది. ప్రహరీలు లేక, ఒక వేళా ఉన్నా, ఆకతాయిలు, మందుబాబులు వల్ల ప్రమాదం పొంచి ఉంటోంది. ఆయా మండలాలు, పట్టణాల్లో పాఠశాలలకు కాపలాదారులు లేరు. -
ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తరలించి భరోసా కల్పించాలి
[ 21-05-2024]
కొనుగోలు చేసిన ధాన్యాన్ని సమయానికి రవాణా చేసి రైతులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. -
ప్రత్యేక కమిటీ.. వేధింపుల నివారణకు దివిటీ
[ 21-05-2024]
మున్సిపల్ కార్యాలయాల్లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగుల రక్షణకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆగని ఇసుక దందా
[ 21-05-2024]
ఇసుక అక్రమ రవాణాకు అధికారులు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. వాగులు, నదులు, చెరువులను అక్రమార్కులు ఇష్టానుసారం తవ్వేస్తూ ‘జలసిరి’ని తరలించి జేబులు నింపుకొంటున్నారు. -
ప్రశాంతంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 21-05-2024]
సిద్దిపేటలో సోమవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో 307 మంది అభ్యర్థులు కంప్యూటర్ ఆధారంగా రాశారు. -
రైతులకు జీలుగ విత్తనాలు అందజేత
[ 21-05-2024]
జీలుగు విత్తనాలు లభించడంలేదని రైతులు రోడ్డెక్కిన ఘటన మండల కేంద్రం హవేలిఘనపూర్లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. -
చెత్త సేకరణ.. ఆదాయానికి కార్యాచరణ
[ 21-05-2024]
తూప్రాన్ మండలం మల్కాపూర్లో తడి, పొడి చెత్త సేకరించి కంపోస్టు ఎరువు తయారు చేయడంలో ఆదర్శంగా నిలిచారు. నిత్యం గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్కు తరలించి ఎరువుల తయారు చేసి, -
మామిడి ప్రదర్శనకు వేళాయె
[ 21-05-2024]
మామిడి సీజన్ వచ్చిందంటే అందరికీ గుర్తుకు వచ్చేది సంగారెడ్డిలోని ఫల పరిశోధనా స్థానమే. ఇక్కడ వందలాది రకాల మామిడి ఫలాలు రుచి చూసే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. -
క్రీడా సాధన.. భవితకు నిచ్చెన
[ 21-05-2024]
వేసవి సెలవుల్లో విద్యార్థులు చరవాణులతో కాలక్షేపం చేస్తుంటారు. సెల్ఫోన్లపై నుంచి పిల్లల ధ్యాసను మళ్లించాలన్న సంకల్పంతో పలువురు ఆటలు, యోగా ఉచితంగా నేర్పించేందుకు ముందుకొచ్చారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి బలవన్మరణం
[ 21-05-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు, కడుపు నొప్పితో సతమతం అవుతున్న ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నారు. -
తేనెటీగల పెంపకంతో ఉపాధి
[ 21-05-2024]
తేనెటీగల పెంపకంతో రైతులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని మధ్య తెలంగాణ మండల సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి పేర్కొన్నారు. -
ధరణి సేవల్లో తాత్సారం
[ 21-05-2024]
అధికారులు సమయపాలన పాటించకపోవడం.. సిబ్బంది నిర్లక్ష్యంతో తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్లు, ధరణి సేవల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. -
గ్యాస్ రీఫిల్లింగ్.. ఇద్దరిపై కేసు
[ 21-05-2024]
రాయితీ గ్యాస్ను అక్రమంగా రీఫిల్లింగ్ చేసి విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేశామని సదాశివపేట సీఐ మహేష్గౌడ్ తెలిపారు. -
జిల్లాకు మూడు కస్తూర్బాలు మంజూరు
[ 21-05-2024]
బాలికల విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మేరకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాకు మూడు కస్తూర్బా బాలికల విద్యాలయాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
పుర పాలన గాడిన పడేదెలా?
[ 21-05-2024]
కొన్ని నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు.. ఇటీవల లోక్సభ ఎన్నికలు పూర్తికావడంతో ప్రభుత్వం స్థానిక సంస్థలపై దృష్టి సారించింది. -
‘కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే’
[ 21-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని టీపీసీసీ ఇంటలెక్చువల్ ఛైర్మన్, క్రమశిక్షణ సంఘం సభ్యుడు అనంతుల శ్యామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. -
సర్కారు బడులు..ఆదర్శం చాటేలా..
[ 21-05-2024]
సర్కారు బడుల్లో అత్యధిక శాతం పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుతుంటారు. ఈ తరుణంలో కార్పొరేట్ విద్యాలయాలకు దీటుగా చదువును అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
సిబ్బంది తగ్గుముఖం.. రిజిస్ట్రేషన్లలో జాప్యం
[ 21-05-2024]
చాలీచాలని సిబ్బందితో సరైన వసతులు లేక జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవహారాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయాన్ని అందించే కార్యాలయాల నిర్వహణలో పలు లోపాలు తలెత్తుతున్నాయి. -
ప్రయాణ ప్రాంగణ స్థలాన్ని కబ్జా.. కాపాడాలని వినతి
[ 21-05-2024]
ప్రజలకు ఉపయోగపడే ప్రయాణ ప్రాంగణం స్థలాన్ని కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకొని పరిరక్షించాలని నంగునూరు మండలం బద్దిపడగ గ్రామానికి చెందిన పలువురు సోమవారం కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ అధికారిణి దేవకిదేవికి వినతిపత్రం అందజేశారు. -
పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలి
[ 21-05-2024]
భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని స్థిరాస్తి వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజలింగం డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలుడి ర్యాష్ డ్రైవింగ్తో ఇద్దరి మృతి
-
అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికా-రష్యా మాటల యుద్ధం
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ అభ్యర్థన వెనక స్టార్ హీరో సతీమణి
-
ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ సీటీఓ సూచనలు
-
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?: కేటీఆర్
-
రత్న భాండాగారంపై మోదీ వ్యాఖ్యలు.. ధ్వజమెత్తిన స్టాలిన్