Suryapet: ఉద్యోగం పేరుతో మోసం.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ఉద్యోగాల పేరిట యువతీ, యువకులు మోసపోతూనే ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ..
చింతలపాలెం, న్యూస్టుడే: ఉద్యోగాల పేరిట యువతీ, యువకులు మోసపోతూనే ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ..మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు గుంజుతూ మోసాలకు పాల్పడుతున్నారు.. వారి వలలో పడి ఓ యువతి మోసపోయి ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కొత్తగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. విద్యార్థిని స్నేహితులు తెలిపినవివరాల ప్రకారం.. కొత్తగూడేనికి చెందిన కర్లపూడి సుబ్బారావు రెండో కుమార్తె కర్లపూడి మౌనిక(22) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మౌనిక కోదాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం ఇస్తారని చెప్పి ఇటీవల ఆమెను కొందరు నమ్మించారు.
వారిమీద నమ్మకంతో ఆమె స్నేహితురాలి వద్ద రూ. 28 వేలు అప్పుగా తీసుకుంది. అవికూడా ఆన్లైన్లో స్నేహితుల కుటుంబ సభ్యుల డెబిట్ కార్డు ద్వారా చెల్లించినట్లు స్నేహితులు చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తామన్న వ్యక్తుల నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. ఈ క్రమంలో డబ్బులిచ్చిన స్నేహితులకు సమాధానం చెప్పడంలో ఆమె మానసిక ఒత్తిడికి లోనైంది. కొంతమొత్తం చెల్లించింది. ఐనా.. ఒత్తిడి రావడంతో పాటు కళాశాల హెచ్వోడీ ఒకరు ఈ డబ్బుల విషయంలో జోక్యం చేసుకుని స్నేహితుల వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి వెంటనే ఇవ్వాలన్నారు. లేకపోతే పరీక్ష హాల్ టికెట్ ఇవ్వమని హెచ్చరించారు. దీంతో మరింత మానసిక ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలోనే దసరా సెలవులు ప్రకటించడంతో మౌనిక ఈ మధ్యనే ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం తల్లిదండ్రులు పొలానికి వెళ్లడంతో.. విషయం ఎవరికి చెప్పలేక ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది.
చుట్టుపక్కల వారు గమనించి ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న స్నేహితులు కొత్తగూడెంలోని మృతురాలి ఇంటివద్దకు గురువారం రాత్రి చేరుకున్నారు. స్నేహితురాలి మృతికి జాబ్ ఇప్పిస్తామని మోసం చేసిన వారు, డబ్బులిచ్చి ఒత్తిడి చేసిన వారు, హెచ్వోడీనే కారణమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్వోడీ ఇక్కడికొచ్చి ఆమె తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతురాలి ఇంటివద్దకు చేరి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎవరి నిర్వాకమో గానీ తమ కూతురు నిండు ప్రాణాల్ని బలితీసుకుందని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నందున ఫిర్యాదునివ్వాలని మృతురాలి తల్లిదండ్రులను తాము కోరగా వారు ఇవ్వమని చెప్పినట్లు ఎస్సై సైదిరెడ్డి తెలిపారు. కొందరు కళాశాల వారి తరఫున వచ్చి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరికో పట్టం..!
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసి అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయింది.గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. బూత్లు, గ్రామాల వారీగా ఓట్ల లెక్కలతో కుస్తీ పడుతున్నారు. -
ప్రవేశాల సమయం.. సన్నద్ధతతో విజయం
[ 15-05-2024]
ఇంటర్మీడియట్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తొలి విడత ప్రక్రియ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రారంభించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
చైతన్యకొండ..!
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు స్థానాల్లోనూ భారీగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల్లో తుది గణాంకాలను మంగళవారం వెల్లడించింది. -
ఆమె ఇంట్లోనే ఉండిపోయింది..!
[ 15-05-2024]
ఉమ్మడి జిల్లాలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహిళలు ఓటింగ్కు అంతగా ఆసక్తి చూపలేదు. జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో ఓటర్ల పరంగా మహిళలే ముందంజలో ఉన్నప్పటికీ పోలింగ్ -
ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలు స్ట్రాంగ్రూంలకు తరలించారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ అసెంబ్లీ -
ఆయువు తీస్తున్న పిడుగు
[ 15-05-2024]
నిన్నా మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో ప్రజలు బెంబేలెత్తారు. ఇటీవల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. -
అటకెక్కిన చలువ పైకప్పు
[ 15-05-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపుతూనే ఉన్నాడు. మేఘాలు కమ్ముకొన్నప్పుడు మినహా ఈ నెలలో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో 40పైగా డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. -
మళ్లీ అగ్రస్థానమే..!
[ 15-05-2024]
భువనగిరి లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఓటుకు జైకొట్టారు. ఎన్నికేదైనా మరోసారి రాష్ట్రంలో అగ్రస్థానాన్ని నిలుపుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా.. అత్యధికంగా ఇక్కడే 76.78శాతం నమోదు కావడం విశేషం. -
బాలికల విద్యకు భరోసా.. కస్తూర్బా
[ 15-05-2024]
ప్రస్తుత కాలంలో కార్పొరేటు స్థాయి పాఠశాల, కళాశాల విద్యనభ్యసించాలంటే దూర ప్రాంతాలకు వెళ్లి రూ.లక్షలు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు తమ పిల్లల చదువు కోసం అన్ని రూపాయలు ఖర్చు పెట్టాలంటే సాధ్యం కానీ విషయమే. -
ఎన్నికలు తెచ్చిన లాభాలు!
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆర్టీసీ లాభాల పంట పండింది. ఎన్నికలకు ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లా నుంచి 290 బస్సులను అద్దె ప్రాతిపదికన పంపగా.. సుమారు రూ.1.50 కోట్ల ఆదాయం రాగా.. -
పల్లెవించె.. పట్టణం నీరసించె
[ 15-05-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణంలోనే ఓటర్లు ఎక్కువ చైతన్యం చూపారు. దేవరకొండ లాంటి మారుమూల ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ శాతం తక్కువగా నమోదైనా 2019 ఎన్నికలతో పోలిస్తే పెరిగింది. -
రద్దీ తగ్గింది
[ 15-05-2024]
జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తగ్గింది. వచ్చిన వాహనాలు వచ్చినట్టుగా టోల్ప్లాజాను దాటి హైదరాబాద్ వైపు వస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే విజయవాడ వైపు నుంచి హైదరాబాద్కు పంతంగి టోల్గేట్లోంచి 30వేల వాహనాలు వచినట్లు లెక్క తేలింది. -
బోర్లు, బావులవైపే ఆసక్తి
[ 15-05-2024]
సాగర్ ఆయకట్టులో ఈసారి వానాకాలంలో సైతం బావులు, బోర్లు నీటి వనరులుగా మారే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఎల్నినో ప్రభావం జులై వరకు ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుండటంతో ఆగస్టులో వర్షాలు పడతాయనే నమ్మకం కలుగుతోంది. -
వరస చోరీలతో కర్షకుల కంటతడి
[ 15-05-2024]
ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతున్న కర్షకులకు నియంత్రికలు, వ్యవసాయ మోటార్లలో రాగితీగను అపహరించే దొంగల ముఠాలు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. -
ట్రావెల్ బస్సు ఢీకొని కార్మికుడి మృతి
[ 15-05-2024]
తుప్రాన్పేట శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం టారిఫ్లు మన దగ్గరే తక్కువ: ఎయిర్టెల్ సీఈఓ
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
-
తెలంగాణలో వర్సిటీల ఉపకులపతుల నియామకానికి ఈసీ అనుమతి
-
మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు గుడ్న్యూస్.. కేవైసీ నిబంధనల్లో సడలింపు
-
మళ్లీ కలిసిన కేఎల్ - సంజీవ్ గోయెంకా.. అభిమానికి గంభీర్ స్వీట్ రిప్లయ్!